జగన్ సభ.. అబద్ధాలకు వేదిక
నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ సభలో ఆ పార్టీ నేతలు అబద్ధాలే ప్రచార అస్త్రాలు చేసుకొన్నారు.
ఐదు రహదారుల కూడలి వద్ద పోలీసుల ఆంక్షలు
ఈనాడు, కర్నూలు, న్యూస్టుడే, కర్నూలు నగరం, కర్నూలు వైద్యాలయం: నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ సభలో ఆ పార్టీ నేతలు అబద్ధాలే ప్రచార అస్త్రాలు చేసుకొన్నారు. సభలో హఫీజ్ఖాన్ మాట్లాడుతూ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం పూర్తైనట్లు చెప్పడం గమనార్హం. వాస్తవానికి అందులో ఎలాంటి వైద్య పరికరాలు అందుబాటులోకి రాకుండానే ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా ప్రారంభించేశారు. నేటికీ రోగులకు వైద్యం అందని పరిస్థితి. క్లస్టర్ విశ్వవిద్యాలయ భవన నిర్మాణాలు పూర్తైనట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వాస్తవానికి నిర్మాణాలు పూర్తి కాలేదు. వచ్చే విద్యా సంవత్సరంలోనైనా అందుబాటులోకి వస్తుందన్న నమ్మకం లేదు. సుంకేసుల నుంచి పైపులైను నిర్మాణం 80 శాతం పూర్తైందన్నారు. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నగరానికి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ముఖ్యమంత్రి తెచ్చారని గొప్పగా ప్రకటించారు. అసలు నిర్మాణాలు ప్రారంభంకాకపోవడం గమనార్హం. కర్నూలును న్యాయ రాజధానిగా చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని ఎమ్మెల్యే కీర్తించారు. కర్నూలుకు హైకోర్టును తెస్తామని చెప్పి కనీసం హైకోర్టు బెంచి కూడా ఏర్పాటుచేయలేకపోయారు. ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధి చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. వైకాపా హయాంలో ఇప్పటివరకు కనీసం నీటి సదుపాయం కల్పించలేకపోయారు. గత ఐదేళ్లలో మచ్చుకు ఒక్క పరిశ్రమ కూడా ప్రారంభం కాలేదు.
- బీవీ రామయ్య భజన పర్వం: కర్నూలు పార్లమెంటు వైకాపా ఎంపీ అభ్యర్థి బి.వై.రామయ్య ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. అంబేడ్కర్, ఫులె, గాంధీని కలగలిపితే ఏర్పడ్డ శిల్పమే జగన్మోహన్రెడ్డి అంటూ చెప్పడం గమనార్హం.
- చంద్రబాబుపై నెపం నెడుతూ: వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా చంద్రబాబునాయుడు అడ్డుకున్నారని కేడీసీసీ బ్యాంకు ఛైర్పర్సన్ విజయమనోహరి ఆరోపించారు. ఒక్కో గ్రామ/వార్డు సచివాలయంలో 14 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నప్పటికీ వారితో పింఛన్లు పంపిణీ చేయకుండా పభుత్వం మొండిగా వ్యవహరించింది. దీనిని పక్కదారి పట్టించి చంద్రబాబుపై అభాండాలు వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలింగ నర్తనోత్సవ అలంకరణలో అహోబిలేసుడు
[ 20-05-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వైశాఖమాస నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఇసుక క్వారీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
[ 20-05-2024]
మండలంలోని ముడుమాల, పల్దొడ్డి, ఈర్లదిన్నె, కె.సింగవరం గ్రామాల్లోని ఇసుక క్వారీలను సోమవారం జిల్లా కలెక్టర్ సృజన పరిశీలించారు. -
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
[ 20-05-2024]
శ్రీశైలం దేవస్థానంలో భక్తుల నుంచి అదనంగా టికెట్ రుసుం వసూలు చేస్తున్నారు. అభిషేక కర్తలతోపాటు అదనంగా వచ్చే వారికి టికెట్ రేటు పెంచి విక్రయిస్తున్నారు. -
సర్వే తప్పులు.. రుణానికి తిప్పలు
[ 20-05-2024]
భూసర్వేలో జరిగిన తప్పులు రైతులకు శాపంగా మారాయి.. భూహక్కు పత్రాల్లో తప్పులు.. విస్తీర్ణంలో తేడాలు.. ఉమ్మడి హక్కు పత్రాల కారణంగా పంట రుణాల నవీకరణకు బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు. -
గేట్లు ఎత్తలేరు.. తాళ్లు బిగించలేరు
[ 20-05-2024]
7.10 లక్షల ఎకరాలకు సాగునీరు.. వేలాది పల్లెలకు మంచినీరు అందించే సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ అటకెక్కింది.. గత కొంతకాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. -
అతిసారం.. కలవరం
[ 20-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్ 32, మైనర్ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. -
గుట్టుగా ఇసుకను తోడేస్తున్నారు
[ 20-05-2024]
తుంగభద్ర నదిలోని రీచ్ల వద్ద ఇసుకను గుట్టుగా తవ్వుతున్నట్లు తేలింది..కౌతాళం మండలం గుడికంబాలి, మరళి రీచ్లను ఆదివారం కలెక్టర్ సృజన ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
దాచిన సొమ్ము దోచుకున్నారు
[ 20-05-2024]
పేద, మధ్యతరగతి ప్రజలు పైసా..పైసా కూడబెట్టి పోస్టాఫీసుల్లో డబ్బును దాచుకుందామంటే కొందరు సిబ్బంది అప్పనంగా సొంతానికి వాడేస్తున్నారు. -
మీటరు గిర్రు.. గుండె గుబిల్లు
[ 20-05-2024]
ఫిబ్రవరి వేడెక్కింది.. మార్చి ‘మాడ’కొట్టింది.. ఏప్రిల్ కుతకుత ఉడికింది.. ఇలా మే మొదటి వారం వరకు ఎండలు దంచికొట్టాయి.. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. -
కళలకు వేదిక..ప్రతిభా వీచిక
[ 20-05-2024]
చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ కళల్ని నేర్చుకునేందుకు నంద్యాలలోని కళారాధన సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. -
నిధుల ఆటంకం
[ 20-05-2024]
క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా అవి కేవలం మాటలకే పరిమితమయ్యాయి. ఆటలు అటకెక్కాయి. క్రీడాభివృద్ధికి నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉంది. -
పంట నష్టం.. గణన కష్టం
[ 20-05-2024]
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీలోగా పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషన్ వెల్లడించింది. -
చెరువులో శవాలు
[ 20-05-2024]
నగర శివారు.. గార్గేయపురం పరిధిలోని నగరవనం చెరువులో ముగ్గురు గుర్తు తెలియని మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం కలకలం రేపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. ట్రోలింగ్తో వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’