logo

కొవిడ్‌ కేంద్రంలో వసతులపై ఆరా

జిల్లా ఆస్పత్రిలోని కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని ఆర్డీవో ఖాజావలి ఆదివారం సందర్శించారు. కొవిడ్‌ డెస్క్‌ పనితీరును పరిశీలించారు. చిలకలపూడిలోని వరలక్ష్మి పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉన్న కేంద్రానికి వెళ్లి అక్కడి వసతులపై ఆరా తీశారు. కరోనా రోగులకు ఎలాటి ఇబ్బందులు

Published : 17 Jan 2022 02:06 IST

డ్రగ్స్‌ స్టోర్‌లో రికార్డులు పరిశీలిస్తున్న ఆర్డీవో ఖాజావలి

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: జిల్లా ఆస్పత్రిలోని కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని ఆర్డీవో ఖాజావలి ఆదివారం సందర్శించారు. కొవిడ్‌ డెస్క్‌ పనితీరును పరిశీలించారు. చిలకలపూడిలోని వరలక్ష్మి పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉన్న కేంద్రానికి వెళ్లి అక్కడి వసతులపై ఆరా తీశారు. కరోనా రోగులకు ఎలాటి ఇబ్బందులు లేకుండా వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం సెంట్రల్‌ డ్రగ్స్‌స్టోర్స్‌లో మందుల లభ్యతను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి కొవిడ్‌ నేపథ్యంలో అవసరమైన మందులను అన్ని ఆస్పత్రులకు సరఫరా చేయాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులుంటే తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసురావాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని