24 గంటల్లో ధాన్యం దింపుకొనేలా చర్యలు
జిల్లాలో కేఎల్ఐ ద్వారా సాగునీరు అందుబాటులోకి రావడంతో ఏటికేడు వరి సాగు అధికమవుతోందని, ఇందుకనుగుణంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పేర్కొన్నారు.
‘న్యూస్టుడే’తో అదనపు కలెక్టర్ మోతీలాల్
నాగర్కర్నూల్, న్యూస్టుడే : జిల్లాలో కేఎల్ఐ ద్వారా సాగునీరు అందుబాటులోకి రావడంతో ఏటికేడు వరి సాగు అధికమవుతోందని, ఇందుకనుగుణంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పేర్కొన్నారు. ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరిస్తున్నామని, మిల్లర్లతో ఇటీవల కలెక్టర్, ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించి చర్చించారన్నారు. అధికారులకు ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై ‘న్యూస్టుడే’ ముఖాముఖిలో అదనపు కలెక్టర్ మోతీలాల్ ఇంటర్య్వూ విశేషాలు ఇవీ..
ప్ర : రైస్ మిల్లుల వద్ద రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తెచ్చి వారం, పది రోజుల పాటు వేచి చూడాల్సి వస్తోంది. జాప్యాన్ని ఎలా నివారిస్తారు.?
జ : లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య వచ్చింది. ఈ సమస్యను అధిగమించేందుకు రైతులే ధాన్యాన్ని ట్రాక్టర్లలో తెచ్చేందుకు అనుమతి ఇచ్చాం. సమస్య తీవ్రత దృష్ట్యా 24 గంటల్లో తెచ్చిన ధాన్యాన్ని దింపుకోవాలని మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. మిల్లుల్లోనూ తనిఖీలు చేస్తున్నాం. సంబంధిత గుత్తేదారుడితో ట్రాక్టర్లకు కిరాయి చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో రైతులకు మిల్లుల వారి మధ్యన సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆలస్యం అవుతోంది. సమస్య ఉన్నట్లుగా ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందిస్తున్నాం.
ప్ర : రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించటం లేదన్న ఫిర్యాదులపై స్పందన ?
జ : రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈనెల 2నే రూ.30కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. నాలుగు రోజుల కితం రూ.20 కోట్లు వచ్చాయి. ధాన్యం దింపుకున్న తర్వాత రైతుల ఖాతా నంబర్ల నమోదు ప్రక్రియలో కొంత జాప్యం అవుతోంది. అంతేతప్పా డబ్బులు చెల్లించడంలో జాప్యం కావడం లేదు.
ప్ర : ప్రతి సీజన్లో లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తోంది. నిల్వల కోసం సరిపడా గోదాంలు సిద్ధం చేశారా?
జ : ధాన్యం నిల్వలకు ప్రస్తుతం ఇబ్బంది లేదు. జిల్లాలో 127 రైస్ మిల్లులు, 13 పారాబాయిల్డ్ మిల్లులున్నాయి. అందులో నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా మార్కెటింగ్ శాఖ నుంచి ఏడు గోదాంలను రిజర్వు చేసి ఉంచాం. ఈ ఏడాది ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 15 గోదాంలు నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తయితే ప్రభుత్వ పరంగానే ధాన్యం నిల్వ చేసుకునే అవకాశం ఉంది.
ప్రశ్న : క్వింటాకు తాలు పేరుతో 6 నుంచి 9 కిలోల వరకు తరుగు తీస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?
జవాబు : ఈ సారి వర్షాభావ పరిస్థితులతో వరి పంటకు తెగులు సోకి తాలు శాతం పెరిగింది. అందుకే రైతుల వద్ద క్వింటాకు రెండు నుంచి మూడు కిలోల వరకే తరుగు తీయాలని మిల్లర్లకు చెప్పాం. మిల్లర్ల సమావేశంలోనూ కలెక్టర్ స్పష్టమైన సూచనలు చేశారు. వడ్లలో తాలు తొలగించే 75 క్లీనర్లను జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చాం. రైతులు ఉపయోగించుకోవాలి. అన్నదాతలను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!