ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆస్పరి, న్యూస్టుడే: ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు నరసన్న, రహింతుల్లా, అంజనయ్య, ముత్యాలరెడ్డి, పరమారెడ్డి, కృష్ణయాదవ్, సుదర్శన్, నాగరాజ్, ధర్మ, సిద్ధూ, ఓబులేసు పాల్గొన్నారు.
దూదేకొండ(పత్తికొండ గ్రామీణం), న్యూస్టుడే: దూదేకొండకు చెందిన గ్రామ వాలంటీర్ రమేశ్తో పాటు పలువురు వైకాపా నాయకులు కేఈ శ్యాంబాబు సమక్షంలో మంగళవారం తెదేపాలో చేరారు. పార్టీలో చేరిన వారిలో రంగస్వామి, సాంబశివుడు, రాముడు, ధర్మ, మహమ్మద్, శ్రీనివాసులు, రాము, యువరాజు, నరసింహ, సురేంద్ర ఉన్నారు.
ఆదోని గ్రామీణం, న్యూస్టుడే: పెసలబండ గ్రామానికి చెందిన వైకాపా నాయకులు రాజశేఖర్రెడ్డి, దొడ్డిరంగన్న, విరూపాక్షి, జయ్యప్పస్వామి, నరసింహులు, నాగన్న, రంగస్వామి, రామకృష్ణ. వీరేశ్, ఈరన్న, బ్రహ్మయ్య, శిద్దయ్య, గోవిందు, శ్రీరాములు తదితరులు తెదేపా ఆదోని బాధ్యుడు మీనాక్షినాయుడు సమక్షంలో మంగళవారం తెదేపాలో చేరారు.
ఆదోని గ్రామీణం, న్యూస్టుడే: భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి కుప్పగల్, బల్లెకల్ గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆదోని మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షినాయుడు, ప్రకాశ్జైన్, జనసేన బాధ్యుడు మల్లప్ప, తెదేపా నాయకురాలు గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు.
మద్దికెర, న్యూస్టుడే: తెదేపాను గెలిపించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ మండల కన్వీనరు శివప్రసాద్, నాయకులు రామాంజులు, విఠోభ, గిడ్డయ్య, బాషా, శ్రీరాములు, జానకి అన్నారు. మద్దికెరలో వారు మంగళవారం ఇంటింటికి తిరిగి వైకాపా వైఫల్యాలు ప్రజలకు వివరించారు.
మద్దికెర, న్యూస్టుడే: మద్దికెరకు చెందిన వాలంటీరు శివతో పాటు, పదో వార్డు సభ్యురాలు హనుమంతమ్మ కుమారుడు మనోహర్, మరో 50 మంది కార్యకర్తలు మంగళవారం వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఆ పార్టీ నాయకులు దివాకర్గౌడ్, ధనుంజయ, శివప్రసాద్, కృష్ణ తదితరుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.
హొళగుంద, న్యూస్టుడే: హొళగుందలోని ఒకటో వార్డుకు చెందిన వైకాపా నాయకులు మండల కన్వీనర్ తిప్పయ్య, తెదేపా సీనియర్ నాయకుడు వీరభద్రగౌడ్ సమక్షంలో మంగళవారం 25 కుటుంబాలు తెదేపాలో చేరాయి. బుద్దప్పగౌడ, మల్లి, ఆదెప్ప, తిక్కస్వామి, రమేశ్, అభి, శ్రీరామ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్షణ మంత్రి మాట
[ 06-05-2024]
ఆదోని పట్టణం భీమాస్ సర్కిల్లో ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతున్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, వేదికపై ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారధి, ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగార్జున తదితరులు -
భూపత్రం.. జగన్ కుతంత్రం
[ 06-05-2024]
‘‘దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రారంభించాం.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో.. డ్రోన్ల సాయంతో ప్రతి క్షేత్రం, పొలం చిత్రపటాలు తీసుకుని ఎలాంటి లోపాలు లేకుండా.. భూ విస్తీర్ణంలో తేడాలు లేకుండా రైతులకు కచ్చితమైన కొలతలు వేయించి, రీసర్వే చేయించి శాశ్వత భూహక్కు పత్రాలు అందిస్తున్నట్లు’’ జగన్ పదేపదే చెబుతున్నారు. -
ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తా
[ 06-05-2024]
ఆదోని పట్టణంతో పాటు పల్లెలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయి. ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందిస్తానని ఆదోని భాజపా అభ్యర్థి డాక్టర్ పార్థసారథి హామీ ఇచ్చారు. -
నిర్వహణ లోపాలు.. వెలగని దీపాలు
[ 06-05-2024]
నగరం, పట్టణాల్లో అభివృద్ధి వెలుగులు నింపుతామని వైకాపా ప్రభుత్వం పదేపదే చెబుతూ వచ్చింది. తీరా పురవీధుల్లో చీకట్లు నింపింది. వీధి దీపాల నిర్వహణ కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నామని ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. -
పార్కులు ఏర్పాటుచేయని పాలకులు మాకొద్దు
[ 06-05-2024]
కర్నూలు నగర పరిధిలోని కల్లూరు 19వ వార్డు నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో పార్కు స్థలం అన్యాక్రాంతమైందని.. తమకు పార్కు కావాలని ఆ కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి నిరసన గళం
[ 06-05-2024]
పెద్దకడబూరు మండలంలో రెండో రోజు ఆదివారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేపట్టిన ప్రచార యాత్రలో ఊరూరా తాగునీటి సమస్యలు వెల్లువెత్తాయి. జాలవాడి గ్రామస్థులు తాగునీరందించాలని కోరారు. -
ఓట్ల బాట
[ 06-05-2024]
గుంతలు పడ్డాయి.. ప్రయాణానికి ‘దారి’ చూపండని ఐదేళ్లుగా పల్లె జనం విన్నవించినా పట్టించుకోలేదు.. తీరా ఎన్నికల వేళ ‘ఓట్ల’ దారి చూస్తోంది జగన్ సర్కారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.190 కోట్లతో 39 రహదారులను (256 కి.మీ.) ఎన్నికలకు ముందు హడావుడిగా నిర్మిస్తోంది. -
నేటి నుంచి ఉద్యోగుల ఓటు
[ 06-05-2024]
జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటూ.. దరఖాస్తు చేసుకున్న వారందరికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవచ్చు. -
అమ్మఒడి.. మామ చిక్కుముడి
[ 06-05-2024]
అక్కచెల్లెమ్మలు.. అవ్వాతాతలు అంటూ తీయని మాటలతో బురిడీ కొట్టించడంలో సీఎం జగన్ది అందె వేసిన చేయి.. ఎన్నికల సమయంలో ఆకర్షణీయమైన పథకాల పేరుతో అలవికాని హామీలు ఇచ్చి.. అమలు విషయంలో మాత్రం మాయ చేయడం.. ఏవేవో నిబంధనలంటూ కోతలు వేయడం పరిపాటిగా మారింది.