మోదీ సభకు సకల సన్నాహాలు
బెంగళూరు ప్యాలెస్ మైదానంలో శనివారం సాయంత్రం నిర్వహించే బహిరంగలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజె వెల్లడించారు.
సభా ప్రాంగణ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న శోభా కరంద్లాజె
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే : బెంగళూరు ప్యాలెస్ మైదానంలో శనివారం సాయంత్రం నిర్వహించే బహిరంగలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజె వెల్లడించారు. సమావేశానికి వేదికె ఏర్పాటుకు ఆమె బుధవారం భూమి పూజ చేసి మాట్లాడారు. గాయత్రి వివార్ ఒకటో నంబరు గేటు నుంచి కార్యకర్తలు మైదానంలోకి రావలసి ఉంటుందన్నారు. బెంగళూరు దక్షిణ, ఉత్తరం, గ్రామీణ, కేంద్ర నియోజవకర్గాల నుంచి రెండు లక్షల మంది కార్యకర్తలు, ఓటర్లు సమావేశానికి హాజరవుతారని తెలిపారు. ప్రతి బూత్ సమితి కార్యకర్త 20 మంది ఓటర్లతో సమావేశానికి హాజరు కావాలని సూచించామని చెప్పారు. బెంగళూరుపై ప్రధానికి ప్రత్యేక అభిమానం ఉందన్నారు. పార్టీ నాయకులు వీ సునీల్ కుమార్, నందీశ్ రెడ్డి, హరీశ్, సీకే రామమూర్తి, సప్తగిరి గౌడ తదితరులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భాజపాలో ‘అఖండ’ ప్రస్థానం
బెంగళూరు (మల్లేశ్వరం): మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప డాలర్స్ కాలనీ నివాసంలో మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ బుధవారం కాషాయ పతాకాన్ని అందుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యడియూరప్పతో పాటు బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి శోభా కరంద్లాజెలతో కలిసి అఖండను పార్టీ కార్యకర్తలు సత్కరించారు. బెంగళూరు ఉత్తర లోక్సభ భాజపా అభ్యర్థి శోభా కరంద్లాజె విజయానికి శ్రమిస్తానని ఆయన తెలిపారు. శోభ కనీసం మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. తన నివాసంపై కొన్ని ముస్లిం సంఘాలు దాడి చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మేయరు దాడికి నేతృత్వం వహించాడని తెలిసినప్పుడు తనకు భాజపా మద్దతుగా నిలిచిందని ఆయన గుర్తు చేసుకున్నారు. టికెట్ కేటాయించకుండా కాంగ్రెస్ తనను నిర్లక్ష్యం చేసిందన్నారు. బేషరుతుగా తాను భాజపాలో చేరానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలిమడత మహా ప్రచారం
[ 01-05-2024]
ఎన్నికల వేళ పార్టీల ప్రచార రథాలన్నీ వాయువేగంతో పరుగెడుతున్నాయి. పార్టీల దిగ్గజ నేతలు ఒక్కొక్కరుగా రాష్ట్రానికి వచ్చి వెళుతున్నారు. -
దారుణం.. దాచేస్తే దాగని నిజం: ప్రజ్వల్ ఉదంతంలో ఘోరాలెన్నో..
[ 01-05-2024]
జనతాదళ్ నుంచి ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను మంగళవారం సస్పెండ్ చేసిన వెంటనే- ప్రత్యేక దర్యాప్తు దళం దర్యాప్తు వేగం పుంజుకుంది. -
యాప్ల వలలో విలవిల
[ 01-05-2024]
పబ్జీ, బెట్టింగ్ యాప్ల వలలో పడిన ఇద్దరు బాలురను (17) బెదిరించి నగలు, నగదు, వస్తువులను దోచుకున్న నలుగురిని రాజరాజేశ్వరినగర ఠాణా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
ఆమె ప్రాతినిధ్యం..అంతంత మాత్రం!
[ 01-05-2024]
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించిన బళ్లారి లోక్సభ నియోజకవర్గంలో ఈసారి మహిళా అభ్యర్థులు పోటీ చేయలేదు. -
మోదీ అబద్ధాలతో మభ్యపెడతారు
[ 01-05-2024]
ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పి మభ్యపెడతారు, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి యువతే దారిదీపం
[ 01-05-2024]
ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్ పేర్కొన్నారు. -
రూ.75 లక్షల నగదు చోరీ
[ 01-05-2024]
నగర పాలికె కార్యాలయం ఆవరణలో ఉన్న కర్ణాటక వన్ కేంద్రంలో రూ.75లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. -
శెట్టర్కు ప్రధాని లేఖ
[ 01-05-2024]
బెళగావి లోక్సభ భాజపా అభ్యర్థి జగదీశ్ శెట్టర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ లేఖ రాశారు. ప్రజా సంక్షేమాన్ని కోరుతూ నిత్యం పని చేస్తామనేది ‘మోదీ గ్యారెంటీ’ అని లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
-
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
-
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు