అంబేడ్కర్ విగ్రహం ఎదుట యువతి దీక్ష
భర్త ఆచూకీ తెలపాలంటూ ఓ యువతి గ్రామ కూడలిలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసనకు దిగింది. వివరాలిలా ఉన్నాయి. కారేపల్లికి చెందిన వేణు, ఎర్రబోడు గ్రామానికి చెందిన సునితలు గ్రామస్థుల సమక్షంలో 2021, అక్టోబరులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
దీక్ష చేస్తున్న యువతి సునిత
కారేపల్లి, న్యూస్టుడే: భర్త ఆచూకీ తెలపాలంటూ ఓ యువతి గ్రామ కూడలిలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసనకు దిగింది. వివరాలిలా ఉన్నాయి. కారేపల్లికి చెందిన వేణు, ఎర్రబోడు గ్రామానికి చెందిన సునితలు గ్రామస్థుల సమక్షంలో 2021, అక్టోబరులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్లో కాపురం పెట్టి అక్కడే కొద్ది నెలలు వేణు చిరుద్యోగం చేశాడు. ఆదాయం చాలటం లేదని 2022లో ఖమ్మం వచ్చి సునితని ఓ హాస్టల్లో ఉంచాడు. ఏదైనా మంచి ఉద్యోగం చూసుకుని తీసుకెళ్తానని చెప్పి వెళ్లిన వేణు కొద్ది రోజుల తరువాత అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో సునిత ఎనిమిది నెలల క్రితం కారేపల్లి వచ్చి కొద్ది రోజులపాటు అత్తింటి ఎదుట దీక్ష చేపట్టింది. ఈ క్రమంలో అత్త ఇల్లు వదిలి వెళ్లటంతో అప్పటి నుంచి అందులోనే ఒంటరిగా ఉంటోంది. భర్తపై ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం తిరిగి వచ్చిన అత్త నాగమణి, కోడలు సునితల మధ్య తగాదా చోటుచేసుకుంది. సునితను ఇంటి నుంచి బయటకు పంపివేశారు. ఈ నేపథ్యంలో గురువారం స్థానిక ప్రధాన కూడలిలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట నల్లరిబ్బెన్ నోటికి కట్టుకుని మౌన దీక్ష చేపట్టింది. రూ.లక్షల్లో కట్నం తేవాలని వేధిస్తున్నారని, తన భర్త ఎక్కడ ఉన్నాడో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. ప్రాణభయంతో బతుకుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.
రాత్రి 9 గంటల సమయంలో..: రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎస్సై రామారావు యువతి వద్దకు వచ్చి శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీపీఎం, ఎన్డీ నాయకులు యువతికి మద్దతుగా నిలిచారు. ఎస్సై హామీ అనంతరం భర్త ఇంట్లోకి వెళ్లేందుకు సునిత యత్నించగా కుటుంబ సభ్యులు మళ్లీ అడ్డుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరికలు
[ 26-04-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి భారాసలో చేరిన కామేపల్లి జడ్పీటీసీ సభ్యుడు భానోత్ వెంకటప్రవీణ్ కుమార్ నాయక్, పలువురు నాయకులు తిరిగి కాంగ్రెస్లో చేరారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా