అటు సాధన.. ఇటు శోధన
రూ.15వేల రుణం కోసం ఆశపడిన ఐదుగురు మహిళలు, తెలియకుండానే తమ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు నడిపారు. నమ్మించిన యువకుడు ఒక బ్యాంకు ఖాతా పేరు చెప్పి, మరో బ్యాంకు ఖాతా తెరచి మోసగించాడని ఆలస్యంగా గ్రహించారు.
‘ఈనాడు’ కథనాల సహకారంతో ఎట్టకేలకు ఫలించిన మహిళల పోరాటం
ఈనాడు ప్రచురించిన వరుస కథనాలు
ఇల్లెందు గ్రామీణం, న్యూస్టుడే: రూ.15వేల రుణం కోసం ఆశపడిన ఐదుగురు మహిళలు, తెలియకుండానే తమ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు నడిపారు. నమ్మించిన యువకుడు ఒక బ్యాంకు ఖాతా పేరు చెప్పి, మరో బ్యాంకు ఖాతా తెరచి మోసగించాడని ఆలస్యంగా గ్రహించారు. ఈ క్రమంలో తమ ఖాతాల్లో సాగిన రూ.కోట్ల లావాదేవీలను చూసి ముక్కున వేలేసుకున్నారు. అక్రమ లావాదేవీల్లో నిందితులెవరో గుర్తించాలంటూ పెద్ద పోరాటమే చేశారు. కేసు నమోదు చేయమని కాలికి బలపం కట్టుకుని తిరిగారు. వీరి ప్రయత్నాలకు ‘ఈనాడు’ కథనాలు తోడయ్యాయి. బ్యాంకు అధికారుల నిర్లిప్తత, పోలీసుల దాటవేత ధోరణిపై ఎప్పటికప్పుడు కథనాలు ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు 40 రోజుల అనంతరం వాస్తవాలు వెలుగుచూడటంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది?: ఇల్లెందు మండలం సంజయ్నగర్కు చెందిన ఆఫ్రిన్, సల్మా, నాజియా, సంధ్య, సౌజన్య వద్దకు చైతన్య అనే యువకుడి సాయంతో గతేడాది డిసెంబరులో ఖమ్మం నుంచి కొందరు వ్యక్తులు వచ్చారు. రూ.15వేల చొప్పున రుణమిస్తామని నమ్మబలికారు. మహిళలు బ్యాంకు ఖాతాలకు కావాల్సిన పత్రాలు ఇచ్చారు. సంతకాలు చేశారు. రుణం ఇప్పించేందుకు వచ్చిన వారు తమ పేరిట ఒక్కటే బ్యాంకు ఖాతా తెరిచారని భావిస్తూ ఉండగా వీరి వద్దకు మరో బ్యాంకు అధికారులు ఫిబ్రవరి 20న విచారణ పేరిట వచ్చారు. ఈనేపథ్యంలో ఖమ్మంలో తమ పేరిట రెండో ఖాతా ఉందని తెలుసుకుని మహిళలు కంగుతిన్నారు. రోజులపాటు శ్రమించి, ఆ ఖాతాల్లో రూ.కోట్లలో లావాదేవీలు సాగినట్టు గుర్తించి విస్మయం చెందారు. ఈ వ్యవహారాలన్నింటిపై ఫిబ్రవరి 22 నుంచి ‘ఈనాడు’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. అనుమానాస్పద లావాదేవీలపై తెలంగాణ, గుజరాత్, హరియాణ తదితర రాష్ట్రాల సైబర్ విభాగం అధికారులు నాలుగుసార్లు హెచ్చరించిన విషయాలనూ వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన కలెక్టర్, ఎస్పీ రహస్య ఖాతాల నిగ్గుతేల్చాలంటూ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రాంరెడ్డిని ఆదేశించారు. మరోవైపు ఇల్లెందు పోలీసులతోపాటు కొత్తగూడెం సీసీఎస్, స్పెషల్ బ్రాంచి పోలీసులు పలుమార్లు విచారించి కేసును కొలిక్కి తెచ్చారు. వివరాలను ఎస్పీ రోహిత్రాజు వెల్లడించారు.
‘‘ఇల్లెందు, ఖమ్మం పోలీసులు తొలుత ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించలేదు. కేసు నమోదు కోసమే పెద్ద పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘ఈనాడు’లో వరుస కథనాలు రావటంతో ఎట్టకేలకు ఇల్లెందులో మార్చి 2న కేసు నమోదు చేశారు. ఆ తర్వాతే నిజాలు వెలుగుచూస్తాయన్న ఆశ కలిగింది.’’
యూనస్, సల్మా భర్త
‘‘హరియాణా, దుబయ్ నుంచి మా ఖాతాల్లో రూ.కోట్లలో లావాదేవీలు సాగాయని తెలిసి ఎప్పుడు ఏం జరుగుతుందో అని కంగారుపడ్డాం. కేసు నమోదు తర్వాత పోలీసులు వేగంగా చేసిన విచారణతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రంజాన్ మాసంలో నిజాలు బయటపడటం సంతోషకరం.’’
ఆఫ్రిన్, బాధిత మహిళ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్