కొత్త పుస్తకాలు కొనండి పోటీ పడతాం!
ఓ మంచి పుస్తకం పదిమంది మిత్రులతో సమానం. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానంతో పాటు సృజనాత్మకత పెరుగుతుంది. చరవాణులకు అలవాటుపడిన నేటి పిల్లల్లో అది కొరవడింది. వారిలో పుస్తక పఠనం పెంచాలని గ్రంథాలయాల్లో వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నారు.
గ్రంథాలయాల బాట పట్టిన యువతరం
కర్నూలు కేంద్ర గ్రంథాలయంలో..
* ఓ మంచి పుస్తకం పదిమంది మిత్రులతో సమానం. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానంతో పాటు సృజనాత్మకత పెరుగుతుంది. చరవాణులకు అలవాటుపడిన నేటి పిల్లల్లో అది కొరవడింది. వారిలో పుస్తక పఠనం పెంచాలని గ్రంథాలయాల్లో వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నారు.
* కళాశాలలు ముగిశాయి.. పోటీ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. అతి త్వరలో ఉద్యోగ ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ‘పోటీ’ పడాలన్న ఉత్సాహంతో యువతరం గ్రంథాలయ బాట పడుతోంది. మౌలిక వసతులు లేకపోవడం... పుస్తకాలు పాతవి కావడంతో ఇబ్బంది పడుతున్నారు. కొత్తవి అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.- న్యూస్టుడే బృందం
చదువుకుంటున్న యువకుడు
మధ్యాహ్న భోజనం ఎప్పుడో
* కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న గ్రంథాలయ సంస్థకు నిత్యం 500 నుంచి 1000 మందికిపైగా పాఠకులు వస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక హాలు సిద్ధం చేశారు. గ్రూప్స్, ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ రంగంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఏఏ పుస్తకాలు అవసరమో.. వాటిని అందుబాటులో ఉంచారు. నిరుద్యోగ యువత కొలువులు సాధించేందుకు సిద్ధమవుతున్నారు.
* కర్నూలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలనుంచే కాక తెలంగాణ రాష్ట్రం గద్వాల, వనపర్తి జిల్లా వాసులు వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మధ్యాహ్న సమయంలో భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి మధ్యాహ్న సమయంలో భోజన వసతి కల్పించాలని కోరుతున్నారు. - న్యూస్టుడే, కర్నూలు కార్పొరేషన్
పాత వాటితో పాట్లు
ఎమ్మిగనూరు పట్టణంలోని టౌన్ బ్యాంకు ఎదురుగా కొత్త భవనం నిర్మించారు. కేవలం ఐదు వేల వరకు పోటీ పరీక్షలకు సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ పాతవి కావడంతో యువతరం ఇబ్బంది పడుతోంది. డీఎస్సీ, గ్రూప్స్, టెట్, జనరల్, మార్కెటింగ్ ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారికి తాజా సబ్జెక్టులు, సిలబస్కు అనుగుణంగా పుస్తకాలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.- న్యూస్టుడే, ఎమ్మిగనూరు
ఆర్థిక మంత్రి ఇలాకాలో
డోన్ పట్టణంలో పదేళ్ల నుంచి అద్దె భవనంలో కొనసాగుతోంది. పలు రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు 3,145 వరకు అందుబాటులో ఉన్నాయి. నాలుగు గదులు ఉండగా ఒకదాంట్లో రీడింగ్ రూమ్, మిగిలిన మూడింటి¨లో పుస్తకాలు నిల్వ చేస్తున్నారు. మరుగుదొడ్ల పక్కనే ర్యాకులు ఏర్పాటు చేసి పుస్తకాలు ఉంచారు. ఆర్థిక మంత్రి దృష్టి సారించి సౌకర్యాలు కల్పించాలని పాఠకులు కోరుతున్నారు. - న్యూస్టుడే, డోన్ పురపాలిక
శిథిల భవనం
ఆదోని పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన( బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, గ్రూప్సు) పుస్తకాలు పదివేల వరకు అందుబాటులో ఉన్నాయి. నిత్యం 150 నుంచి 200 మంది వరకు పాఠకులు వస్తుంటారు. భవనం శిథిలావస్థకు చేరడం.. మరుగుదొడ్ల లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల తనిఖీ కోసం వచ్చిన గ్రంథాలయ జిల్లా ఛైర్మన్ సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ రూ.1.50 కోట్లతో కొత్త భవనం నిర్మిస్తామన్నారు.
- న్యూస్టుడే, ఆదోని సాంస్కృతికం
సెస్సు చెల్లిస్తే సులువే
ఉమ్మడి జిల్లాలో సెస్సు బకాయిలు రూ.12.50 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉంది. ఇంటి పన్ను వసూలులో 8 శాతం గ్రంథాలయ సెస్సు వసూలు అవుతున్నా ఆ సొమ్మును నగరపాలక సంస్థతోపాటు పంచాయతీలు, పురపాలకాలు జమ చేయకపోవడంతో బకాయిలు రూ.కోట్లల్లో చేరుతోంది.
ఉమ్మడి జిల్లాల్లో శాఖలు: 59
పుస్తక నిక్షిప్త కేంద్రాలు: 48
ఉన్న పుస్తకాలు: 6,02,512
సభ్యులు: 52 వేలు
పాఠకుల సంఖ్య: 12,51,000
సమయాన్ని పొడిగించాలి
- పురుషోత్తం, బీఎస్సీ, ఎమ్మిగనూరు
గ్రూప్స్కు సిద్ధమయ్యేందుకు అవసరమైన నూతన పుస్తకాల కొరత ఉంది. ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయాలి. గ్రంథాలయ సమయాన్ని పొడిగించాలి. కనీసం నాలుగు గంటలైనా చదువుకొనేందుకు వీలు కల్పించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన పాఠ్య సామగ్రి అందుబాటులో ఉంచాలి.
మౌలిక వసతులు కల్పించాలి
- రవి, కొండపేట
నేను బీటెక్ పూర్తి చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సన్నద్ధం అవుతున్నా. నిత్యం సాయంత్రం 4 గంటలకు గ్రంథాలయానికి వచ్చి 7 వరకు చదువుకుంటున్నా. ఒకేఒక్క మరుగుదొడ్డి, మూత్రశాల, ఇరుకుగదులతో అవస్థలు తప్పడంలేదు.
ప్రభుత్వ కొలువు సాధించడమే లక్ష్యం
- నాగరాజు నాయక్, జొన్నగిరి
నేను 2018లో ఎమ్మెస్సీ పూర్తి చేశా. ఇక్కడే చదువుకుని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో మొదటి దశ పరీక్షలో ఎంపికై రెండో దశ పరీక్షకు అర్హత సాధించా. జూన్ 12వ తేదీన రెండో దశ పరీక్ష ఉంది. దీని కోసం కర్నూలులో గదిని అద్దెకు తీసుకుని చదువుకుంటున్నా. మంచి పుస్తకాలు అందుబాటులో ఉంచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!