నటనలో మిన్న.. మీ మనసే వెన్న!
నెలమంగల తాలూకా సోలదేవనహళ్లిలోని స్థానికుల కోసం సీనియరు నటి లీలావతి ప్రాథమిక ఆసుపత్రిని నిర్మించారు. ఇన్పేషెంట్, ఔట్ పేషెంట్ల చికిత్స కోసం వైద్యులు, సిబ్బందిని నియమించారు.
అలనాటి నటి లీలావతిని సత్కరిస్తున్న బొమ్మై
బెంగళూరు (గ్రామీణం), న్యూస్టుడే : నెలమంగల తాలూకా సోలదేవనహళ్లిలోని స్థానికుల కోసం సీనియరు నటి లీలావతి ప్రాథమిక ఆసుపత్రిని నిర్మించారు. ఇన్పేషెంట్, ఔట్ పేషెంట్ల చికిత్స కోసం వైద్యులు, సిబ్బందిని నియమించారు. దాత లీలావతిని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై బుధవారం మధ్యాహ్నం ఘనంగా సత్కరించి ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. మీరెంత అందంగా ఉంటారో.. మీ హృదయం అంతే అందమని ప్రస్తుతించారు. గ్రామాభివృద్ధిని కాంక్షిస్తూ ఆసుపత్రి సదుపాయాన్ని ప్రారంభించిన మీ పేరును అందరూ చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని ప్రశంసించారు. కథానాయికగా, సహాయ నటిగా పలు సంవత్సరాలు కన్నడ చిత్ర పరిశ్రమలో మీదైన శైలిలో నటించి, కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారని కొనియాడారు. ప్రభుత్వం తరఫునే ఇక్కడ వైద్యులు సేవలు అందించేందుకు, అదనపు సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. స్థానికంగా పశువైద్యశాలను కూడా త్వరలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఈ ఏడాది రూ.7 కోట్ల ఖర్చుతో 100 సముదాయ ఆరోగ్య కేంద్రాలను నిర్మించిందని, మరో 71 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో లీలావతి కుమారుడు వినోద్ రాజ్, ఎమ్మెల్యేలు శ్రీనివాసమూర్తి, నాగరాజ్, సరిహద్దు అభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు డాక్టర్ సి.సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు