బదిలీల్లో వింత పోకడలు
ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీల్లో వింత పోకడలు చోటుచేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపణలు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే: ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీల్లో వింత పోకడలు చోటుచేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2015, 2018 బదిలీల్లో స్పౌజ్, ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉపయోగించుకుని బదిలీ పొందిన వారు, నిబంధనల ప్రకారం 5, 8 ఏళ్లు పూర్తి కాకుండానే మళ్లీ వారి స్పౌజ్లు, స్పౌజ్ పాయింట్లతో దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. సేవా గ్రంథాల్లో నమోదు కాలేదనే కారణంతో కొద్దిమంది ఇలా చేస్తున్నట్లు సమాచారం. పాయింట్ల కోసం హెచ్ఆర్ఏ కేటగిరీల్లోనూ కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
క్షుణ్ణంగా పరిశీలిస్తేనే.. విద్యాశాఖ అధికారులు వీటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. లేకపోతే అర్హులైన ఉపాధ్యాయులకు నష్టం జరిగే అవకాశముంది. తప్పులు సవరించకుండా బదిలీ దరఖాస్తులపై సంతకం చేస్తే సంబంధిత కాంప్లెక్స్ హెచ్ఎంలు, హైస్కూల్ హెచ్ఎంలు, ఎంఈవోలు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
మెరిట్ జాబితాలో తప్పులు.. మెరిట్ ప్రకారం తయారుచేయాల్సిన ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాలోనూ తప్పులు జరుగుతున్నాయని, పదేపదే అప్పీల్స్ చేయాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం శిక్షణ లేకుండా నియమితులైన వారి సీనియారిటీ, శిక్షణ పూర్తయి ఆఖరి పరీక్ష రాసిన తర్వాత రోజు నుంచి లెక్కించాలి, కానీ దానికి భిన్నంగా ప్రథమ నియామకం తేదీ నుంచి లెక్కించడం వల్ల ఉద్యోగోన్నతులకు అర్హులకు నష్టం జరుగుతోందని చెబుతున్నారు.
బేసిక్ సీనియారిటీ పట్టించుకోని వైనం.. ఆర్జేడీ విడుదల చేసిన మల్టీ జోన్-1 హెచ్ఎంల ఉద్యోగోన్నతుల జాబితా తప్పులతడకగా ఉందనిఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. జిల్లా బేసిక్ సీనియారిటీ దెబ్బతినకుండా ఇంటర్-పే.(అన్ని జిల్లాల్లో అన్ని క్యాడర్లలో) సీనియారిటీ రూపొందించాల్సిన అధికారులు దీని గురించి పట్టించుకోవట్లేదనే ఆరోపణలున్నాయి.
* జాబితాలను సవరిస్తున్నాం. వాటిని అత్యంత పారదర్శకంగా తయారు చేస్తున్నాం. కలెక్టర్ అనుమతి తీసుకున్న తర్వాతే వాటిని ఆర్జేడీకి పంపిస్తాం. ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇ.సోమశేఖరశ్మ, డీఈవో, ఖమ్మం
* ఉద్యోగోన్నతుల, బదిలీల సీనియారిటీ జాబితాలను నిబంధనలు, విద్యాశాఖ రూల్స్ ప్రకారం తయారు చేసి ఉపాధ్యాయులకు నష్టం జరగకుండా చూడాలి. ఉపాధ్యాయుల అప్పీళ్లను సమగ్రంగా పరిశీలించి జాబితా విడుదల చేయాలి.
పారుపల్లి నాగేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
* 19 జిల్లాలతో కూడిన మల్టీజోన్-1 ప్రధానోపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, సీనియారిటీ జాబితా తప్పుల తడకగా ఉంది. అప్పీల్స్ ఇచ్చినా పరిష్కారం కాలేదు. సీనియారిటీలో వెనక ఉండాల్సిన ఉపాధ్యాయులు చాలామంది ముందున్నారు.
మోరంపూడి నర్సింహారావు, ఎస్ఏ(గణితం), జడ్పీఎస్ఎస్ చింతగూడెం, పెనుబల్లి మండలం
* స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల బదిలీల ఉద్యోగోన్నతుల జాబితాలు సమగ్రంగా తయారు చేయాలి. హడావుడిగా తయారు చేయటం వల్ల తప్పులు దొర్లే ప్రమాదం ఉంది. సమగ్ర బేసిక్ సీనియారిటీ జాబితాలు తయారు చేయాలి.
జె.కోటయ్య, ఎస్జీటీ, గోవిందాపురం, బోనకల్లు మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ