నంజనగూడుకు ప్రగతి తోడు
నంజనగూడు నియోజకవర్గాన్ని ధార్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు.
మైసూరులో పది పడకల ఐసీయూ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి, ప్రముఖులు
మైసూరు, న్యూస్టుడే : నంజనగూడు నియోజకవర్గాన్ని ధార్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. మైసూరు, నంజనగూడు నియోజకవర్గాల్లో సోమవారం మధ్యాహ్నం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. శ్రీకంఠేశ్వరుని ఆలయంలో పూజలు చేయించుకున్నారు. నంజనగూడు శ్రీకంఠేశ్వర ఆలయం వద్ద వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. నుగు, హెడియాల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కబిని ఎత్తిపోతల పథకాన్ని తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రారంభించామని గుర్తు చేశారు. ఉపన్యాసానాలతో సామాజిక న్యాయం దక్కదని, పేదల కడుపు నిండదని పేర్కొన్నారు. తమది మార్పునకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వమని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో ఐదు వేల మంది విద్యార్థులు మెగా హాస్టళ్లలో ఉంటూ విద్యాభ్యాసం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నంజనగూడు ఎమ్మెల్యే హర్షవర్ధన్ సహకారంతో రూ.30 కోట్ల ఖర్చుతో స్థానికంగా అన్ని చెరువులలో నీటిని నింపే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. మైసూరు కె.ఆర్.ఆసుపత్రితో పాటు 41 తాలూకా ఆసుపత్రులలో పది పడకల ఐసీయూలు, మైసూరు వైద్య కళాశాలలో హాస్టళ్లు, స్కిల్ ల్యాబ్, ఇతర సదుపాయాలను ఇదే సందర్భగా బొమ్మై ప్రారంభించారు. మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అమృత మహోత్సవాలను ప్రారంభించారు. సంస్థ నుంచి రూ.28.41 లక్షల డివిడెంట్ను అందుకున్నారు. రాజమాత ప్రమోదాదేవి, మంత్రులు డాక్టర్ సుధాకర్, గోవింద కారజోళ, ఎమ్మెల్యేలు హర్షవర్ధన్, రామదాసు, తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏలికల శక్తి యుక్తులకు పరీక్ష
[ 07-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల నేపథ్య జాతీయ, రాష్ట్ర నేతల హడావుడి మంగళవారంతో పరిసమాప్తం కానుంది. -
మహిళలకు సిద్ధు లేఖ
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియకు కొద్ది గంటలే ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర మహిళలకు బహిరంగ లేఖ రాశారు. -
ప్రజ్వల్ కేసులో కుట్ర కోణం?
[ 07-05-2024]
కేఆర్నగర ఎమ్మెల్యే డాక్టర్ రవిశంకర్ చేసిన ఆరోపణలతోనే తమ నాయకుడు హెచ్డీ రేవణ్ణను సిట్ అరెస్టు చేసిందని జనతాదళ్ హాసన జిల్లా శాఖ అధ్యక్షుడు లింగేశ్ ఆరోపించారు. -
రాజధానిలో వాన జోరు
[ 07-05-2024]
ఈ వారాంతం వరకు బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, రామనగర, కోలారు,చిక్కబళ్లాపుర, మండ్య, మైసూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
ఓటరన్నకు పండగొచ్చె!
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాగలకోటె, చిక్కోడి, బెళగావి, విజయపుర, కలబురగి, రాయచూరు, బీదర్, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది -
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
[ 07-05-2024]
ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న గోవిందప్ప (38) అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో సోమవారం మరణించారు. -
అల్లుడి విజయమే ఖర్గే ఆశయం
[ 07-05-2024]
కలబురగి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. ఓటమి ఎరుగని వీరుడిగా ఖ్యాతి పొందిన మల్లికార్జున ఖర్గే 2019 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. -
గనినాడులో సర్వం సిద్ధం
[ 07-05-2024]
బళ్లారి లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని కంప్లి, బళ్లారి నగర, గ్రామీణ, సండూరు విధానసభ నియోజకవర్గాల సంబంధించిన పోలింగ్ సిబ్బందికి సోమవారం ఓటింగ్ యంత్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. -
బెంగళూరులో తెదేపా ప్రచారం
[ 07-05-2024]
అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలం నుంచి ఉపాధి, వ్యాపార నిమిత్తం బెంగళూరులో ఉంటున్న వారు ఎన్నికల సమయంలో వెనక్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెదేపా నాయకులు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
Rohit - Yuvaraj: రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్