విలీనానికి..మ్యాపింగ్ సిద్ధం
జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విలీన కసరత్తు తుది దశకు చేరింది. జిల్లాలో 250 మీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలను హైస్కూళ్లలో కలిపేందుకు ఉన్న సాధ్యాసాధ్యాల అధ్యయనం పూర్తయింది. ఉన్నత పాఠశాలలకు..
నేడు విద్యాశాఖకు నివేదించనున్న జిల్లా అధికారులు
ఈనాడు, అమరావతి
జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విలీన కసరత్తు తుది దశకు చేరింది. జిల్లాలో 250 మీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలను హైస్కూళ్లలో కలిపేందుకు ఉన్న సాధ్యాసాధ్యాల అధ్యయనం పూర్తయింది. ఉన్నత పాఠశాలలకు.. 250 మీటర్లు, కిలోమీటరు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక బడులను విలీనం చేసేందుకు చేపట్టిన మ్యాపింగ్ సిద్ధమైంది. రహదారులను దాటి వెళ్లాల్సినవి, గదుల కొరత ఉన్న పాఠశాలలను కలపకుండా ఎక్కడివి అక్కడ ఉంచేశారు. మ్యాపింగ్ నివేదికను పీపీటీ రూపంలో విద్యాశాఖకు శుక్రవారం జిల్లా అధికారులు సమర్పించనున్నారు.
జిల్లాలో 3,173 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1773 ప్రాథమిక, 349 ప్రాథమికోన్నత , 341 ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక బడులన్నింటినీ తెచ్చి విలీనం చేసేందుకు మ్యాపింగ్ సిద్ధం చేశారు. ప్రభుత్వ బడుల్లో 3.11లక్షల మంది చదువుతున్నారు. అంటే పది తరగతుల్లో ఒక్కో దానికి 30వేల మంది విద్యార్థులున్నారు. ఈ లెక్కన మూడు, నాలుగు, ఐదు తరగతుల ప్రాథమిక విద్యార్థులను కనీసం 90వేల మందికి పైగా ఉన్నత పాఠశాలల్లో కలుస్తారు.
దూరం పెరిగితే తలనొప్పులే..
గ్రామాల్లో తమకు సమీపంలో ఉన్న పాఠశాలను కిలోమీటరు దూరానికి తరలిస్తే.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది. రామవరప్పాడు, ఎనికేపాడు ప్రాంతాల్లో ఉన్నత పాఠశాలలు రహదారికి ఒకవైపు ఉంటే ప్రాథమిక బడులు మరోవైపు ఉన్నాయి. ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి.
నగరంలో పక్కపక్కనే ఉండడంతో..
250 మీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల మధ్యలో ఉన్న పాఠశాలలను మూడు విడతల్లో కలిపేలా ప్రణాళిక రూపొందించారు. వీటిలో ఏ ఇబ్బందీ లేని వాటిని ముందుగా ఎంపిక చేశారు. విజయవాడలో చాలాచోట్ల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు సమీపంలో.. లేదంటే పక్కపక్కనే ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎక్కడున్న వాటిని అక్కడే కొనసాగిస్తూ.. కలిపేసినట్టుగా చూపించారు. పటమటలోని గోవిందరాజులు ఉన్నత పాఠశాలకు ఆనుకునే ప్రాథమిక బడి కూడా ఉంది. ఇలాగే నగరంలోని 80శాతం పాఠశాలలు పక్కపక్కనే ఉన్నాయి. వీటిని పూర్తిగా ఒకే ప్రాంగణంలోనికి మార్చాలంటే తరగతి గదులకొరత ఉంది. అందుకేఉన్నవాటిని ఉన్నట్టుగానే ఉంచి విలీనం చూపించారు.
ఆదేశాల మేరకు విలీన ప్రక్రియ: తాహెరా సుల్తానా, డీఈవో
జిల్లాలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలల విలీనానికి సంబంధించిన మ్యాపింగ్ పూర్తయింది. నివేదికను విద్యాశాఖకు అందజేసేందుకు సిద్ధం చేశాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు విలీన ప్రక్రియ పూర్తిచేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే విజయవాడ పశ్చిమ సీటు ఇచ్చేశా: పవన్ కల్యాణ్
[ 10-05-2024]
‘విజయవాడ పశ్చిమ సీటు జనసేనకే ఖాయమైంది. కానీ.. భాజపా అధినాయకత్వం నన్ను ఒక్కటే అడిగింది. -
బతుకు బండిపై.. పెట్రో మంట!
[ 10-05-2024]
ప్రగతి రథ చక్రానికి అత్యంత కీలకమైన ఇంధన ధరలు గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. 2019 జనవరిలో లీటరు పెట్రోలు రూ. 72.31 ఉండగా.. ఈ ఏడాది జనవరి నాటికి రూ. 109.31కు చేరుకుంది. అంటే రూ. 37 పెరిగిందన్నమాట -
గన్నవరంలో చంద్రబాబు పర్యటన నేడు
[ 10-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం గన్నవరంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా నిర్వహించే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొంటారు. -
కూటమితోనే అభివృద్ధి
[ 10-05-2024]
ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. -
సమన్వయంతో పనిచేయండి
[ 10-05-2024]
ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకునేలా చూడాలని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్మిశ్రా అధికారులకు సూచించారు. -
చేష్టలుడిగిన నేత
[ 10-05-2024]
చేనేత కార్మికులను ఆదుకోవడంతోపాటు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం -
ప్రభుత్వ మార్పుతోనే అభివృద్ధి, సంక్షేమం
[ 10-05-2024]
కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలు ప్రగతి, మంచితనానికి పట్టం కట్టాలని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కోరారు. -
కూటమికే మా మద్దతు
[ 10-05-2024]
గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మద్దతు ఎన్డీయే కూటమికేనని సంఘ రాష్ట్ర కార్యదర్శి బీఆర్ ఆంజనేయులు అన్నారు. -
కూటమిదే పీఠం
[ 10-05-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు విజయవాడ నగరంలో అడుగడుగునా.. తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు నీరాజనం పలికాయి. పవన్ రాకతో జిల్లాలోని ఎన్డీయే కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. -
రూపాయి ఇవ్వలేదు రూపుమారలేదు
[ 10-05-2024]
మచిలీపట్నం కలెక్టరేట్ పరిధిలో ఆర్డీవో కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వ హయాంలో ఆధునిక వసతులతో భవనం నిర్మించాలని నిర్ణయించడంతోపాటు రూ.2.25కోట్లు కేటాయించారు.2018 సెప్టెంబరు 28న పనులు ప్రారంభించారు. -
సాధారణ కాన్పులో 4 కిలోల బిడ్డ జననం
[ 10-05-2024]
గంపలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చింతలనర్వకు చెందిన మేరీజోస్కు సాధారణ కాన్పులో 4 కిలోల బరువుతో బాబు జన్మించినట్లు వైద్యాధికారులు వి.శ్రుతి, భార్గవి గురువారం తెలిపారు
తాజా వార్తలు (Latest News)
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ