logo

కారణజన్ముడు ఎన్టీఆర్‌

తెలుగుజాతి కీర్తిని ప్రపంచానికి చాటిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని అఖిల భారత తెలుగు అకాడమీ అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి అఖిల భారత తెలుగు అకాడమీ బెంగళూరు, తెలుగు సాంస్కృతి

Updated : 28 Jun 2022 03:43 IST

ఎన్టీఆర్‌ శతజయంతి కాలమానిని ఆవిష్కరిస్తున్న అఖిలభారత తెలుగుఅకాడమీ అధ్యక్షుడు

గారపాటి రామకృష్ణ, రమేష్‌, శ్రీనివాసులు తదితరులు

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: తెలుగుజాతి కీర్తిని ప్రపంచానికి చాటిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని అఖిల భారత తెలుగు అకాడమీ అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి అఖిల భారత తెలుగు అకాడమీ బెంగళూరు, తెలుగు సాంస్కృతిక సమితి మైసూరు సంయుక్తాధ్వర్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను మైసూరు రాజరాజేశ్వరీ దేవస్థానం సభాభవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్‌ రాజకీయ, కళారంగానికి, సమాజానికి విశిష్ట సేవలందించిన కారణజన్ముడని కొనియాడారు. ఈ సందర్భంగా బళ్లారి నగరానికి చెందిన సమాజసేవకురాలు, యువ రాజకీయ నాయకురాలు ఉజ్వల శ్రీధర్‌కు ఎన్టీఆర్‌ జాతీయ స్మారక పురస్కారం అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో మహిళా బ్యాంకు అధ్యక్షురాలు రేణుక రవి, తెలుగు సాంస్కృతిక సమితి కార్యదర్శి శ్రీనివాస్‌రావు, కావేరి కమ్మ సంఘం కార్యదర్శి టి.రమేష్‌, సౌత్‌సెంటర్‌ అధ్యక్షుడు రవీంద్ర, శ్రీనివాసనాయుడు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని