logo

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనాన్ని టిప్పర్‌ లారీ ఢీకొని వాహనదారుడు మృతి చెందిన ఘటన గుర్రాలపాడు వద్ద గురువారం చోటుచేసుకుంది. ఇల్లెందుకు చెందిన తెలుకుంట్ల వినేశ్‌(23) కొంతకాలంగా ముదిగొండ మండలం ఖానాపురంలోని అమ్మమ్మ ఇంటి వద్దనే ఉంటూ

Published : 28 Jan 2022 05:14 IST

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని టిప్పర్‌ లారీ ఢీకొని వాహనదారుడు మృతి చెందిన ఘటన గుర్రాలపాడు వద్ద గురువారం చోటుచేసుకుంది. ఇల్లెందుకు చెందిన తెలుకుంట్ల వినేశ్‌(23) కొంతకాలంగా ముదిగొండ మండలం ఖానాపురంలోని అమ్మమ్మ ఇంటి వద్దనే ఉంటూ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఉదయం ద్విచక్ర వాహనంపై ఖమ్మం వెళ్తుండగా మార్గం మధ్యలో గుర్రాలపాడు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్‌ లారీ ఢీకొంది. వినేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని అన్నం శ్రీనివాసరావు బృందం సహాయంతో పోలీసులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శంకర్‌రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని