మళ్లీ తెరపైకి పత్తి విత్తన శుద్ధి
జోగులాంబ గద్వాల జిల్లాలోని విత్తన శుద్ధి కేంద్రాల్లో డీలింటింగ్ ప్రక్రియను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. నిర్వాహకులు కాలుష్య రహిత యంత్రాలంటూ మళ్లీ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
కాలుష్యంపై ఆందోళనలతో రెండేళ్లుగా ఆగిన వైనం
ప్రక్రియ అనంతరం వెలువడుతున్న వ్యర్థ జలం (పాత చిత్రం)
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలోని విత్తన శుద్ధి కేంద్రాల్లో డీలింటింగ్ ప్రక్రియను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. నిర్వాహకులు కాలుష్య రహిత యంత్రాలంటూ మళ్లీ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. వారం రోజుల క్రితం రాజస్థాన్లోని ఉదయ్పూర్కు కొత్త యంత్రాల కోసం వెళ్లినట్లు సమాచారం. ఇక్కడ విత్తన పత్తిని డీలింటింగ్ చేసే పరిశ్రమలున్నాయి. గత రెండేళ్లుగా జిల్లాలో ఈ ప్రక్రియ ఆగిపోయింది. హరిత ట్రైబ్యునల్ నుంచి మొట్టికాయలు పడటం, భారీగా జరిమానా వేయడం, స్థానికులు, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా ఆపేశారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఈ ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని చూస్తున్నారు. ఇప్పటికే ప్రధాన విత్తన కంపెనీలతో నిర్వాహకులు మంతనాలు కూడా జరిపినట్లు సమాచారం.
శుద్ధి చేస్తారిలా..
విత్తన శుద్ధి కేంద్రాల్లో దూది నుంచి గింజలను వేరు చేస్తారు. అలా వేరు చేసిన అనంతరం ఆ గింజలకు కొద్దిగా దూది అతుక్కొని ఉండిపోతోంది. ఆ దూదిని కూడా వేరు చేయడానికి ఆ గింజలను డీలింటింగ్ చేస్తారు. సల్ఫ్యూరిక్ ఆసిడ్, సున్నం రసాయనాలను పోసి శుద్ధి చేస్తారు. ఇలా చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను స్థానికంగానే భూమిలో గుంత చేసి వదిలేస్తున్నారు. దీంతో భూమి సారవంతం కోల్పోవడంతోపాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. చుట్టు పక్కల భూముల్లో పంటలు పండటం లేదు. వివిధ శాఖల అధికారులు, ముఖ్య నేతలకు ఏటా పెద్ద ఎత్తున ఈ కంపెనీల నుంచి మాముళ్ల రూపంలో వెళ్తుండటంతో వీటిని ఎవరూ అడ్డుకోవడం లేదు. వీటిపై కొందరు హరిత ట్రైబ్యునల్ను ఆశ్రయించడంతో రెండేళ్ల కిందట విత్తనశుద్ధి కేంద్రాల్లో ఈటీపీ(రసాయనాల శుద్ధీకరణ ప్లాంటు) ద్వారా డీలింటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి ద్వారా కలుషిత జలాలు రావని పరిశ్రమల్లో ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా కూడా భూగర్భ జలాలు కలుషితం అవుతుండడం, రైతుల నుంచి ఆందోళనలు రావడంతో ప్రస్తుతానికి ఈ ప్రక్రియను కూడా జిల్లాలో ఆపేశారు.
50వేల ఎకరాల్లో సాగు..
జిల్లాలో ఏటా సుమారు 50వేల ఎకరాల్లో విత్తన పత్తిని సాగు చేస్తారు. దేశంలోనే 25శాతం విత్తన పత్తి సాగు గద్వాల జిల్లాలోనే ఉంటుంది. గట్టు, కేటీదొడ్డి, ధరూరు, అయిజ, మల్దకల్, గద్వాల, వడ్డేపల్లి మండలాల్లో ఈ సాగు అధికంగా ఉంటుంది. జిల్లాలోని ప్రధాన ఆర్గనైజర్లు ప్రముఖ పత్తి విత్తన కంపెనీల ద్వారా స్థానికంగా రైతులతో సాగు చేయిస్తున్నారు. పేద రైతుల అవసరాలను ఆసరా చేసుకుని ఆర్గనైజర్లు ఈ సాగు ఖర్చు కోసమని ఏటా రూ.లక్షల్లో పెట్టుబడి రుణాలు ఇస్తున్నారు. సాగు పూర్తయిన తర్వాత వారి విత్తన శుద్ధి కేంద్రాలకే పంటలను తరలించాలి. అక్కడే డీలింటింగ్ ప్రక్రియను చేపడతారు. రెండేళ్లుగా ఈ ప్రక్రియను ఆపేయడంతో నిర్వాహకులకు వచ్చే లాభాలపై ప్రభావం చూపింది. దీంతో మళ్లీ ఈ ప్రక్రియను ప్రారంభించాలని చూస్తున్నట్లు ‘ఈనాడు’తో ఓ ఆర్గనైజర్ చెప్పడం గమనార్హం.
భారీ జరిమానా వేసినా..
జిల్లాలో ఈ ప్రక్రియపై ఓ వ్యక్తి మూడేళ్ల క్రితం హరిత ట్రైబ్యునల్కు వెళ్లడంతో తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి నలుగురు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి నలుగురు, కలెక్టర్ సభ్యులుగా ఓ సంయుక్త కమిటీని నియమించింది. ఆ కమిటీ జిల్లా కేంద్రంలోని పలు జిన్నింగ్ మిల్లులను పరిశీలించి నివేదికను హరిత ట్రైబ్యునల్కు అందించారు. ఆ నివేదికల్లో కాలుష్యం జరుగుతుందని తేల్చడంతో విత్తనశుద్ధి కేంద్రాలకు భారీగా జరిమానా విధించారు. స్థానికులు ఆందోళన చేయడంతో ప్రస్తుతానికి ఆపివేశారు. రూ.కోట్లలో ఆదాయం ఉండటంతో ఈ వ్యవస్థను మళ్లీ ముందుకు తీసుకురావాలని కొందరు ప్రయత్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.