బతుకు బండిపై.. పెట్రో మంట!
ప్రగతి రథ చక్రానికి అత్యంత కీలకమైన ఇంధన ధరలు గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. 2019 జనవరిలో లీటరు పెట్రోలు రూ. 72.31 ఉండగా.. ఈ ఏడాది జనవరి నాటికి రూ. 109.31కు చేరుకుంది. అంటే రూ. 37 పెరిగిందన్నమాట
ఐదేళ్లలో ఆకాశాన్ని తాకిన ధరలు
రాష్ట్ర పన్నుల వాటా పెంచేసిన వైకాపా సర్కారు
ఈనాడు, అమరావతి: మన రాష్ట్రంతో పోలిస్తే పక్కనే ఉన్న తెలంగాణాలో పెట్రో ధరలు లీటరుకు రూ. 2 తక్కువ. అదే తమిళనాడులో అయితే లీటరుకు రూ. 8 తక్కువ...పక్కనున్న కర్ణాటకలోనూ బాగా తక్కువే... కారణం.. పెట్రో ధరల్లో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర పనుల వాటా పెంచేయడమే. ప్రగతి రథ చక్రానికి అత్యంత కీలకమైన ఇంధన ధరలు గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. 2019 జనవరిలో లీటరు పెట్రోలు రూ. 72.31 ఉండగా.. ఈ ఏడాది జనవరి నాటికి రూ. 109.31కు చేరుకుంది. అంటే రూ. 37 పెరిగిందన్నమాట. అదే డీజిల్పైనా రూ. 29.88 పెరుగుదల కనిపించింది. పన్నులు, ఛార్జీలు, రుసుముల రూపంలో ప్రజలను బాదేయడమే పనిగా పెట్టుకున్న వైకాపా సర్కారు ఇంధనాన్నీ వదల్లేదు. కనీసం పక్క రాష్ట్రాల్లోని ధరలను చూసైనా ప్రజలపై కనికరం చూపలేదు. వాటితో పోలిస్తే మనరాష్ట్రంలో రూ. 2 నుంచి రూ. 10 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. సర్కారు నిర్వాకం కారణంగా ఇంధన వినియోగం తగ్గిపోయింది. వ్యాపారాలు సైతం మందగించాయి. అమరావతి నిర్మాణాన్ని ఆసరాగా తీసుకుని ఎంతోమంది రవాణారంగంలోకి అడుగుపెట్టారు. వీరందరూ వైకాపా ప్రభుత్వ తీరు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. మరోవైపు వైకాపా నాయకులు మాత్రం మట్టి, ఇసుక దందాలతో గిరాకీ పెంచుకున్నారు. పన్నులను తగ్గించే అవకాశం ఉన్నా.. వైకాపా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి.
- తెలంగాణాలో ఇంధన ధరలు తక్కువగా ఉండడంతో సరిహద్దు ప్రాంతాల్లో బంకుల్లో ఏపీ వాహనదారులే కనిపిస్తున్నారు. తిరువూరు పక్కనే ఉన్న ముత్తగూడెంలోని బంకు నిత్యం ఏపీ వాహనాలతో రద్దీగా ఉంటోంది. హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బంకుల్లోనూ ఇదే పరిస్థితి.
- ఉమ్మడి జిల్లాలో 2019లో పెట్రోలు వినియోగం రోజుకు 3,500 లీటర్లకు ఉండేది. అంటే నెలకు దాదాపు 105 కిలో లీటర్లు. 2019లో డీజిల్ వినియోగం రోజుకు 6,500 లీటర్లుగా ఉండేది. అంటే నెలకు దాదాపు 195 కిలోలీటర్లు. ప్రస్తుతం ఇదీ పడిపోయింది.
- ఉపాధి మార్గాల్లేక వాహనాల వినియోగం గణనీయంగా తగ్గడంతోపాటు కొన్ని సీఎన్జీకి మళ్లడం కారణమని పెట్రోలు బంకుల యజమానులు చెబుతున్నారు.
ఖాళీగా రవాణా వాహనాలు
ఉపాధి కోసం లారీలు, ట్రాక్టర్లను కొన్నవారు గిరాకీల్లేని కారణంగా ఫైనాన్స్ కిస్తీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు ఇబ్రహీంపట్నంలోని బూడిద రవాణా ఆధారంగా పలువురు లారీలను కొనుగోలు చేశారు. ఈ వ్యాపారం కొంతమంది నాయకుల చేతుల్లోకి వెళ్లాక పలువురు రోడ్డున పడ్డారు. రాజధాని నిర్మాణంలో నిత్యం కొన్ని వేల లారీలు తిరుగుతుండేవి. ప్రస్తుతం ఇవన్నీ పార్కింగ్కే పరిమితమయ్యాయి. చాలామంది తమ వాహనాలను ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకున్నారని లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వరరావు చెప్పారు. ఇంధన ధరలను పెంచేయడంతోపాటు వివిధ రకాల పన్నుల భారం మోపారన్నారు. రైతులు వినియోగించే ట్రాక్టర్లకు ఇంధన వ్యయం భారంగా మారింది.
వ్యాపారం పడిపోయింది...
గతంలో అమరావతి నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనుల్లో భారీ యంత్రాలను వినియోగించేవారు. పోలవరం ప్రాజెక్టులోనూ పనులు జరుగుతుండేవి. ఇవన్నీ నిలిచిపోవటంతో ఇంధన వినియోగం తగ్గిపోయింది. గత ఐదేళ్లలో కొన్ని కొత్త బంకులు ఏర్పాటైనా.. వ్యాపారం తగ్గిపోయింది. డీలర్లకు ఇచ్చే కమీషన్ను ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. దీనివల్ల నిర్వహణ కష్టంగా ఉంది. గతంలో నెలకు 30 లీటర్ల వరకు ఇంధనాన్ని వినియోగించినవారు ధరలు పెరగడంతో సగానికి తగ్గించుకున్నారు. వ్యక్తిగత వాహనాల వినియోగం కూడా తగ్గించారు. చాలామంది ప్రజారవాణాను ఆశ్రయిస్తున్నారు.
- నరసింహారావు, పెట్రోలు బంకు డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు
రూ.10వేలు అదనపు భారం పడుతోంది
బెంగళూరు నుంచి పూలు తెప్పిస్తాం. 25 కిలోల బాక్సులు 70 వరకు ఒక లోడ్లో వస్తాయి. 2019లో కర్ణాటక నుంచి కిరాయి రూ.14,500లు ఉండేది. ఇప్పుడు అదే బండి కిరాయి రూ.25,000 అయింది. కిరాయిల రూపంలోనే దాదాపు రూ.10వేలు అదనపు భారం పడుతోంది. ఈ భారమంతా వినియోగదారుడిపైనే వేస్తాం. అందుకే దిగుమతి పూల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి.
- రాము, హోల్సేల్ పూల వ్యాపారి
ఒకప్పుడు రూ.200లు కొట్టిస్తే ట్యాంకు నిండేది
ఒకప్పుడు రూ.200లు పెట్రోల్ కొట్టిస్తే యాక్టివా ట్యాంకు దాదాపుగా నిండేది. ఇప్పుడు సగం కూడా నిండటం లేదు. రెండు రోజులకే అయిపోతోంది. లీటరు రూ.59లు ఉన్నపుడు బండి కొన్నా.. ఇప్పుడు రూ.109లు అయింది. రెట్టింపు ధర పెరగడం చూస్తే.. చాలా బాధ కలుగుతోంది.
- రామారావు, ప్రైవేటు ఉద్యోగి
- న్యూస్టుడే, మధురానగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
[ 20-05-2024]
ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో గాయపడిన బాధితుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. -
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
[ 20-05-2024]
పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
[ 20-05-2024]
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. -
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్