ఎమ్మెల్యే కబ్జాలో రూ.4 కోట్ల విలువైన స్థలం
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రూ.4 కోట్ల విలువైన 40 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని బాధితుడు కె.వి.కుమార్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారు
బీసీ నాయకుడినని కక్ష సాధిస్తున్నారు
బాధితుడు కె.వి.కుమార్ ఆరోపణ
తన భూమికి సంబంధించిన పత్రాలు చూపుతున్న బాధితుడు కె.వి.కుమార్
ఈనాడు, కర్నూలు: పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రూ.4 కోట్ల విలువైన 40 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని బాధితుడు కె.వి.కుమార్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తెదేపాకు చెందిన బీసీ నేతనైన తనను రాజకీయంగా కక్ష సాధించడం కోసమే అడ్డగోలుగా తన ఆస్తిని రాయించేసుకున్నారని బాధితుడు ఆరోపించారు. ఆ స్థలాన్ని కబ్జా చేయడం కోసం తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారని.. దీనిపై అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బుధవారం మీడియా సమావేశంలో వారు వాపోయారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తికి మేనల్లుడైన కె.వి.కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు పంచాయతీ పరిధిలోని ఎమ్మిగనూరు ప్రధాన రహదారికి పక్కనున్న సర్వే నంబరు 93/2లోని 40 సెంట్ల భూమిని కె.వి.కుమార్ (అలియాస్ కేఈ కుమార్) 2016లో కొనుగోలు చేశారు. ఆ భూమిని ఆన్లైన్లోనూ, అడంగల్ రికార్డులను ఆయన పేరు మీదకి మార్చుకోవడంతోపాటు పాస్బుక్ సైతం పొందారు. ఆయన ఖాతాకే రైతు భరోసా డబ్బులు జమవుతున్నాయి. పూజారి జయలక్ష్మి అనే మహిళ ఆ స్థలాన్ని 1988లో కొనుగోలు చేశారు. దానిని 1998లో రంగారావు అనే వ్యక్తికి రాసిచ్చారు. అతని నుంచి స్థలాన్ని కొనుగోలు చేసేందుకు 2011లో ఒప్పందం చేసుకుని.. 2016లో కె.వి.కుమార్ కొనుగోలు చేశారు. అదే స్థలాన్ని మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్పర్సన్ శమంతకమణి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. రిజిస్ట్రేషన్ కోసం ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో అది కాస్తా ఆలస్యం అయింది. కేసు విచారణ జరుగుతుండగానే.. ఆ భూమిని అధికారులు నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. దీంతో ఆ భూమిని మరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అవకాశం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది జనవరి 19న పూజారి ప్రకాశ్రావు అనే వ్యక్తి ఆ 40 సెంట్ల స్థలాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి, ఆమె అనుచరుడు రఘుపతిరెడ్డికి విక్రయించారు. తాను జయలక్ష్మి కుమారుడినని.. తన తల్లి చనిపోయిన నేపథ్యంలో ఆ స్థలం తనకు వారసత్వంగా సంక్రమించిందంటూ పూజారి ప్రకాశ్రావు పత్రాలు చూపారు. ఇందుకోసం జయలక్ష్మి పేరుతో ఒక నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించారు. దీనిపై కె.వి.కుమార్ ఆరా తీయగా.. జయలక్ష్మికి అసలు కుమారులే లేరని వెలుగులోకి రావడం గమనార్హం. సుజాత అనే మహిళ మరణ ధ్రువీకరణ పత్రాన్ని జయలక్ష్మి మరణ ధ్రువీకరణ పత్రంగా మార్చి రిజిస్ట్రేషన్ అధికారులకు అందించినట్లు తేలింది. ఒరిజినల్ ధ్రువపత్రాలను పరిశీలించకుండా కేవలం ఫొటోస్టాట్ కాపీల ఆధారంగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిసి అధికారులను ఆశ్రయించినా.. అది రద్దు చేసినట్లు లిఖితపూర్వక పత్రాలు ఇవ్వడంలేదు. దీనిపై నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయిస్తే నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
[ 27-04-2024]
డోన్ మండలం వెంకటాపురం చెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
ఓటు విలువ తెలియజెప్పండి.. బహుమతి గెలుచుకోండి
[ 27-04-2024]
ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. మీరు మొదటిసారి ఓటు హక్కును వినియోగిస్తున్నారా.. అయితే, ఈ అవకాశం మీకోసమే. -
ఐదేళ్ల ‘దారి’ద్ర్యం
[ 27-04-2024]
జగన్ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది. గత జూన్ నుంచి డిసెంబరు వరకు కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీస్తున్నాయి.. -
సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన
[ 27-04-2024]
రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారి బృందావనానికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు. -
28, 29 తేదీల్లో చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్ తెలిపారు. -
అనుమానాలున్నా ఆమోదముద్ర
[ 27-04-2024]
అభ్యర్థుల నామపత్రాల పరిశీలనలో ‘అధికార’ పెత్తనం కొనసాగింది. అధికార పార్టీ నేతలకు చెందిన నామపత్రాలపై పలు అనుమానాలున్నా అధికారులు ఆమోదముద్ర వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇంతులు ఎటో గెలుపు అటే
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పురుష ఓటర్లు 10,13,771, మహిళలు 10,40,435, ఇతరులు 318 కలిపి 20,54,524 మంది ఓటర్లు ఉన్నారు. -
అరాచక పాలన అంతమే లక్ష్యం
[ 27-04-2024]
జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్ చింతా సురేష్ బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ డా.సంజీవ్కుమార్, కర్నూలు పార్లమెంట్ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్తో కలిసి ఎన్డీఏ ఛార్జిషీటును తిక్కారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి సంబంధించి 20 నామినేషన్లను ఆమోదించారు. -
నేతలకు కాసుల పంట.. రైతులకు కడుపు మంట
[ 27-04-2024]
‘‘వ్యవసాయ పంటల మార్కెటింగ్లో కీలకపాత్ర వహించే ఏఎంసీలు (వ్యవసాయ మార్కెట్ యార్డులు) జగన్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. అన్నదాతలకు కనీస సేవలందించలేదు. తెదేపా హయాంలో కళకళలాడిన ఏఎంసీలు ప్రస్తుతం శాఖాపరమైన కార్యకలాపాలతో సరిపెట్టుకుంటున్నాయి. -
రక్షక భటులను దగా చేసిన జగన్
[ 27-04-2024]
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం. వారికి అండగా ఉంటాం. -
ఇసుకాసురుల దారిదోపిడీ
[ 27-04-2024]
అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకను తోడేస్తున్నారు. వందల మెట్రిక్ టన్నుల లోడుతో లారీలను తిప్పుతుండటంతో.. రహదారులు రూపుకోల్పోతున్నాయి. తారు చెదిరి.. వాహనదారులను బెదిరిస్తున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 27-04-2024]
జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఏజీఎం మురళీకృష్ణ, డీన్లు సరళ, బాలాజీ శుక్రవారం తెలిపారు. -
ఓ ప్రజాప్రతినిధి.. ఇదీ దారుల దుస్థితి
[ 27-04-2024]
ఆ దారులు నరకానికి నకళ్లు.. ప్రయాణం సాగించాలంటే సాహసమే.. రాళ్ల దారిలో వెళ్లాలంటే ఒళ్లు హూనమే.. కిందపడితే రక్తధారలే.. తరుచూ ప్రమాదాలతో భయపెడుతున్నాయి. ఐదేళ్లు నిధుల మాటే లేదు. ప్రజాప్రతినిధులు భూమి పూజలతో సరిపెడుతున్నారే తప్ప.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. -
ఆలస్యమైతే.. బుగ్గిపాలే
[ 27-04-2024]
ఎండ తీవ్రత, గ్యాస్ లీకేజీలతో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే. -
జగనొచ్చారు.. పరిశోధన ప్రాణం తీశారు
[ 27-04-2024]
రాష్ట్రంలో వ్యవసాయ విధానాలు మార్చబోతున్నాం.. తన హయాంలోనే రైతులకు ఎనలేని మేలు జరుగుతున్నట్లు పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు అత్యంత ఉపయుక్తమైన వ్యవసాయ పరిశోధనలపై ఉక్కుపాదం మోపారు. -
ఎత్తిపోతలను ఎండబెట్టిన కాటసాని
[ 27-04-2024]
జుర్రేరు వాగుపై 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో దద్దణాల చెరువును నిర్మించారు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద వచ్చి చెరువులో చేరుతోంది. -
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి
[ 27-04-2024]
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. మండలంలోని సాంబవరంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్