logo

Crime News: ప్రేమన్నాడు.. నిరాకరించడంతో నరికేశాడు!

ప్రేమను నిరాకరించిందనే కోపంతో రాశి (19) అనే విద్యార్థినిపై ఆ యువకుడు దారుణంగా దాడికి దిగాడు.

Updated : 19 Jan 2023 09:25 IST

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : ప్రేమను నిరాకరించిందనే కోపంతో రాశి (19) అనే విద్యార్థినిపై ఆ యువకుడు దారుణంగా దాడికి దిగాడు. సొంత పనిమీద వీధిలోకి వచ్చిన ఆమె వెనుతిరిగి నడుచుకుంటూ వెళుతున్న వేళ మధుచంద్ర (25) అనే టెంపో ట్రావెల్‌ వాహన చోదకుడు ‘ప్రేమిస్తావా.. లేదా?’ అంటూ నిలదీశాడు. ఆమె కాదుపొమ్మనడంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో దాడికి దిగాడని పోలీసు అధికారులు వివరించారు. ఆమె గొంతుపై కత్తి ఎక్కుపెట్టి, ఒక్కపెట్టున కోసేసి పారిపోయాడని తెలిపారు.

మంగళవారం సాయంత్రం చీకటి కమ్ముకునే వేళ పెద్దగా జన సంచారమూ లేని సమయంలో బెంగళూరు యలహంక సమీపంలోని శానుభూగనహళ్లి వద్ద జరిగిన ఈ సంఘటన దిగ్భ్రాంతిగొలిపింది. హతురాలు యలహంక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ బీఏ చదువుతున్నట్లు గుర్తించారు. ఆ యువకుడు చాన్నాళ్లుగా ఆమెను ప్రేమ పేరుతో సతాయిస్తున్నట్లు తెలిపారు. కత్తి వేటుకు రహదారిపై విలవిలలాడుతున్న ఆమెను కొందరు ఆస్పత్రికి తరలించినా ప్రయోజనంలేక మంగళవారం రాత్రి కన్నుమూసింది. ఇటీవలే రాజానుకుంటలోని ఓ ప్రముఖ కళాశాల ప్రాంగణంలో ఓ విద్యార్థిని దారుణ హత్యకు గురికావడం మరచిపోక ముందే.. ఈ ఘటన చోటుచేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని