logo

ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం

ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్‌ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 24 Apr 2024 05:27 IST

ఆస్పరి, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్‌ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు నరసన్న, రహింతుల్లా, అంజనయ్య, ముత్యాలరెడ్డి, పరమారెడ్డి, కృష్ణయాదవ్‌, సుదర్శన్‌, నాగరాజ్‌, ధర్మ, సిద్ధూ, ఓబులేసు పాల్గొన్నారు.  

దూదేకొండ(పత్తికొండ గ్రామీణం), న్యూస్‌టుడే: దూదేకొండకు చెందిన గ్రామ వాలంటీర్‌ రమేశ్‌తో పాటు పలువురు వైకాపా నాయకులు కేఈ శ్యాంబాబు సమక్షంలో మంగళవారం తెదేపాలో చేరారు. పార్టీలో చేరిన వారిలో రంగస్వామి, సాంబశివుడు, రాముడు, ధర్మ, మహమ్మద్‌, శ్రీనివాసులు, రాము, యువరాజు, నరసింహ, సురేంద్ర ఉన్నారు.


ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: పెసలబండ గ్రామానికి చెందిన వైకాపా నాయకులు రాజశేఖర్‌రెడ్డి, దొడ్డిరంగన్న, విరూపాక్షి, జయ్యప్పస్వామి, నరసింహులు, నాగన్న, రంగస్వామి, రామకృష్ణ. వీరేశ్‌, ఈరన్న, బ్రహ్మయ్య, శిద్దయ్య, గోవిందు, శ్రీరాములు తదితరులు తెదేపా ఆదోని బాధ్యుడు మీనాక్షినాయుడు సమక్షంలో మంగళవారం తెదేపాలో చేరారు.

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి కుప్పగల్‌, బల్లెకల్‌ గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆదోని మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షినాయుడు, ప్రకాశ్‌జైన్‌, జనసేన బాధ్యుడు మల్లప్ప, తెదేపా నాయకురాలు గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు.


మద్దికెర, న్యూస్‌టుడే: తెదేపాను గెలిపించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ మండల కన్వీనరు శివప్రసాద్‌, నాయకులు రామాంజులు, విఠోభ, గిడ్డయ్య, బాషా, శ్రీరాములు, జానకి అన్నారు. మద్దికెరలో వారు మంగళవారం ఇంటింటికి తిరిగి వైకాపా వైఫల్యాలు ప్రజలకు వివరించారు.


మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెరకు చెందిన వాలంటీరు శివతో పాటు, పదో వార్డు సభ్యురాలు హనుమంతమ్మ కుమారుడు మనోహర్‌, మరో 50 మంది కార్యకర్తలు మంగళవారం వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఆ పార్టీ నాయకులు దివాకర్‌గౌడ్‌, ధనుంజయ, శివప్రసాద్‌, కృష్ణ తదితరుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.


హొళగుంద, న్యూస్‌టుడే: హొళగుందలోని ఒకటో వార్డుకు చెందిన వైకాపా నాయకులు మండల కన్వీనర్‌ తిప్పయ్య, తెదేపా సీనియర్‌ నాయకుడు వీరభద్రగౌడ్‌ సమక్షంలో మంగళవారం 25 కుటుంబాలు తెదేపాలో చేరాయి. బుద్దప్పగౌడ, మల్లి, ఆదెప్ప, తిక్కస్వామి, రమేశ్‌, అభి, శ్రీరామ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని