నువ్వా.. నేనా?
కొడంగల్ నియోజకవర్గం రాష్ట్రానికి చివరిది. కర్ణాటకలో ఉండే ఈ ప్రాంతం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లో కలిసింది.
రసవత్తర పోరుకు వేదిక కొడంగల్
న్యూస్టుడే-కోస్గి: కొడంగల్ నియోజకవర్గం రాష్ట్రానికి చివరిది. కర్ణాటకలో ఉండే ఈ ప్రాంతం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లో కలిసింది. రాష్ట్రాలు, జిల్లాలు, నియోజకవర్గాల విభజన జరిగిన ప్రతిసారీ ఈ ప్రాంతంపై ప్రభావం చూపింది. మొదట కర్ణాటక, తరువాత ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాలు, అలాగే మొదట్లో గుల్బర్గా, తరువాత మహబూబ్నగర్, ఇప్పుడు వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలోకి వచ్చింది. తొలినాళ్లలో ద్విసభ్య నియోజకవర్గంగా కొనసాగింది. ఎక్కువ కాలం గడి (గుర్నాథ్రెడ్డి ఇంటి చుట్టూ కోట బురుజులు ఉంటాయి), గుడి (నందారం వెంకటయ్య తండ్రి గుడికట్టారు) మధ్యనే పోరు కొనసాగింది. అందుకే గడి, గుడి పోరుగా ఈ ప్రాంతంలో మాట్లాడుకునేవారు. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1996లో ఒక్కసారి ఉప ఎన్నిక జరిగింది. 1957లో అచ్యుతారెడ్డి మినహా ఈ ప్రాంతంలో గెలిచిన వారెవరికీ మంత్రి పదవి లభించలేదు. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ వరుసగా మూడుసార్లు గెలవలేదు.
1952
ద్విసభ్య నియోజకవర్గంలో ఒకటి జనరల్, మరొకటి ఎస్సీ స్థానంగా ఉంది. జాన్గోపాల్(ఆర్పీఐ)పై అనంతరెడ్డి(కాంగ్రెస్) విజయం సాధించారు. మరో స్థానంలో వీరాస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1957లో కాంగ్రెస్ అభ్యర్థి అచ్యుతారెడ్డి పీడీఎఫ్ అభ్యర్థి విఠల్రావుపై గెలుపొందారు.
1962
అచ్యుతారెడ్డి(కాంగ్రెస్)పై స్వతంత్ర అభ్యర్థి రుక్మారెడ్డి విజయం సాధించారు. బొంరాస్పేట మండలం రేగడిమైలారానికి చెందిన రుక్మారెడ్డి డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి నియోజకవర్గంలో తొలి స్వతంత్ర ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచారు. మరో స్థానంలో ఇల్లరి బసప్ప(కాంగ్రెస్)పై స్వతంత్ర అభ్యర్థి జీఎన్ రావుపై విజయం సాధించారు.
1967
అచ్యుతారెడ్డి (కాంగ్రెస్) స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డిపై 8985 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన మూడుసార్లు పోటీపడి రెండుసార్లు గెలిచారు.
1972
దౌల్తాబాద్ మండలం నందారం గ్రామానికి చెందిన నందారం మిడిదొగొడ్డి వెంకటయ్య(స్వతంత్ర), కె.శ్రీనివాసరెడ్డి(స్వతంత్ర)పై 1813 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయన తండ్రి నర్సిములు కొడంగల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు తిరుమల మాదిరి పూజాకార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి.
1978
కొడంగల్ మండలం రావులపల్లికి చెందిన గుర్నాథ్రెడ్డి(స్వతంత్ర) తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. చినవీరన్న(కాంగ్రెస్ ఐ)పై 3723 ఓట్ల తేడాతో గెలుపొందారు.
1983
రెండోసారి ఇందిర కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన గుర్నాథ్రెడ్డి స్వతంత్ర అభ్యర్థి నందారం వెంకటయ్యపై 3364 ఓట్ల తేడాతో విజయం పొందారు. మహబూబ్నగర్కు చెందిన అన్న కిష్టప్ప(తెదేపా) పోటీలో నిలిచారు. హోరాహోరీ పోరులో గుర్నాథ్రెడ్డిది పైచేయి అయ్యింది.
1985
ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్త పర్యటనలో నందారం వెంకటయ్య తెదేపాలో చేరారు. ఆ ప్రభంజనంలో ఆయన 10802 ఓట్ల మెజారిటీతో గుర్నాథ్రెడ్డిపై విజయం సాధించారు.
1989
గుర్నాథ్రెడ్డి(కాంగ్రెస్) నుంచి పోటీపడగా, వెంకటయ్యను కాదని తెదేపా రతన్లాల్ లాహోటీని రంగంలోకి దింపింది. ఈ ఎన్నికల్లో గుర్నాథ్రెడ్డి ఏకంగా 20,585 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గంలో ఇదే ఇప్పటి వరకు అత్యధికం.
1994-99
ఎన్నికల్లో వెంకటయ్య(తెదేపా), గుర్నాథ్రెడ్డి(కాంగ్రెస్) తలపడగా నందారం వెంకటయ్య 16,443 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్యే వెంకటయ్య అనారోగ్యంతో మృతిచెందగా 1996లో ఉప ఎన్నిక జరిగింది. ఎమ్మెల్యే కుమారుడు నందారం సూర్యనారాయణకు తెలుగుదేశం టిక్కెట్టు ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి గుర్నాథ్రెడ్డి పోటీపడ్డారు. నువ్వా,నేనా అన్నట్టు సాగిన ఈ ఎన్నికల్లో అధికార తెదేపా తన యంత్రాంగాన్ని మొత్తం నియోజకవర్గంలో మోహరించింది. చివరకు పార్టీ అభ్యర్థి సూర్యనారాయణ 6664 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1999లో గుర్నాథ్రెడ్డి(కాంగ్రెస్)తో అప్పటి జడ్పీటీసీ సభ్యురాలు దిడ్డి శారద(తెదేపా) తలపడగా 13,702 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలుపొందింది.
2004
కాంగ్రెస్ నుంచి గుర్నాథ్రెడ్డి పోటీపడ్డారు. తితిదే సభ్యుడిగా కొనసాగిన నందారం సూర్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన సతీమణి అనూరాధకు తెదేపా బీఫాం అందించింది. ఈ ఎన్నికలో గుర్నాథ్రెడ్డి 5941 మెజారిటీతో అయిదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2009
ఈ ఎన్నికల్లో తెదేపా అనూహ్యంగా రేవంత్రెడ్డిని రంగంలోకి దించింది. ఎన్నికలకు కేవలం 15 రోజుల సమయంలో ఆయన కొడంగల్ తెదేపా అభ్యర్థిగా వచ్చారు. తన పదునైన ప్రసంగంతో ఈ ప్రాంత వాసులను ఆకట్టుకున్నారు. 6976 ఓట్ల మెజారిటీతో సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి గుర్నాథరెడ్డిని ఓడించారు. అప్పట్లో ఈ విజయం చర్చకు దారితీసింది
2014
త్రిముఖ పోటీ జరిగింది. తెదేపా నుంచి రేవంత్రెడ్డి నిలబడగా, కాంగ్రెస్ పార్టీ గుర్నాథ్రెడ్డిని కాదని మాజీ ఎంపీ విఠల్రావును రంగంలోకి దింపింది. దీంతో గుర్నాథ్రెడ్డి తెరాస కండువా కప్పుకొని పోటీపడ్డారు. త్రిముఖ పోటీలో రేవంత్రెడ్డి 14614 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
2018
రేవంత్రెడ్డిపై పైచేయి సాధించాలన్న ఉద్దేశంతో తెరాస ఏడాది ముందు నుంచే తమ ప్రయత్నాలు మొదలు పెట్టింది..తమ పార్టీ ఎమ్మెల్సీ పట్నం నరేందర్రెడ్డిని రంగంలోకి దింపింది. రాష్ట్రంలో తేదేపా ప్రభ రోజురోజుకీ తగ్గిపోవడంతో రేవంత్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ తరఫున పోటీచేశారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షునిగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలో తెరాస అభ్యర్థి నరేందర్రెడ్డి 9319 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సామాజిక అంశాలపై అవగాహన
[ 27-04-2024]
మండలంలోని పెద్ద ధన్వాడ గ్రామంలో సామాజిక అంశాలపై ఎస్సై జగదీశ్వర్ ప్రజలకు అవగాహన కల్పించారు. -
114 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
[ 27-04-2024]
వడ్డేపల్లి పురపాలిక పరిధిలోని శాంతి నగర్ పట్టణంలో ఒక ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన 114 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 27-04-2024]
మండలంలోని పోచమ్మగడ్డ తండాకు చెందిన వడ్తవత్ యశ్వంత్ నాయక్ సివిల్స్కు ఎంపికయ్యాడు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులపై ఆరా
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వస్తువులపై శనివారం తాహసీల్దార్ హరికృష్ణ వివరాలు సేకరించారు. -
చదువుల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
[ 27-04-2024]
ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి నిర్వహించనున్న వేసవి చదువుల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫౌండేషన్ కోఆర్డినేటర్ సాయికుమార్ అన్నారు. -
రాష్ట్రంలో విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి: కేసీఆర్
[ 27-04-2024]
తెలంగాణలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతి రోజూ ఊదరగొడుతున్నారని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
ఓటు హక్కుపై మహిళలకు అవగాహన
[ 27-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం ఓటు హక్కుపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. -
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!