కూటమిదే పీఠం
జనసేనాని పవన్కల్యాణ్కు విజయవాడ నగరంలో అడుగడుగునా.. తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు నీరాజనం పలికాయి. పవన్ రాకతో జిల్లాలోని ఎన్డీయే కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది.
బెజవాడలో జనసేనాని రోడ్షో సూపర్ హిట్టు
తరలివచ్చిన యువత
ఈనాడు, డిజిటల్- అమరావతి: - న్యూస్టుడే, విజయవాడ వన్టౌన్: జనసేనాని పవన్కల్యాణ్కు విజయవాడ నగరంలో అడుగడుగునా.. తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు నీరాజనం పలికాయి. పవన్ రాకతో జిల్లాలోని ఎన్డీయే కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. విజయవాడ తూర్పులోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నుంచి గురువారం రాత్రి 7గంటలకు ఆరంభమైన రోడ్షో.. మధ్య నియోజకవర్గం మీదుగా పశ్చిమలోకి ప్రవేశించింది. పంజాసెంటర్ వరకు మూడున్నర కిలోమీటర్లు సాగిన యాత్రకు.. అడుగడుగునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. రెండు గంటలకు పైగా యాత్ర సాగింది. రోడ్షోకి మూడు నియోజకవర్గాల నుంచి తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చారు. దీంతో పవన్ పర్యటించిన దారులన్నీ కిక్కిరిశాయి. ఆయన పంజా సెంటర్కు చేరేంత వరకు దారిపొడవునా.. పూలుజల్లుతూ.. గజమాలలు వేస్తూ.. హారతులిస్తూ.. ఎర్రకండువాలు పైకెత్తి గిరగిరా తిప్పుతూ.. పార్టీ జెండాలు ఊపుతూ.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. కూటమి విజయం తథ్యమని నినదించారు. పశ్చిమలోని పంజాసెంటర్ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించారు. సభావేదిక వద్దకు.. జనం తండోపతండాలుగా తరలివచ్చారు. పవన్ ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచి ముగిసేంత వరకు.. శ్రేణులు ఈలలు, చప్పట్లతో మోత మోగించారు. పవన్ మాట్లాడిన మాటకూ.. ఉత్సాహంతో ఊగిపోయారు. ఎన్డీయే కూటమి విజయవాడ లోక్సభ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని), విజయవాడ పశ్చిమ, తూర్పు, మధ్య నియోజకవార్గాల అసెంబ్లీ అభ్యర్థులు సుజనాచౌదరి, గద్దె రామ్మోహన్, బొండా ఉమాను భారీ మెజార్టీతో గెలిపించాలని పవన్ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో సుజనా బలంగా మాట్లాడగలరనీ, కేంద్రంతో అతనికి చాలా సంబంధాలున్నాయని పవన్ పేర్కొన్నారు. వంగవీటి రాధా గొంతు చట్టసభల్లో వినిపించేలా చేసే బాధ్యత తనది అని.. పవన్ వెల్లడించడం గమనార్హం.
ఐక్యత చాటుతున్న పవన్కల్యాణ్, కేశినేని చిన్ని, జలీల్ఖాన్, సుజనాచౌదరి, గద్దె రామ్మోహన్
గులకరాయికే ఆస్కార్ స్థాయి నటన..
‘విజయవాడలో జగన్కు తగిలిన చిన్న గులకరాయి.. అలాగే వెళ్లిపోతూ.. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లికి తగిలిందంట, ఒక కంటికి తగిలితే.. ఆయన మరో కంటికి ప్లాస్టర్ వేసుకుని.. చేసిన నటన మామూలుగా లేదు. సినిమా వాళ్లమైన మేం కూడా ఎందుకూ పనికిరాం. ఆస్కార్ స్థాయిలో ఆయన నటన చూసి నాకైతే నవ్వు ఆగలేదు.’ అని పవన్ ఎద్దేవా చేశారు. దీనికి సభలోని యువత ఈలలు, చప్పట్ల మోత మోగించారు.
వైకాపా గూండాల ఆట కట్టిస్తాం..
‘విజయవాడ నగరంలో కనీసం డ్రెయినేజీలను కూడా ఈ ఐదేళ్లలో జగన్, వైకాపా ప్రభుత్వం వేయలేకపోయింది. కానీ.. ఆ పార్టీ నేతల నోళ్లకు మాత్రం అడ్డూ అదుపూ లేకుండాపోయింది. నగరంలో వారి అరాచకాలు పెరిగిపోయాయి. ఐదేళ్లు రెచ్చిపోయి.. నడిరోడ్డుపైకి వచ్చి ఇళ్లలోని మహిళలను కూడా తీవ్రంగా దూషిస్తూ అవమానించారు. వీళ్లు చేసిన దానికి మూల్యం చెల్లించక తప్పదు. వైకాపా ఓడిపోతోందన్నది నిజం. ఇక మీ ఆటలు అయిపోయాయ్. మీకు ఎలా బుద్ధి చెప్పాలో మా కూటమి నేతలకు బాగా తెలుసు’ అని పవన్ హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
[ 20-05-2024]
ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో గాయపడిన బాధితుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. -
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
[ 20-05-2024]
పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
[ 20-05-2024]
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. -
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రైడర్స్పై సన్‘రైజ్’ అయితే ఫైనల్కు..
-
‘బ్రాండ్ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
తిరుమలలో మరోసారి చిరుతల కలకలం.. భయంతో భక్తుల కేకలు
-
ప్రపంచకప్ ఒత్తిడిని ఎదుర్కోవడం రోహిత్కు బాగా తెలుసు: ధావన్
-
ఆ భాండాగారం తాళం చెవులు ఎక్కడ..? ప్రశ్నించిన మోదీ