ఫోన్ చేయండి.. ధ్రువపత్రం పొందండి
బతికున్నట్లు ధ్రువీకరించే జీవన ప్రమాణ పత్రాన్ని పొందాలంటే గతంలో రోజుల తరబడి సమయం పట్టేది. ప్రస్తుతం తపాలా శాఖ తీసుకొచ్చిన సదుపాయంతో కేవలం నిమిషాల వ్యవధిలోనే పొందొచ్చు.
వయోవృద్ధుల కోసం తపాలా శాఖ కృషి
మహబూబ్నగర్ ప్రధాన తపాలా కార్యాలయం
న్యూస్టుడే, మహబూబ్నగర్ సాంస్కృతికం: బతికున్నట్లు ధ్రువీకరించే జీవన ప్రమాణ పత్రాన్ని పొందాలంటే గతంలో రోజుల తరబడి సమయం పట్టేది. ప్రస్తుతం తపాలా శాఖ తీసుకొచ్చిన సదుపాయంతో కేవలం నిమిషాల వ్యవధిలోనే పొందొచ్చు. ఒక్క ఫోన్ చేస్తే చాలు.. తపాలా సిబ్బంది ఇంటికే వచ్చి వెంటనే జీవన ప్రమాణ పత్రాన్ని అందిస్తారు. విశ్రాంత ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధులు, పింఛనుదారుల సౌకర్యార్థం తపాలా శాఖ ఈ సదుపాయాన్ని కల్పించింది. ప్రభుత్వం విధించిన గడువులోగా పింఛనుదారులు ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో జీవన ప్రమాణ పత్రాలను ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగ విరమణ పొంది నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారు పత్రం పొందాలంటే ఇబ్బందులు పడేవారు. దీన్ని గుర్తించిన తపాలాశాఖ విశ్రాంత ఉద్యోగులకు సేవ చేసేందుకు ముందుకొచ్చింది.
* వయసు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు జీవన ప్రమాణ పత్రాలు, వేలిముద్రలు సమర్పించడానికి కార్యాలయాల చుట్టు తిరుగకుండా తపాలా శాఖకు ఫోన్ చేయొచ్చు. ఆ శాఖ సిబ్బంది నేరుగా ఇంటికే వస్తారు. క్షణాల్లో జీవణ ప్రమాణ పత్రాన్ని (డిజిటలైజేషన్ లైవ్ సర్టిఫికేట్) అందిస్తారు. ఆన్లైన్లో ధ్రువపత్రాన్ని నమోదు చేశాక నేరుగా ఖజానా కార్యాలయానికి పంపిస్తారు. లేదంటే ప్రింట్ కాపీనీ తీసుకోవచ్చు. తపాలాశాఖకు సర్వీసు ఛార్జి కింద రూ.70 చెల్లించాల్సి ఉంటుంది.
* పింఛను పొందుతున్న వయోవృద్ధులకు సేవలందించేందుకు తపాలాశాఖ ముందుకొచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తపాలా కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను తెరిచాం. నేరుగా వచ్చి తపాలా కార్యాలయాల్లో జీవన ప్రమాణ పత్రాలను పొందొచ్చు. కార్యాలయానికి రాలేని వారు మహబూబ్నగర్ హెడ్ పోస్ట్మాస్టర్కు 77804 25396, ఐపీపీబీ సీనియర్ మేనేజరుకు 86180 34580, గద్వాల హెడ్ పోస్ట్మాస్టర్కు 86398 07824 ఫోన్ నంబర్లలో సమాచారం అందిస్తే వారింటికి వెళ్లి ధ్రువపత్రాన్ని అందిస్తాం.
- షేక్ షబ్బీర్, తపాలా శాఖ మహబూబ్నగర్ డివిజన్ పర్యవేక్షకుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!