Bangalore: సిలికాన్సిటీ మహా విస్తరణ
రాష్ట్ర రాజధాని బెంగళూరు ప్రపంచం మెచ్చి జనావాసంగా గుర్తింపు దక్కించుకుంది. అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటైన ఉద్యాననగరిని మరింత ఉన్నతంగా విస్తరించేందుకు ‘బ్రాడ్ బెంగళూరు’ పథకం కింద ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
రానున్న తరాలకు మౌలిక వసతుల కల్పనే కీలకం
రాజధాని నలుచెరుగులా పొడవైన ఉపరితల వంతెనలు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : రాష్ట్ర రాజధాని బెంగళూరు ప్రపంచం మెచ్చి జనావాసంగా గుర్తింపు దక్కించుకుంది. అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటైన ఉద్యాననగరిని మరింత ఉన్నతంగా విస్తరించేందుకు ‘బ్రాడ్ బెంగళూరు’ పథకం కింద ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వివిధ సంస్థలు నిర్వహించిన సమీక్షలో ఈ సురక్షితనగరి విస్తరణ- పర్యావరణ పరిరక్షణ అంశాలు విడదీయలేనివి. అత్యున్నత నిర్మాణ విలువలతో నగరాన్ని విస్తరించే అంశంపై బృహత్ బెంగళూరు మహానగర పాలికె 70 వేల సలహాలు, సూచనలు ప్రస్తుతం స్వీకరించి, సమీక్షిస్తోంది. అవసరమైన మౌలిక సౌకర్యాల విస్తరణ తక్షణ చర్యగా గుర్తించారు. అత్యధికుల సూచనల్లో ఈ అంశం ప్రముఖంగా కనిపించిందని నగరాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు ఇటీవల బెంగళూరులో నిర్వహించిన.అమెరికా వాణిజ్య- వ్యాపార సంస్థ సమావేశంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరు ప్రాముఖ్యతను సుదీర్ఘంగా వివరించారు. విస్తరణ వివరాలను రేఖామాత్రంగా విశ్లేషించారు. ఆర్థిక లావాదేవీల్లో ఎక్కువగా, కొత్త ప్రయోగాలకు కేంద్రంగా, త్వరగా ఉపాధి అందించే వేదికగా నగరాన్ని అందరూ ఎంచుకుంటారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ విభాగాలు, వివిధ పరిశోధన కేంద్రాలు, అంకుర వేదికలు, ఉత్తమ రవాణా వ్యవస్థ, ఆహ్లాదకరమైన వాతావరణం, తాగునీటి వ్యవస్థ, మేలైన పోలీసు వ్యవస్థ, ఐటీ- బీటీ రాజధానిగా గుర్తింపు వల్ల నగరం వైపు అన్ని వర్గాల వారూ చూస్తున్నారు. రానున్న రెండు మూడు దశాబ్దాలలో జనజీవనానికి అవసరమైన సదుపాయాల కల్పనకు అంతరార్జతీయ ప్రమాణాలను పాటించక తప్పని వాతావరణం తలెత్తింది.
- అంకుర సంస్థల రాజధానిగా బెంగళూరు గుర్తింపు పొందింది. వీటి ఏర్పాటులో బెంగళూరు- దిల్లీ మధ్య తొలి నుంచి పోటీ నెలకొంది. అంకురాలను రాష్ట్ర ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తున్న క్రమంలో అనేక మంది నగరానికి కదలి వస్తున్నారు. నవతరం ఆలోచనల కేంద్రంగా గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి సహకరిస్తోంది. ఇస్రో, హెచ్ఏఎల్, భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్సీ) తదితరాల్లో ఆధునిక ప్రయోగాల కారణంగా శాస్త్ర, సాంకేతిక నిపుణులు ఎక్కువగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. 1990 నుంచే ఈ తరహా నిపుణుల రాక నగరానికి జోరందుకోగా ఇప్పుడది మరీ ఎక్కువ. దాదాపు రెండొందలకు పైగా పెద్ద ఐటీ కంపెనీల్లో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. కాస్మోపాలిటిన్ సిటీగా విస్తరణ ప్రస్తుత ప్రభుత్వం ముందున్న లక్ష్యంగా మారింది.అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు జనజీవన రాకపోకలకు ఎంతో ఉపకరిస్తున్న మెట్రో సంచార వ్యవస్థను అన్ని దిక్కుల్లో అందుబాటులోకి తెస్తున్నారు. రెండు దశాబ్దాల కిందట 850 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని నగరం ప్రస్తుతం 12 వందల చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించగా.. మరో పదేళ్లలో ఈ స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజల రాకపోకల కోసం మెట్రోతో పాటు సబర్బన్ రైలు మార్గాలను నిర్మిస్తారు. దొడ్డబళ్లాపుర ,నెలమంగల, హొసకోట, మాగడి, బిడది, ఆనేకల్ ప్రాంతాల్లో ఉపనగరాల నిర్మాణానికి గృహ నిర్మాణ మండలి శ్రీకారం చుట్టింది. బ్రాండ్ బెంగళూరు నిర్మాణంలో భాగంగా ఉపనగరాలను అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. హొసకోట, తుమకూరు, చిక్కబళ్లాపుర, హోసూరు, కనకపుర వరకు మెట్రో రైలు విస్తరణ ప్రతిపాదన దస్త్రాలూ వేగంగా కదులుతున్నాయి.
నగర వాతావరణానికి నేటికీ రక్షణ దుర్గాలు.. చెరువులు, వృక్షాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
[ 29-04-2024]
హాసన సెక్స్ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ, ఆయన కుమారుడు- ఎంపీ ప్రజ్వల్పై లైంగిక దౌర్జన్యం కింద కేసు నమోదు చేసిన మహిళ (47).. భవానీ రేవణ్ణకు స్వయానా మేనత్త కుమార్తె. -
ఉత్తరాన మోదీ ఉరుములు
[ 29-04-2024]
రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం భాజపా ప్రచారం వాయువేగంతో ప్రారంభించింది. ఒకే రోజున నాలుగు ప్రాంతాలు, తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థుల విజయం కోసం భాజపా కీలకనేత- ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారాన్ని ఉరకలెత్తించారు. -
చైతన్యమే జయకేతనం
[ 29-04-2024]
ఉద్యాననగరి బెంగళూరువాసులు చైతన్యవంతంగా అడుగు ముందుకేశారు. -
అడిగింది కొండంత... ఇచ్చింది గోరంత
[ 29-04-2024]
కన్నడనాడుకు రూ.18 వేల కోట్ల కరవు పరిహారాన్ని విడుదల చేయాలని కోరితే కేంద్రం రూ.3,454 కోట్లు మాత్రమే ఇచ్చిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. -
చెలరేగిన నిరసన ప్రజ్వాల
[ 29-04-2024]
లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన లోక్సభ సభ్యుడు, జనతాదళ్ యువ నాయకుడు ప్రజ్వల్, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణలపై కఠిన చర్యలు తీసుకోవాలని యువ కాంగ్రెస్ సమితి డిమాండు చేసింది. -
బెళగావిలో నేనే అభ్యర్థిని!
[ 29-04-2024]
బెళగావి లోక్సభ ఎన్నికల్లోనే తానే అభ్యర్థిని అని భావించి ఓటర్లు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. -
చందనసీమలో నమోజపం!
[ 29-04-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం కర్ణాటకలో నాలుగు బహిరంగసభల్లో పాల్గొని భాజపా అభ్యర్థులకు ఓట్లు అభ్యర్థించారు. -
ప్రతి ఓటు విలువను సంక్షేమ రూపంలో తిరిగిస్తా
[ 29-04-2024]
భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు వేసిన ప్రతి ఓటు విలువను సంక్షేమ రూపంలో తప్పకుండా తిరిగి ఇస్తానని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం హొసపేటెలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. -
అబద్ధాలను విశ్వసించవద్దు : సిద్ధు
[ 29-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి యజమానురాలి ఖాతాకు ఏటా రూ.ఒక లక్ష జమ చేస్తామని, రైతుల రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీనిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది.
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు.. పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు