విహంగాల పాలిట ఆపద్బాంధవుడు
ఆయన నిజంగానే గాయపడిన పక్షుల పాలిట ఆపద్బాంధవుడే...వేలాది పక్షులకు ఆయన శుశ్రూష చేసి గాయాల్ని నయం చేశారు. ఎక్కడ పక్షి దెబ్బలతో విలవిల్లాడుతోందని సమాచారం అందినా క్షణాల్లో స్వచ్ఛంద సేవకులు అక్కడ ప్రత్యక్షమై వాటిని ప్రగతి ప్రతిష్ఠాన ఆధ్వర్యంలోని పక్షుల ఆసుపత్రికి తీసుకొస్తారు. ఒకసారి ఆయన చేతుల్లోకి చేరిందంటే ఇక ఆ పక్షి ప్రమాదం నుంచి గట్టెక్కినాననే ధీమాతో ఉంటుందంటే
అజయ్ జైన్ చేతిలో సేదతీరుతున్న బుజ్జి పక్షి
మైసూరు, న్యూస్టుడే: ఆయన నిజంగానే గాయపడిన పక్షుల పాలిట ఆపద్బాంధవుడే...వేలాది పక్షులకు ఆయన శుశ్రూష చేసి గాయాల్ని నయం చేశారు. ఎక్కడ పక్షి దెబ్బలతో విలవిల్లాడుతోందని సమాచారం అందినా క్షణాల్లో స్వచ్ఛంద సేవకులు అక్కడ ప్రత్యక్షమై వాటిని ప్రగతి ప్రతిష్ఠాన ఆధ్వర్యంలోని పక్షుల ఆసుపత్రికి తీసుకొస్తారు. ఒకసారి ఆయన చేతుల్లోకి చేరిందంటే ఇక ఆ పక్షి ప్రమాదం నుంచి గట్టెక్కినాననే ధీమాతో ఉంటుందంటే అతిశయోక్తికాదు. నగరానికి చెందిన అజయ్ జైన్ అనే మంచి మనిషికి పక్షులంటే అమితమైన ప్రేమ. ఒకసారి దెబ్బతిన్న పక్షికి తగిన చికిత్స లభించడంలో ఎదురైన కష్టాలే ఆయనను పక్షుల కోసమే ప్రత్యేక ఆసుపత్రిని నెలకొల్పేందుకు ప్రేరేపించిందంటారు. కొన్నేళ్ల క్రితం కృష్ణరాజ సాగర జలాశయం దిగువన ఉన్న బృందావన్ గార్డెన్స్లో బలమైన ఈదురుగాలుల కారణంగా అక్కడి పక్షుల కేంద్రం ధ్వంసమైన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భంలో చెట్లు నేలకొరగడం, షెడ్లు కూలడంతో వందలాది పక్షులు మృత్యువాతపడ్డాయి. అంతే సంఖ్యలో పక్షులు (ఎక్కువగా కొంగ జాతి) క్షతగాత్రులుగా మారాయి. విషయాన్ని తెలుసుకున్న అజయ్ జైన్ హుటాహుటిన అక్కడకు చేరుకుని వాటిని సంరక్షించారు. తగిన చికిత్సను అందించడంతో త్వరలోనే అవి కోలుకున్నాయి. ఇలాంటి సంఘటనలు అజయ్ జైన్ జీవితంలో బోలెడన్ని ఎదురయ్యాయని అంటారు. సాధారణంగా అనేక పక్షులు విద్యుత్తు తీగలు తగలడం వల్ల తీవ్ర గాయాలతో కిందపడుతుంటాయి. అనేక సందర్భాల్లో ఉడుతలకూ ఇదే దుస్థితి. ఇలాంటివన్నీ అజయ్ జైన్ చెంతకు చేరుతంటాయి. స్వతహాగా పశువైద్యుడు కానప్పటికీ మంచి మనసున్న మనిషిగా ప్రముఖ పశువైద్యుల వద్ద చికిత్సా పద్ధతుల్ని నేర్చుకుని ఇప్పుడు అత్యాధునిక వైద్య సేవల్ని వాటికోసమే అందిస్తున్నారు. మహా మానవతావాదిగా పేరుతెచ్చుకున్న అజయ్కి అనేక పురస్కారాలు లభించాయి.
గాయాలైన రామచిలుకను చికిత్స కోసం తీసుకొచ్చారు
నాకూ చికిత్స కావాలంటున్న ఉడుత పిల్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?