logo

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

డోన్ మండలం వెంకటాపురం చెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Published : 27 Apr 2024 13:18 IST

డోన్‌: డోన్ మండలం వెంకటాపురం చెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఈ రోజు ఉదయం ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో వెనక్కి వాలి పడి ఉన్నాడని పేర్కొన్నారు. మృతుని తలకు ముందు భాగంలో గాయమైంది. కడుపులో కత్తి పోటు మాదిరిగా గాయమైంది. బైక్ ముందు భాగం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకుని, ప్రమాదం జరిగిందా లేదా హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డిఏస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని