డీకేపై గౌడ తీవ్ర ఆరోపణ
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆస్తి కోసం ఒక తొమ్మిదేళ్ల బాలికను అపహరించారని మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ మంగళవారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
బాలికను అపహరించారని నింద
హాసన, న్యూస్టుడే : ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆస్తి కోసం ఒక తొమ్మిదేళ్ల బాలికను అపహరించారని మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ మంగళవారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బాలిక తండ్రి అమెరికాలో ఒక కంపెనీ ప్రారంభించేందుకు పెద్ద మొత్తంలో డబ్బు కూడగట్టుకున్నారని తెలుసుకుని ఈ అపహరణకు పాల్పడినట్లు గౌడ వివరించారు. ఆ బాలికను తీసుకెళ్లి గంగమ్మ తిమ్మయ్య అనే వ్యక్తి ఇంటి పక్కన ఓ గదిలో దాచారని వివరించారు. ఆమె తండ్రి నుంచి ఆస్తి రాయించుకున్న తర్వాతే విడిచి పెట్టారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
కాంగ్రెస్ పతనమే..
లోక్సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ పతనం అవుతుందని దేవేగౌడ జోస్యం చెప్పారు. బేలూరు తాలూకా ఇబ్బీడు గ్రామంలో దళ్, భాజపా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశంలో ప్రధానిగా కొనసాగేందుకు నరేంద్రమోదీకి మినహా మరెవరికీ అర్హత లేదన్నారు. కర్ణాటకతో పాటు మరో రెండు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలో ఉందన్నారు. మహిళలను ఉద్దేశించి కుమారస్వామి చేయని వ్యాఖ్యలను కాంగ్రెస్ అంటగట్టిందని ఆరోపించారు. వివాదం తీవ్రం కాకుండా ఉండేందుకు కుమారస్వామి ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి తక్కువ స్థాయి రాజకీయాలు చేసే స్థితికి చేరుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఛలవాది నారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే లింగేశ్, జనతాదళ్ నాయకుడు అనంత సుబ్బరాయ, భాజపా నాయకులు అడగూరు ఆనంద్, ఎంఏ నాగరాజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలిమడత మహా ప్రచారం
[ 01-05-2024]
ఎన్నికల వేళ పార్టీల ప్రచార రథాలన్నీ వాయువేగంతో పరుగెడుతున్నాయి. పార్టీల దిగ్గజ నేతలు ఒక్కొక్కరుగా రాష్ట్రానికి వచ్చి వెళుతున్నారు. -
దారుణం.. దాచేస్తే దాగని నిజం
[ 01-05-2024]
జనతాదళ్ నుంచి ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను మంగళవారం సస్పెండ్ చేసిన వెంటనే- ప్రత్యేక దర్యాప్తు దళం దర్యాప్తు వేగం పుంజుకుంది. -
యాప్ల వలలో విలవిల
[ 01-05-2024]
పబ్జీ, బెట్టింగ్ యాప్ల వలలో పడిన ఇద్దరు బాలురను (17) బెదిరించి నగలు, నగదు, వస్తువులను దోచుకున్న నలుగురిని రాజరాజేశ్వరినగర ఠాణా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
ఆమె ప్రాతినిధ్యం..అంతంత మాత్రం!
[ 01-05-2024]
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించిన బళ్లారి లోక్సభ నియోజకవర్గంలో ఈసారి మహిళా అభ్యర్థులు పోటీ చేయలేదు. -
మోదీ అబద్ధాలతో మభ్యపెడతారు
[ 01-05-2024]
ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పి మభ్యపెడతారు, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి యువతే దారిదీపం
[ 01-05-2024]
ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్ పేర్కొన్నారు. -
రూ.75 లక్షల నగదు చోరీ
[ 01-05-2024]
నగర పాలికె కార్యాలయం ఆవరణలో ఉన్న కర్ణాటక వన్ కేంద్రంలో రూ.75లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. -
శెట్టర్కు ప్రధాని లేఖ
[ 01-05-2024]
బెళగావి లోక్సభ భాజపా అభ్యర్థి జగదీశ్ శెట్టర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ లేఖ రాశారు. ప్రజా సంక్షేమాన్ని కోరుతూ నిత్యం పని చేస్తామనేది ‘మోదీ గ్యారెంటీ’ అని లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!