అదిగదిగో వైమానిక వేడుక!
ఆసియా ఖండంలో అతి పెద్ద ఎయిర్ షో ‘ఏరో ఇండియా- 2023’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు నిర్వహిస్తామని కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది.
ఆకాశంలో యుద్ధవిమానాల జోరు..
మల్లేశ్వరం, యశ్వంతపుర, న్యూస్టుడే : ఆసియా ఖండంలో అతి పెద్ద ఎయిర్ షో ‘ఏరో ఇండియా- 2023’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు నిర్వహిస్తామని కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. యలహంక ఎయిర్ బేస్లో 14వ ఎడిషన్ ఎయిర్షోకు ఇప్పటి నుంచే సన్నాహకాలు చేసుకోనున్నారు. ఈ ఐదు రోజుల ప్రదర్శనలో దేశ, విదేశాలకు చెందిన విమాన తయారీ సంస్థలు, రక్షణ శాఖ పరికరాలను విక్రయించే కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.
* ఈ ప్రదర్శన ఉత్తరప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో నిర్వహించే అవకాశం ఉందని తొలుత సమాచారం అందింది. సౌకర్యాలు, ఇతర వెసులుబాట్లను అంచనాలోకి తీసుకున్న తరువాత బెంగళూరు ఉత్తమ వేదికగా రక్షణ శాఖాధికారులు తుది నిర్ణయానికి వచ్చారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కొరియా, జపాన్, మలేషియా, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, రష్యా తదితర దేశాలకు చెందిన యుద్ధవిమానాలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి. రెండేళ్లకు ఓసారి ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లపాటు హైబ్రిడ్ తరహాలో విన్యాసాలు కొనసాగించడం ప్రస్తావనార్హం. ఆ సమస్య కరిగిపోవడంతో ఈసారి భారీ ఏర్పాట్లకు అధికారులు యలహంక వైమానిక దళం విమానాశ్రయాన్ని సిద్ధం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా