icon icon icon
icon icon icon

డోన్‌లో ఆర్థిక మంత్రి బుగ్గనకు నిరసన సెగ

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సుందర్ సింగ్ కాలనీకి వెళ్లారు.

Updated : 06 May 2024 13:05 IST

డోన్ నేర విభాగం: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సుందర్ సింగ్ కాలనీకి వెళ్లారు. అక్కడ రోడ్లు, తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని మహిళలు ఆయన్ను నిలదీశారు. చాలా రోజుల నుంచి సరైన రోడ్లు లేవని, మట్టి రోడ్లతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు వాపోయారు. తాగునీటి పైప్‌లైన్‌ లీకై నీరు కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులకు ఒకసారైనా నీళ్లు రావడంలేదని తెలపడంతో నీటి సరఫరా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాలనీలో ఉన్న బోరింగ్‌కు కూడా రిపేర్‌ చేయించడం లేదని తెలిపారు. కాలనీవాసులు చందాలు వేసుకొని మరమ్మతులు చేయిస్తున్నట్లు చెప్పారు. దీంతో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img