logo

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలి

సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య అన్నారు.

Updated : 09 May 2024 16:35 IST

గోనెగండ్ల: సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య అన్నారు. గురువారం గోనెగండ్లలోని బాషా ఫంక్షన్ హాల్‌లో గోనెగండ్ల సీఐ రామకృష్ణయ్య అన్ని పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎస్పీ హాజరై మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, నిబంధన అతిక్రమిస్తే కేసులు తప్పవని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర గొడవలు సృష్టిస్తే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిమ్మారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని