పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం.
న్యూస్టుడే, పాణ్యం
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. నియోజకవర్గంలో ప్రస్తుతం తెదేపా, వైకాపా మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. నియోజకవర్గంలో కల్లూరుకు చెందిన ఓటర్లే గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. ఆరుసార్లు పాణ్యం ఎమ్మెల్యేగా కొనసాగిన కాటసాని రాంభూపాల్రెడ్డి, మూడోసారి పోటీ చేస్తున్న గౌరు చరితారెడ్డి రానున్న ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
పారిశ్రామిక ప్రాంతం
పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండలాలతో పాటు కల్లూరు పరిధిలో కర్నూలు నగరపాలక సంస్థకు చెందిన 16 వార్డులు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. నియోజకవర్గం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఓర్వకల్లు, కల్లూరు పారిశ్రామికవాడలు, ఎయిô్పోర్టు, డీఆô్డీవో, న్యాయ, ఉర్దూ విశ్వవిద్యాలయాలు, జిందాల్ సిమెంట్ పరిశ్రమ, జైరాజ్ ఇస్పాê్ ఉక్కుపరిశ్రమ, గని, పిన్నాపురం సౌర పరిశ్రమలతో పాటు, ప్రపంచంలోనే మొదటిసారి నిర్మిస్తున్న పిన్నాపురం రెన్యుబుల్ ఎనర్జీ విద్యుత్తు కేంద్రంతో పాటుగా ఖనిజ నిక్షేపాలు అధికంగా ఉన్న నియోజకవర్గంగా ప్రాధాన్యం పొందింది. గోరుకల్లు జలాశయం, ఎస్సార్బీసీ కేసీ కాల్వల కింద సాగునీరు అందుతోంది.
ముఖ్యమంత్రి పోటీచేశారు
నియోజకవర్గంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కô్రెడ్డి సీఎం హోదాలోనే 1993లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనపై తెదేపా నుంచి రేణుకాచౌదరి పోటీ పడ్డారు. దివంగత మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయ్యపురెడ్డి పాణ్యం బరినుంచి పోటీ చేశారు.
కల్లూరు ఓటరు కరుణ ఎవరిమీదో
గతంలో పాణ్యం నియోజకవర్గంలో పాణ్యం మండలంతో పాటు బనగానపల్లె, వెల్దుర్తి, బేతంచెర్ల మండలాలు ఉండేవి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండలాలతో పాటు కర్నూలు కార్పొరేషన్లోని 16 వార్డులు కలిపి నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ 16 వార్డుల్లో లక్షకుపైగా ఓటర్లు ఉన్నారు.
ఈసారి ఎవరో
2024లో పాణ్యం నియోజకవర్గంలో 14వ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు తెదేపా నుంచి గౌరు చరితారెడ్డి, వైకాపా నుంచి కాటసాని రాంభూపాల్రెడ్డి పోటీ పడుతున్నారు. గౌరు చరితారెడ్డి మూడోసారి పోటీ చేస్తుండగా, కాటసాని రాంభూపాల్రెడ్డి తొమ్మిదోసారి ఎన్నికల బరిలో ఉన్నారు.
ఎవరు ఎన్నిసార్లు గెలిచారు
పాణ్యం నియోజకవర్గంలో 1967 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో ఉప ఎన్నికతో కలిపి 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఏడుసార్లు, తెదేపా రెండుసార్లు, వైకాపా రెండుసార్లు, జనతాపార్టీ ఒకసారి, స్వతంత్రులు ఒకసారి ఎన్నికయ్యారు.
- 1967 వీరెడ్డి (స్వతంత్ర అభ్యర్థి)
- 1972 ఏరాసు అయ్యపురెడ్డి (కాంగ్రెస్)
- 1978 ఏరాసు అయ్యపురెడ్డి (జనతా పార్టీ)
- 1983 చల్లా రామకృష్ణారెడ్డి (తెదేపా)
- 1985 కాటసాని రాంభూపాల్రెడ్డి (కాంగ్రెస్)
- 1989 కాటసాని రాంభూపాల్రెడ్డి (కాంగ్రెస్)
- 1993 జరిగిన ఉప ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి (కాంగ్రెస్)
- 1994 కాటసాని రాంభూపాల్రెడ్డి (కాంగ్రెస్)
- 1999 బిజ్జం పార్థసారథిరెడ్డి (తెదేపా)
- 2004 కాటసాని రాంభూపాల్రెడ్డి (కాంగ్రెస్)
- 2009 కాటసాని రాంభూపాల్రెడ్డి (కాంగ్రెస్)
- 2014 ఎన్నికల్లో గౌరు చరితారెడ్డి (వైకాపా)
- 2019 కాటసాని రాంభూపాల్రెడ్డి (వైకాపా)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డోన్ ఆర్థిక మంత్రి బుగ్గనకు నిరసన సెగ
[ 06-05-2024]
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సుందర్ సింగ్ కాలనీకి వెళ్లారు. -
రక్షణ మంత్రి మాట
[ 06-05-2024]
ఆదోని పట్టణం భీమాస్ సర్కిల్లో ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతున్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, వేదికపై ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారధి, ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగార్జున తదితరులు -
భూపత్రం.. జగన్ కుతంత్రం
[ 06-05-2024]
‘‘దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రారంభించాం.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో.. డ్రోన్ల సాయంతో ప్రతి క్షేత్రం, పొలం చిత్రపటాలు తీసుకుని ఎలాంటి లోపాలు లేకుండా.. భూ విస్తీర్ణంలో తేడాలు లేకుండా రైతులకు కచ్చితమైన కొలతలు వేయించి, రీసర్వే చేయించి శాశ్వత భూహక్కు పత్రాలు అందిస్తున్నట్లు’’ జగన్ పదేపదే చెబుతున్నారు. -
ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తా
[ 06-05-2024]
ఆదోని పట్టణంతో పాటు పల్లెలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయి. ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందిస్తానని ఆదోని భాజపా అభ్యర్థి డాక్టర్ పార్థసారథి హామీ ఇచ్చారు. -
నిర్వహణ లోపాలు.. వెలగని దీపాలు
[ 06-05-2024]
నగరం, పట్టణాల్లో అభివృద్ధి వెలుగులు నింపుతామని వైకాపా ప్రభుత్వం పదేపదే చెబుతూ వచ్చింది. తీరా పురవీధుల్లో చీకట్లు నింపింది. వీధి దీపాల నిర్వహణ కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నామని ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. -
పార్కులు ఏర్పాటుచేయని పాలకులు మాకొద్దు
[ 06-05-2024]
కర్నూలు నగర పరిధిలోని కల్లూరు 19వ వార్డు నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో పార్కు స్థలం అన్యాక్రాంతమైందని.. తమకు పార్కు కావాలని ఆ కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి నిరసన గళం
[ 06-05-2024]
పెద్దకడబూరు మండలంలో రెండో రోజు ఆదివారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేపట్టిన ప్రచార యాత్రలో ఊరూరా తాగునీటి సమస్యలు వెల్లువెత్తాయి. జాలవాడి గ్రామస్థులు తాగునీరందించాలని కోరారు. -
ఓట్ల బాట
[ 06-05-2024]
గుంతలు పడ్డాయి.. ప్రయాణానికి ‘దారి’ చూపండని ఐదేళ్లుగా పల్లె జనం విన్నవించినా పట్టించుకోలేదు.. తీరా ఎన్నికల వేళ ‘ఓట్ల’ దారి చూస్తోంది జగన్ సర్కారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.190 కోట్లతో 39 రహదారులను (256 కి.మీ.) ఎన్నికలకు ముందు హడావుడిగా నిర్మిస్తోంది. -
నేటి నుంచి ఉద్యోగుల ఓటు
[ 06-05-2024]
జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటూ.. దరఖాస్తు చేసుకున్న వారందరికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవచ్చు. -
అమ్మఒడి.. మామ చిక్కుముడి
[ 06-05-2024]
అక్కచెల్లెమ్మలు.. అవ్వాతాతలు అంటూ తీయని మాటలతో బురిడీ కొట్టించడంలో సీఎం జగన్ది అందె వేసిన చేయి.. ఎన్నికల సమయంలో ఆకర్షణీయమైన పథకాల పేరుతో అలవికాని హామీలు ఇచ్చి.. అమలు విషయంలో మాత్రం మాయ చేయడం.. ఏవేవో నిబంధనలంటూ కోతలు వేయడం పరిపాటిగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
డోన్ ఆర్థిక మంత్రి బుగ్గనకు నిరసన సెగ
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం