వసతిగృహాల్లో ఆకలికేకలు
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు
బిల్లులు రాక సంరక్షకుల గగ్గోలు
విద్యార్థుల భోజనంపై ప్రభావం
వసతిగృహంలో భోజనం చేస్తున్న బాలికలు
డోన్పట్టణం, కర్నూలు సంక్షేమం, న్యూస్టుడే: విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు. గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టే సంరక్షకులకు దాదాపు ఏడునెలల బిల్లులు చెల్లించాలి. బిల్లులు రాకపోవడంతో వారంతా దిగులు చెందుతున్నారు.
ఖర్చులు చేస్తున్నారిలా...!
300 మంది, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే నెలకు 10 నుంచి 12 వరకు గ్యాస్ సిలిండర్లు తెప్పించాలి. కూరగాయలు, వంటనూనె, చికెన్, పాలు, గుడ్లు, అరటిపండ్లు తదితర వాటిని కొనుగోలు చేయాలి. గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉదయం అల్పాహారం, సాయంత్రం మెనూ ప్రకారం స్నాక్స్, భోజనం ఇవ్వాలి. పాఠశాలలు ఉన్న సమయంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటారు. సెలవురోజుల్లో వసతిగృహాల్లోనే భోజనం చేస్తారు. ప్రభుత్వం కేవలం బియ్యం, చిక్కీలను మాత్రమే అందిస్తుంది. మిగతా వాటిని వార్డెన్లు ఖర్చు చేసి బిల్లులు పెట్టుకోవాలి. సగటున నెలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పైగానే ఖర్చవుతోందని, ప్రభుత్వం స్పందించి బిల్లులు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.
అప్పులు తెస్తూ...
సంరక్షకుల బిల్లుల అప్లోడ్కు ప్రభుత్వం టోకెన్ నంబర్లను ఇవ్వట్లేదనేది సమాచారం. వసతిగృహాల సంరక్షకులు ప్రతి నెలలో ఒకటో తేదీ నుంచి 5వ తేదీ లోపు ఆన్లైన్లో బిల్లులు పెట్టాక...అవన్నీ ఏఎస్డబ్ల్యువో, ఏబీసీడబ్ల్యువో, ఏటీడబ్ల్యువోల లాగిన్కు వెళ్తాయి. సీఎఫ్ఎంఎస్లో అప్రూవల్ చేసిన తర్వాత ట్రెజరీలకు చేరుతాయి. సెప్టెంబరు, అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు ఆన్లైన్లో సంరక్షకులు బిల్లులు పెడుతున్నా..సీఎఫ్ఎంఎస్లో బిల్లులు జనరేట్ చేసే ఆప్షన్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయంటున్నారు. ఆయా శాఖల అధికారులను అడిగితే సీఎఫ్ఎంఎస్ అకౌంట్ ఫ్రీజింగ్లో ఉందని చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక తమకు వచ్చే వేతనాల్లో సర్దుబాటు చేస్తూ సంరక్షకులు ఖర్చు పెడుతున్నారు. ఇంకొందరు అప్పులు తెస్తున్నారు. ఒకవైపు కుటుంబాల బాధ్యతలతో పాటు విద్యార్థుల కోసం ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ సంగతి
ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీ, ఎస్సీ వసతిగృహాలు (ప్రీ-మెట్రిక్) 108 వరకు ఉండగా, 16 వేల మంది ఉంటున్నారు. కళాశాలల వసతిగృహాలు (పోస్టుమెట్రిక్) ఉమ్మడి జిల్లాలో 48 ఉండగా, రెండువేల మందికి పైగా చదువుతున్నారు. ఎస్టీ ఆశ్రమ, రెసిడెన్షియల్ వసతిగృహాలు 20 ఉండగా..ఇందులో 2,289 మంది ఉంటున్నారు. 3 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు నెలకు ఒక్కొక్కరికి రూ.1,250లు, ఆరు నుంచి పదో తరగతి వారికి రూ.1,400లు, పోస్టు మెట్రిక్కు సంబంధించి ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్థులకు రూ.1,600ల చొప్పున డైట్ ఛార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు విలువ తెలియజెప్పండి.. బహుమతి గెలుచుకోండి
[ 27-04-2024]
ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. మీరు మొదటిసారి ఓటు హక్కును వినియోగిస్తున్నారా.. అయితే, ఈ అవకాశం మీకోసమే. -
ఐదేళ్ల ‘దారి’ద్ర్యం
[ 27-04-2024]
జగన్ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది. గత జూన్ నుంచి డిసెంబరు వరకు కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీస్తున్నాయి.. -
సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన
[ 27-04-2024]
రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారి బృందావనానికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు. -
28, 29 తేదీల్లో చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్ తెలిపారు. -
అనుమానాలున్నా ఆమోదముద్ర
[ 27-04-2024]
అభ్యర్థుల నామపత్రాల పరిశీలనలో ‘అధికార’ పెత్తనం కొనసాగింది. అధికార పార్టీ నేతలకు చెందిన నామపత్రాలపై పలు అనుమానాలున్నా అధికారులు ఆమోదముద్ర వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇంతులు ఎటో గెలుపు అటే
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పురుష ఓటర్లు 10,13,771, మహిళలు 10,40,435, ఇతరులు 318 కలిపి 20,54,524 మంది ఓటర్లు ఉన్నారు. -
అరాచక పాలన అంతమే లక్ష్యం
[ 27-04-2024]
జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్ చింతా సురేష్ బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ డా.సంజీవ్కుమార్, కర్నూలు పార్లమెంట్ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్తో కలిసి ఎన్డీఏ ఛార్జిషీటును తిక్కారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి సంబంధించి 20 నామినేషన్లను ఆమోదించారు. -
నేతలకు కాసుల పంట.. రైతులకు కడుపు మంట
[ 27-04-2024]
‘‘వ్యవసాయ పంటల మార్కెటింగ్లో కీలకపాత్ర వహించే ఏఎంసీలు (వ్యవసాయ మార్కెట్ యార్డులు) జగన్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. అన్నదాతలకు కనీస సేవలందించలేదు. తెదేపా హయాంలో కళకళలాడిన ఏఎంసీలు ప్రస్తుతం శాఖాపరమైన కార్యకలాపాలతో సరిపెట్టుకుంటున్నాయి. -
రక్షక భటులను దగా చేసిన జగన్
[ 27-04-2024]
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం. వారికి అండగా ఉంటాం. -
ఇసుకాసురుల దారిదోపిడీ
[ 27-04-2024]
అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకను తోడేస్తున్నారు. వందల మెట్రిక్ టన్నుల లోడుతో లారీలను తిప్పుతుండటంతో.. రహదారులు రూపుకోల్పోతున్నాయి. తారు చెదిరి.. వాహనదారులను బెదిరిస్తున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 27-04-2024]
జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఏజీఎం మురళీకృష్ణ, డీన్లు సరళ, బాలాజీ శుక్రవారం తెలిపారు. -
ఓ ప్రజాప్రతినిధి.. ఇదీ దారుల దుస్థితి
[ 27-04-2024]
ఆ దారులు నరకానికి నకళ్లు.. ప్రయాణం సాగించాలంటే సాహసమే.. రాళ్ల దారిలో వెళ్లాలంటే ఒళ్లు హూనమే.. కిందపడితే రక్తధారలే.. తరుచూ ప్రమాదాలతో భయపెడుతున్నాయి. ఐదేళ్లు నిధుల మాటే లేదు. ప్రజాప్రతినిధులు భూమి పూజలతో సరిపెడుతున్నారే తప్ప.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. -
ఆలస్యమైతే.. బుగ్గిపాలే
[ 27-04-2024]
ఎండ తీవ్రత, గ్యాస్ లీకేజీలతో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే. -
జగనొచ్చారు.. పరిశోధన ప్రాణం తీశారు
[ 27-04-2024]
రాష్ట్రంలో వ్యవసాయ విధానాలు మార్చబోతున్నాం.. తన హయాంలోనే రైతులకు ఎనలేని మేలు జరుగుతున్నట్లు పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు అత్యంత ఉపయుక్తమైన వ్యవసాయ పరిశోధనలపై ఉక్కుపాదం మోపారు. -
ఎత్తిపోతలను ఎండబెట్టిన కాటసాని
[ 27-04-2024]
జుర్రేరు వాగుపై 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో దద్దణాల చెరువును నిర్మించారు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద వచ్చి చెరువులో చేరుతోంది. -
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి
[ 27-04-2024]
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. మండలంలోని సాంబవరంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం