logo

కోర్టు ప్రారంభోత్సవంలో పాల్గొనండి

పోక్సో కోర్టు ప్రారంభోత్సవంలో న్యాయవాదులు, న్యాయవాదుల గుమస్తాలు, న్యాయశాఖ సిబ్బంది అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మచిలీపట్నం న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు కోట మెహర్‌ప్రసాద్‌ కోరారు. గురువారం న్యాయవాదుల సంఘ

Published : 21 Jan 2022 03:11 IST

మాట్లాడుతున్న కోట మెహర్‌ప్రసాదు, పక్కన సభ్యులు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: పోక్సో కోర్టు ప్రారంభోత్సవంలో న్యాయవాదులు, న్యాయవాదుల గుమస్తాలు, న్యాయశాఖ సిబ్బంది అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మచిలీపట్నం న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు కోట మెహర్‌ప్రసాద్‌ కోరారు. గురువారం న్యాయవాదుల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మచిలీపట్నంలో పోక్సో కోర్టు కోసం న్యాయవాదులు కూడా సమైక్యంగా కృషి చేశారని అన్నారు. అందరి సహాయ సహకారాలతో కోర్టు ఏర్పాటవుతున్నందున కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. సమావేశంలో న్యాయవాదుల సంఘ కార్యవర్గ సభ్యులు శాయన సుధాకర్‌, రూపాదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు