logo

కాంగ్రెస్‌లో మాజీ ఎమ్మెల్యే చేరిక

ఖమ్మం మాజీ శాసనసభ్యుడు యూనిస్‌ సుల్తాన్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సోమవారం ఆహ్వానించారు.

Published : 31 Oct 2023 03:56 IST

రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే యూనిస్‌ సుల్తాన్‌, ఆయన కుమారులు

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: ఖమ్మం మాజీ శాసనసభ్యుడు యూనిస్‌ సుల్తాన్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సోమవారం ఆహ్వానించారు. 1999లో ఆయన ఖమ్మం అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తెరాస(ప్రస్తుత భారాస)లో చేరి ప్రస్తుతం ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. సుల్తాన్‌తో పాటు ఆయన కుమారులూ కాంగ్రెస్‌లో చేరారు. భారాస యువజన విభాగం నాయకుడు, సిటీ గ్రంథాలయం ఛైర్మన్‌ అశ్రిఫ్‌, వైతెపా జిల్లా నాయకులు తుంపాల కృష్ణమోహన్‌ సైతం కాంగ్రెస్‌ గూటికి చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని