అటవీశాఖలో ఆణిముత్యం
అటవీ శాఖలో ఉద్యోగం చేయాలనేది తన ఆకాంక్ష. ఇష్టంతో చదివి ఆ కొలువు చేపట్టారామె. అటవీ భూముల రక్షణే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల శిక్షణలో అరుదైన ఘనత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంశాల్లో ప్రథమంగా నిలిచి ప్రశంసలు అందుకున్నారు ఖమ్మం రేంజి కొణిజర్ల మండలం మేకలకుంట బీట్ ఆఫీసర్ కె.అనూష.
బీట్ ఆఫీసర్ల శిక్షణలో రాష్ట్రస్థాయి ఘనత
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్టుడే
కె.అనూష
అటవీ శాఖలో ఉద్యోగం చేయాలనేది తన ఆకాంక్ష. ఇష్టంతో చదివి ఆ కొలువు చేపట్టారామె. అటవీ భూముల రక్షణే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల శిక్షణలో అరుదైన ఘనత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంశాల్లో ప్రథమంగా నిలిచి ప్రశంసలు అందుకున్నారు ఖమ్మం రేంజి కొణిజర్ల మండలం మేకలకుంట బీట్ ఆఫీసర్ కె.అనూష.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి...
సొంతూరు ఖమ్మం జిల్లాలోని మధిర. తండ్రి వెంకటేశ్వర్లు వ్యవసాయం చేస్తారు. భర్త తల్లాడ మండలం మిట్టపల్లికి చెందిన శివకృష్ణ వ్యాపారం చేస్తున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఖమ్మంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిన అనూష ఇంటర్మీడియట్, బీటెక్(ఈసీఈ) కూడా ఖమ్మంలోనే పూర్తి చేశారు. అనంతరం గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమయ్యారు. తొలుత పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చినా చేరలేదు. తర్వాత 2017లో అటవీ శాఖ బీట్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2019లో మేకలకుంట బీట్ ఆఫీసర్ పోస్టింగ్ దక్కించుకున్న ఆమె తన పరిధిలో ఉన్న 750 హెక్టార్ల అటవీ భూమిని సంరక్షిస్తున్నారు.
నాలుగు అంశాల్లోనూ బంగారు పతకాలు
గత ఏప్రిల్ నుంచి ఆరు నెలలపాటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దూలపల్లిలోని అటవీ శాఖ కళాశాలలో బీట్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. ఇది గత నెల 30న పూర్తయింది (అటవీ శాఖలో కొలువులో చేరాక శిక్షణ ఇస్తారు). శిక్షణలో నాలుగు అంశాల్లో నాలుగు బంగారు పతకాల్ని అనూష సాధించారు. బెస్ట్ ఆల్ రౌండర్, బ్యాచ్ టాపర్, ఫారెస్ట్ ప్రొటక్షన్, ఫారెస్ట్ రీజనరేషన్ అంశాల్లో పతకాలు లభించాయి. అటవీ బీట్ అధికారుల స్నాతకోత్సవంలో రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్ రాజారావు చేతుల మీదుగా అవార్డులందుకున్నారు. మొత్తం 55 మంది బ్యాచ్లో 14 మంది మహిళా బీట్ ఆఫీసర్లున్నారు. వారందరిలో తాను టాపర్.
‘‘అటవీ శాఖలో పోడు భూముల సమస్య ప్రధానం. ప్రజలకు అవగాహన కల్పించి సమస్యను సామరస్యంగా పరిష్కరించడమే కీలకం. అటవీ శాఖకు చెందిన అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా చూడటమే నా లక్ష్యం’’
- అనూష.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు