ప్రయాణం.. జర భద్రం
హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి-756 ప్రమాదకరంగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక చోట ఈ రోడ్డుపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఏటా సగటున ప్రమాదాలిలా..
ప్రమాదాలు : 120
మరణాలు : 112 మంది
క్షతగాత్రులు: 160 మంది
జనవరి 29న మహబూబ్నగర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ప్రమాదం అంచు వరకు వెళ్లింది. శ్రీశైలం నుంచి మహబూబ్నగర్కు వస్తున్న ఈ బస్సు శ్రీశైలం ప్రాజెక్టు దృశ్య కేంద్రం సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పి రోడ్డుకు ఆనుకోని ఉన్న ఇనుప రెయిలింగ్ను ఢీకొట్టి నిలిచిపోయింది. ఆ సమయంలో ఈ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇనుప రెయిలింగ్ ఉండడంతో ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయట పడ్డారు. లేకుంటే బస్సు లోయలో పడి పెనుప్రమాదం సంభవించేదని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిలో గతేడాది జులైలో ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. అతి వేగం, ఓవర్ టేక్ చేయడమే ప్రమాదానికి కారణం. చెన్నారం గేట్ సమీపంలో గతంలోనూ అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ రహదారిపై దోమలపెంట చౌరస్తా, పాతాళగంగ రోడ్డు, వంగూరు, వెల్దండ, కడ్తాల్, డిండి రోడ్డు సమీపంలో గతంలో పలు ప్రమాదాల్లో చాలామంది మృత్యువాత పడ్డారు.
ప్రమాదకరంగా ఉన్న శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ఓ మలుపు
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్: హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి-756 ప్రమాదకరంగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక చోట ఈ రోడ్డుపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి పూర్వ మహబూబ్నగర్ జిల్లాలోని ఆమనగల్లు, కల్వకుర్తి, అచ్చంపేట, మన్ననూరు, దోమలపెంట, ఈగలపెంట, పాతాళగంగ మీదుగా ఏపీలోని దోర్నాల వరకు వెళ్తుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు నిత్యం ఈ రహదారి మీదుగానే భారీగా వాహనాల రాకపోకలుంటాయి. ఆర్టీసీ బస్సులతోపాటు సొంత వాహనాలు, అద్దె కార్లలో ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఈ రోడ్డుపై డివైడర్లు లేకపోవడంతో ఓవర్టేక్ చేయడానికి ఎక్కువగా ఆస్కారాలున్నాయి. ఎదురెదురుగా వేగంగా వాహనాలు వచ్చి ఢీ కొడుతున్నాయి. ఈ ప్రాంతంలో డివైడర్లు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇక్కడ స్పీడ్గన్ ద్వారా జరిమానాలు లేకపోవడంతో వేగ నియంత్రణపై అదుపు తప్పి తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
మద్యం దుకాణాలతో ఇబ్బందులు.. : అచ్చంపేట దాటిన తర్వాత ఘాట్ రోడ్డులున్నాయి. మన్ననూరు, దోమలపెంట, ఈగలపెంట, పాతాళగంగతోపాటు ఏపీ పరిధిలోని సున్నిపెంట మీదుగా శ్రీశైలం వరకు ప్రమాదకర మలుపులున్నాయి. ఈ మార్గంలో అనుభవం ఉండి, ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఆర్టీసీ డ్రైవర్లకే విధులు కేటాయిస్తారు. అయినా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రైవేటు వాహనాలు వేగంగా వెళ్లడం, మలుపు వద్ద అజాగ్రత్తగా ఉండటంతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. శ్రీశైలం మార్గం అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పరిధిలో ఉండటంతో పెద్ద ఎత్తున వేగ నియంత్రికలున్నాయి. ఇవి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కల్వకుర్తి దాటి నల్లమలలో ప్రవేశించిన తర్వాత అడుగడుగునా మద్యం దుకాణాలే కనిపిస్తాయి. అక్కడే సిట్టింగ్లు ఏర్పాటు చేస్తారు. తాగి వాహనాలు నడుపుతుండటం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ప్రమాదకర ప్రదేశాలను గుర్తించాం. ప్రస్తుతం వెల్దండ వద్ద స్పీడ్ గన్ ఉంది. అదనంగా అచ్చంపేట-అమ్రాబాద్ రోడ్డు మరో రెండు ఏర్పాటు చేస్తాం. ఈ రోడ్డుపై డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తాం. అనుమతుల్లేకుండా ఎక్కడైనా మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.
మనోహర్, ఎస్పీ, నాగర్కర్నూల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.