ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధం
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ సహా జిల్లా పరిషత్లకు సూచనలందాయి.
ఖమ్మం నగరం, న్యూస్టుడే : రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ సహా జిల్లా పరిషత్లకు సూచనలందాయి. 2019 మే మాసంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జులై 4న, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం జులై 5న ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. గత ఐదేళ్ల వ్యవధిలో కొత్తగా కొన్ని మండలాలు ఏర్పాటయ్యాయి. ఆయా మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను పునర్విభజన చేయాల్సి ఉంటుంది. మే 25 నాటికి పునర్విభజన ప్రక్రియ పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది.
జూన్ 30 నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ
- బ్యాలెట్ పత్రాల ముద్రణకు కావాల్సిన పింక్, తెలుపు రంగు పేపర్ వివరాలు సిద్ధం చేసి ఆయా జడ్పీలు పంచాయతీరాజ్ కమిషనర్కు మే 5 వరకు ప్రతిపాదనలు పంపించాలి.
- ఎన్నికల మార్గదర్శకాలకు సంబంధించి హ్యాండ్ బుక్స్, శిక్షణ కార్యక్రమాలకు సరిపడా పత్రాలు, పుస్తకాలను మే 31 నాటికి ముద్రించాలి.
- ఓటేసిన వారి చేతి వేలికి గుర్తుగా రాసే సిరా (ఇండెబుల్ ఇంక్)ను జూన్ 30 నాటికి సిద్ధం చేసుకోవాలి.
- ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఓబీసీ రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను జూన్ 30 నాటికి ప్రభుత్వం పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్కుమార్ సూచించారు. అంతకుముందు ఆయా జడ్పీలు ముందస్తు ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది.
20 శాతం అదనంగా ముద్రణ
తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రెండో సాధారణ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. సరిపడా బ్యాలెట్ పెట్టెలు, పేపర్ సీళ్లు, అడ్రస్ ట్యాగ్స్ సమకూర్చుకోవాలని జడ్పీ సీఈఓలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లేఖ రాశారు. అన్ని జడ్పీలకు కలిపి పేపర్ సీళ్లు, అడ్రస్ ట్యాగ్స్ 1.80 లక్షల చొప్పున అవసరమని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వీటిని చంచల్గూడలోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచి కొనాలని సూచించింది. జిల్లాల వారీగా మే 15 నాటికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించింది. 2019 ఎన్నికల ప్రకారం ఖమ్మం జడ్పీ పరిధిలోని 20 మండలాల్లో 1,816 పోలింగ్ కేంద్రాలకు పేపర్ సీళ్లు, అడ్రస్ ట్యాగ్స్ 8,800 చొప్పున, భద్రాద్రి జడ్పీ పరిధిలోని 21 మండలాల్లో 1,338 పోలింగ్ కేంద్రాలకు పేపర్ సీళ్లు, అడ్రస్ ట్యాగ్స్ 6,500 చొప్పున అవసరమని తెలిపింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో నాలుగు చొప్పున పేపర్ సీళ్లు, అడ్రస్ ట్యాగ్స్ అవసరమవుతాయి. మొత్తమ్మీద 20 శాతం అదనంగా ముద్రించుకోవాలి. ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న బ్యాలెట్ పెట్టెల వివరాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల సమయం కంటే ముందుగానే జిల్లాల వారీగా కావాల్సిన బ్యాలెట్ పెట్టెలను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే అంశాన్ని రాష్ట్రస్థాయి అధికారులు నిర్ణయించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ను గెలిపించండి: మంత్రులు
[ 03-05-2024]
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. -
ఎగువ, దిగువ సభల్లో ప్రాతినిధ్యం
[ 03-05-2024]
భారత పార్లమెంట్లోని ఎగువ, దిగువ సభల్లో (లోక్సభ, రాజ్యసభ) సభ్యులుగా ఎన్నికైనవారు దేశంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. -
సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ
[ 03-05-2024]
తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్య చేసింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల పంచాయతీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. -
అస్వస్థతతో లారీలోనే ప్రాణాలొదిలిన డ్రైవర్
[ 03-05-2024]
లారీ డ్రైవర్పై మృతిపై గ్రామీణం ఠాణాలో గురువారం కేసు నమోదైంది. రాజస్థాన్ రాష్ట్రం నసీరాబాద్ తాలుకా లవేరా గ్రామానికి చెందిన మహావీర్ ప్రసాద్ (58) లారీ డ్రైవర్ -
సౌరమే సౌభాగ్యం
[ 03-05-2024]
ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు మానవాళికి జీవనాధారం.. వెలుగు లేకపోతే మనుగడ లేదు. అలాంటి సూర్యుడికి ఒకరోజు ఉంది. అపరిమితమైన సౌరశక్తిని ఒడిసిపడితే సంప్రదాయ ఇంధన వనరులను తరిగిపోకుండా కాపాడుకోవచ్చు. -
గతి తప్పిన గణితం... వికసించని విజ్ఞానం
[ 03-05-2024]
పదోతరగతి ఫలితాల్లో గతంతో పోలిస్తే రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెరుగైన స్థానం దక్కింది. అయితే ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణులు కాలేదు. -
పట్టభద్రులూ ఓటుకు పోటెత్తాలి
[ 03-05-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ గురువారం వెలువడింది. 2021లో జరిగిన ఎన్నికలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి ఎన్నికయ్యారు. -
భానుడి భగభగలతో రెడ్ అలర్ట్
[ 03-05-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అత్యధికంగా ఉన్నందున రెడ్ అలర్ట్ (అత్యంత ప్రమాదకర స్థాయి)ను ప్రకటించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవీఎల్ శిరీష గురువారం తెలిపారు. -
‘ఎర్లీబర్డ్’ రాబడి రూ.15.15 కోట్లు
[ 03-05-2024]
ఐదు శాతం రాయితీతో ఆస్తిపన్ను చెల్లింపునకు పురపాలక శాఖ అవకాశం కల్పించిన నేపథ్యంలో ఉభయ జిల్లాల్లోని నగర, పురపాలికల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: నామా
[ 03-05-2024]
మహాలక్ష్మి పథకం అమలు కోసం మహిళామణులు ప్రభుత్వాన్ని నిలదీయాలని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. -
రఘురాంరెడ్డి గెలుపు చారిత్రక అవసరం: మంత్రి తుమ్మల
[ 03-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మెజార్టీ చరిత్రలో నిలిచిపోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్