అర్ధరాత్రి బియ్యం వ్యాపారి దారుణహత్య
బళ్లారి నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి మంజు అలియాస్ కుంటె మంజునాథ(42)గా గుర్తించారు. ఎస్పీ సైదులు అడావత్ నేతృత్వంలో నగర డీఎస్పీ శేఖరప్ప, సీఐ వాసుకుమార్ బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమేరాల దృశ్యాలను స్వాధీనం చేసుకొని గాలింపు ప్రారంభించారు.
కుంటె మంజునాథ (పాతచిత్రం)
బళ్లారి, న్యూస్టుడే: బళ్లారి నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి మంజు అలియాస్ కుంటె మంజునాథ(42)గా గుర్తించారు. ఎస్పీ సైదులు అడావత్ నేతృత్వంలో నగర డీఎస్పీ శేఖరప్ప, సీఐ వాసుకుమార్ బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమేరాల దృశ్యాలను స్వాధీనం చేసుకొని గాలింపు ప్రారంభించారు. నగరంలోని చంద్రకాలనీలో నివాసముంటున్న కుంటె మంజునాథ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ద్విచక్రవాహనంపై హెచ్.ఆర్.గవియప్ప కూడలి నుంచి కౌల్బజార్ మొదటి గేటు మీదుగా రేడియోపార్క్ (డైట్ కళాశాల) దాటగానే అప్పటి వరకు వెంబడించిన ఇద్దరు వ్యక్తులు అతనిపై వెంట తెచ్చుకున్న కారం పొడి చల్లారు. ఇళ్లలోకి కారం పొడి పడటంతో అక్కడే బైకును విడిచి మంజునాథ పరుగులు తీశాడు. ఇద్దరు వ్యక్తులు వెంబడించి వెంట తెచ్చుకున్న ఆయుధాలతో అతని తలపై నరకగా అక్కడే కూలిపోయాడు. రక్తపు మడుగులో మంజునాథ పడిపోవడంతో దుండగులు వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కౌల్బజార్ సీఐ వాసుకుమార్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి విమ్స్కు తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌల్బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు
సీసీఫుటేజీ స్వాధీనం
మంజునాథ హత్య దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమేరాల్లో నిక్షిప్తమయ్యాయి. సుమారు 1.30 నుంచి 2.30 గంటల మధ్య కుంటె మంజునాథ హత్యకు గురైనట్లు అందులో సమయం నమోదైంది. సీసీకెమేరాల్లో దృశ్యాలను చూస్తే దుండగుల నుంచి మంజునాథ తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఓ వ్యక్తి వెంబడించినా దీటుగా ఎదుర్కొన్నాడు. ఓ నిమిషం పాటు ఇద్దరి నడుమ పెనుగులాట జరిగింది. ఇంతలో మరో వ్యక్తి రావడంతో ఇద్దరు కలిసి మంజునాథను రోడ్డుపై పడేసి వెంట తెచ్చుకున్న ఆయుధాలతో నరికి అతను చనిపోయినట్లు నిర్ధారించుకొని వెళ్లిపోయిన దృశ్యాలు సీసీకెమేరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఎవరీ కంటె మంజునాథ
బళ్లారి నగరం వరబసప్ప గుడి ప్రాంతానికి చెందిన కుంటె మంజునాథ ఈ మధ్య కాలంలో స్థానిక టి.బి.శ్యానిటోరియం రహదారిలోని చంద్ర కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. బళ్లారి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా చౌకదుకాణాలకు సరఫరా చేస్తున్న బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి, వాటిని రాత్రికిరాత్రే లారీల్లో లోడింగ్ చేసి వేర్వేరు ప్రాంతాలకు ఎగుమతి చేసేవాడని సమాచారం. మంగళవారం రాత్రి కూడలి వరబసప్ప గుడి ప్రాంతంలో కూడా ఓ లారీలో చౌకబియ్యం పంపి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో రేడియోపార్్్కలో హత్యకు గురయ్యాడు. మంజునాథ బియ్యం వ్యాపారంతో పాటు, మట్కా, స్థిరాస్తి వ్యాపారంలోకి కూడా దిగాడు. ఇతనిపై అక్రమ బియ్యం తరలింపు, ఇతర ఎనిమిది కేసులు ఉన్నాయి. గతంలో ఇతనిపై రెండుసార్లు హత్యాయత్నం చేశారు. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. బియ్యం వ్యాపారం చేస్తున్న వారి మధ్య విభేదాలు రావడంతో ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాని ఆధారంతో బళ్లారి నగరంలో అక్రమంగా బియ్యం వ్యాపారస్తులు వారితో పాటు, కుంటె మంజునాథతో పరిచయం ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.
మంజునాథపై కేసులు ఉన్నాయి-ఎస్పీ సైదులు అడావత్
హత్యకు గురైన కుంటె మంజునాథపై గతంలో పలు కేసులు ఉన్నాయి. బియ్యం వ్యాపారం, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. హతుడి సోదరుడు అశోక్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌల్బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ శేఖరప్ప, నేతృత్వంలో సీఐ వాసుకుమార్ తదితర పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సైదులు అడావత్ తెలిపారు. మట్కా కేసులు కూడా ఉన్నాయి. సీసీకెమేరా దృశ్యాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే హంతకులను అరెస్టు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు