ఇద్దరి మృతదేహాలు లభ్యం
మండలంలో సుర్థేపల్లి చెక్డ్యాం వద్ద గల్లంతైన చెన్నారం గ్రామానికి చెందిన పగడాల రంజిత్(29), ఖమ్మం డీఆర్ఎఫ్ బృంద సభ్యుడు బాశెట్టి ప్రదీప్(32) మృతదేహాలు శుక్రవారం ఉదయం లభ్యమయ్యాయి. చెక్డ్యాం వద్ద చేపల వేటకు వెళ్లి గురువారం
‘సుర్థేపల్లి’ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళన
జిల్లా ఆసుపత్రి మార్చురి వద్ద ఆందోళన చేస్తున్న
కార్మిక సంఘాల ఐకాస నాయకులు
ఘటనా స్థలానికి రాని ఎస్సై: స్థానిక ఎస్సై స్రవంతి శుక్రవారం ఘటనాస్థలానికి రాకపోవడం చర్చనీయాంశమైంది. ఈమె విధుల్లోనే ఉన్నా సుర్థేపల్లి రాలేదు. మధ్యాహ్నం సమయంలో ఖమ్మం గ్రామీణం సీఐ శ్రీనివాసరావు వచ్చారు. మృతదేహం తరలింపు విషయంలో కేవీపీఎస్ నాయకులు పొట్టపెంజర నాగులుతో ఎస్సై నాగరాజు వాగ్వాదానికి దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా ఘటనా స్థలానికి వచ్చిన ఓ విలేకరిపై(ఈనాడు కాదు) స్థానికులు, ప్రదీప్ కుటుంబ సభ్యులు రాళ్లతో దాడి చేశారు. అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు.
ఆసుపత్రిలో కార్మికుల ఆందోళన
ఖమ్మం నగరపాలకం, న్యూస్టుడే: డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రదీప్, వెంకటేశ్ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక ఐకాస ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రిలోని మార్చురీ వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించారు. అనుభవం, సరైన శిక్షణ లేని వారిని ప్రమాదకర పనులకు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మృతదేహాలను తరలించేందుకు పోలీసులు యత్నించగా అడ్డుకున్నారు. దీంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. తుదకు పలు పార్టీల నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, నున్నా నాగేశ్వరరావు, గోగినేపల్లి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని నరేంద్రలు ఆర్డీవో రవీంద్రనాథ్తో నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో ఆందోళన విరమించారు.
రూ. 7లక్షల పరిహారం.. ఒప్పంద ఉద్యోగం: నగరపాలక మేయర్ పునుకొల్లు నీరజ అక్కడకు చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి నగరపాలకం నుంచి రూ.5లక్షలు, పాలేరు శాసనసభ్యుడు కందాళ ఉపేందర్రెడ్డి రూ.2లక్షల చొప్పున అందిస్తారని, కుటుంబంలో ఒకరికి ఒప్పంద ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. సుడా ఛైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్మిక సంఘాల నాయకులు విష్ణువర్ధన్, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, రామయ్య, అశోక్, క్లెమెంట్, రామాంజనేయులు, శ్రీను, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
ఖమ్మం గ్రామీణం, చింతకాని, న్యూస్టుడే: చింతకాని మండలం నాగులవంచలో బాసెట్టి ప్రదీప్, నేలకొండపల్లి మండలం చెన్నారంలో రంజిత్, ఖమ్మం గ్రామీణ మండలం ఎంవీపాలెంలో పడిగెల వెంకటేశ్లకు అంత్యక్రియలు పూర్తిచేశారు. ప్రదీప్కు భార్య నాగ, కుమార్తె రూప ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్