logo

27న ఉద్యోగ మేళా

షుగర్‌ కంపెనీల్లో ఉన్న ఖాళీల భర్తీకి గాను ఉద్యోగార్థులకు ఈ నెల 27న మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం మెట్టుగడ్డలోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం, పిల్లలమర్రిరోడ్‌లో ఉద్యోగమేళా

Published : 25 Jan 2022 02:44 IST

మహబూబ్‌నగర్‌ అర్బన్‌ : షుగర్‌ కంపెనీల్లో ఉన్న ఖాళీల భర్తీకి గాను ఉద్యోగార్థులకు ఈ నెల 27న మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం మెట్టుగడ్డలోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం, పిల్లలమర్రిరోడ్‌లో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి బి.రాఘవేందర్‌సింగ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామకృష్ణాపురం, కొత్తకోటలో ఉన్న ఎన్‌ఎస్‌ఎల్‌ షుగర్స్‌ లిమిటెడ్‌, క్రిష్ణవేణి షుగర్స్‌ కంపెనీల్లో ఇంజినీర్‌ ట్రైనీ(మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌), ఫీల్డ్‌ కోఆర్డినేÆట్ ట్రైన్సీ, ల్యాబ్‌ కెమిస్ట్‌ ట్రైనీస్‌, అక్కౌంట్్స ట్రైనీస్‌ వివిధ పోస్టుల్లో మొత్తం 26 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. బీటెక్‌ మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రిక్‌, ఇన్స్‌స్ట్రూమెంటేషన్‌), ఎంఎసీˆ్స (షుగర్స్‌ టెక్‌, ఆల్కాహాల్‌ టెక్‌, కెమిస్రీˆ్ట, కెమిస్రీˆ,్ట బీఎసీˆ్స అగ్రికల్చర్‌, బీజడ్‌సీˆ, ఎంపీˆసీˆ) డిప్లోమా ఇన్‌ అగ్రికల్చర్‌, బీకాం చదివి 18 - 35 లోపు వయస్సు ఉన్న వారు అర్హులన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో పాటు పాన్‌కార్డు, ఆధార్‌కార్డుతో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ఉద్యోగ మేళాకు హాజరు కావాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల వారీగా నెలకు రూ.13వేల నుంచి రూ.20వేలు వేతనం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు చరవాణి నంబర్లు 9550205227, 9885462005లను సంప్రదించాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని