వాహనాలు ఇలా.. చెత్త సేకరణ ఎలా?
వాహనాలు మరమ్మతులకు గురి కావడంతో వ్యర్థాలు, చెత్త సేకరణపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటిని బాగు చేయించకపోవడంతో నెలల తరబడి మూలన పడి ఉంటున్నాయి. ఫలితంగా వార్డుల్లో సేకరణ సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
మరమ్మతులు చేయించని అధికారులు
న్యూస్టుడే, వేములవాడ
వాహనాలు మరమ్మతులకు గురి కావడంతో వ్యర్థాలు, చెత్త సేకరణపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటిని బాగు చేయించకపోవడంతో నెలల తరబడి మూలన పడి ఉంటున్నాయి. ఫలితంగా వార్డుల్లో సేకరణ సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వాహనం రాని రోజు స్థానికులు చెత్తను సమీపంలోని ఖాళీ స్థలాలు, రహదారులు పక్కన, మురుగు కాలువల్లో వేస్తున్నారు. దీంతో వార్డుల్లో పారిశుద్ధ్యం లోపిస్తుంది.
వేములవాడలో ట్రాక్టర్లు, ఆటోల ద్వారా రోజుకు దాదాపు 20 టన్నుల చెత్త, వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఇందులో చాలా వరకు వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఆటోల టైర్లు, ఇంజిన్లు, ఇతరత్రా పాడవ్వడంతో ఇప్పటికే దాదాపు 8 ఆటోలు మూలకు చేరాయి. దీంతో ఉన్న ఆటోలు, ట్రాక్టర్లనే వార్డుల్లో తిప్పి అగ్రహారంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. వాహనాల కొరత కారణంగా పట్టణంలో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తీవ్ర జాప్యంతో...
వాహనాలు మరమ్మతులకు గురై నెలలు గడుస్తున్నా బాగు చేయించడంలో పురపాలక సంఘం అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. పాడైన వాటిని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో, సినారె కళామందిరం వద్ద, గ్యారేజీ తదితర ప్రాంతాల్లో పక్కన పెట్టారు. నెలల తరబడి వీటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో వాహనాల కొరత ఏర్పడి పట్టణంలో చెత్త సేకరణపై ప్రభావం చూపుతోంది. అయినా అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
డంపింగ్ యార్డులుగా ఖాళీ స్థలాలు
మున్సిపల్ అధికారుల అలసత్వం కారణంగా పట్టణంలో చాలా ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. వార్డుల్లోకి వాహనాలు రాకపోవడంతో స్థానికులు ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం వేస్తున్నారు. పట్టణంలోని బైపాస్ రోడ్డు ప్రాంతాలు, వీఐపీ రోడ్డు చెరువు వైపు పోస్తున్నారు. కొందరు కోళ్ల వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని బైపాస్ రోడ్ల చివరి ప్రాంతాల్లో వేస్తుండటంతో పారిశుద్ధ్యం లోపించడంతో పాటు దుర్వాసన వస్తోంది. ఇలాంటి ప్రాంతాల్లో పోయకుండా కట్టడి చేయాల్సిన మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం పేరుకుపోతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వాహనాలకు మరమ్మతులు చేయించి వార్డుల్లో పూర్తిస్థాయిలో తిప్పాలని పట్టణవాసులు కోరుతున్నారు.
పూర్తి స్థాయిలో సేకరణకు చర్యలు
- కిరణ్కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్, వేములవాడ
పట్టణంలో పూర్తి స్థాయిలో చెత్త, వ్యర్థాల సేకరణ జరుగుతోంది. కొన్ని ఆటోలకు చిన్న చిన్న మరమ్మతులున్నాయి. వారం రోజుల్లో చేయిస్తాం. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దని ముమ్మరంగా ప్రచారం కల్పిస్తున్నాం. అయినా కొన్ని ప్రాంతాల్లో వేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి జరిమానా వేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.