logo

కూటమితోనే అభివృద్ధి

ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు.

Published : 10 May 2024 05:53 IST

టీ వేంద్రంలో ఎన్నికల గుర్తు వివరిస్తూ..

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. ఆయన ఎన్నికల గుర్తు గాజుగ్లాసును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎన్‌ఆర్‌ఐ నగరంలోని జడ్పీ సెంటరులో ఏర్పాటు చేసిన టీవేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. వచ్చిన వారికి టీ అందజేస్తూ గాజుగ్లాసు గుర్తుకే ఓటేయాలని, అసెంబ్లీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ప్రజారంజక సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ చేరువ చేస్తామన్నారు. ఒక్కసారి అవకాశం పేరుతో అందరం మోసపోయామని, రాష్ట్ర భవిష్యత్‌, ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్‌కు తగురీతిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని