రాజకీయాల్లో కొలువుదీరారు!
రాజకీయాల్లోకి ఎక్కువగా నాయకుల వారసులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, వైద్యులు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అరుదనే చెప్పాలి.
పాలమూరులో తమదైన ముద్ర వేసిన నాయకులు
మహబూబ్నగర్ గ్రామీణం, న్యూస్టుడే: రాజకీయాల్లోకి ఎక్కువగా నాయకుల వారసులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, వైద్యులు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అరుదనే చెప్పాలి. ఉమ్మడి జిల్లాలో మాత్రం కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి ప్రజల మనసుల్ని గెలిచి ఎమ్మెల్యేలుగా శాసనసభలో కొలువుదీరారు. కొందరు మంత్రి పదవులనూ అలంకరించి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అలాంటి నేతలపై ఆసక్తికర కథనమిదీ.
మార్కెట్ శాఖ కార్యదర్శిగా పనిచేసి.. : ఎంపీ పి.రాములు స్వస్థలం కల్వకుర్తి మండలం గుండూరు. 1978లో వ్యవసాయ మార్కెట్ శాఖ ఉద్యోగిగా చేరిన ఆయన కొన్నాళ్లు కల్వకుర్తిలో, తర్వాత సిద్దిపేటలో కార్యదర్శిగా పనిచేశారు. తెదేపా విధానాలకు ఆకర్షితులై 1994లో ఆ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి పోటీచేసి గెలుపొందారు. 1999లో మళ్లీ విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు. 2009లో అచ్చంపోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్లో క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేశారు.2018లో నాగర్కర్నూల్ ఎంపీగా పోటీచేసి గెలుపొందారు.
బ్యాంకు నౌకరీకి రాజీనామా చేసి.. : వీపనగండ్ల మండలం పెద్దదగడకు చెందిన జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ ఎస్బీహెచ్లో ఉద్యోగం చేసేవారు. కొలువుకు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. 1999లో కొల్లాపూర్ పోటీచేసి గెలుపొందారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తర్వాత కాంగ్రెస్లో చేరారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. వై.ఎస్., రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. 2012లో కాంగ్రెస్కు, మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెరాస తరఫున పోటీచేసి గెలుపొందారు. 2014లో తెరాస అభ్యర్థిగా గెలిచి కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇటీవల కాంగ్రెస్లో చేరి మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.
గెజిటెట్ అధికారుల సంఘం నేతగా.. : అడ్డాకుల మండలం రాచాల గ్రామానికి చెందిన శ్రీనివాస్గౌడ్ శానిటరీ ఇన్స్పెక్టర్గా 1988లో మహబూబ్నగర్ పురపాలికలో ఉద్యోగంలో చేరారు. తర్వాత పదోన్నతులతో కమిషనర్ స్థాయికి చేరారు. కూకట్పల్లి పురపాలిక డిప్యూటీ కమిషనర్గా, వికారాబాద్, రాజేంద్రనగర్, ఆల్వాల్ పురపాలికల కమిషనర్గా పనిచేశారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్(టీజీవో) వ్యవస్థాపక ఛైర్మన్గా, టీజేఏసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తేవటంలో కీలక పాత్ర పోషించారు. 2014లో ఉద్యోగానికి రాజీనామా చేసి తెరాసలో చేరారు. మహబూబ్నగర్ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 2018లో మరోమారు పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉన్న శ్రీనివాస్గౌడ్ మూడోసారి ఎన్నికల బరిలో నిలిచారు.
ప్రభుత్వ వైద్యుడి నుంచి..: అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన డా.చిక్కుడు వంశీకృష్ణ 1997లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంఎస్ పూర్తిచేశారు. కొంతకాలం లింగాల పీహెచ్సీ వైద్యుడిగా సేవలందించారు. డా.వంశీకృష్ణ 1999 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరి పోటీ చేశారు. తెదేపా అభ్యర్థి రాములు చేతిలో ఓటమి పాలయ్యారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాములుపై విజయం సాధించారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. మళ్లీ పోటీ చేస్తున్నారు.
ఉద్యమంలోకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. : వెల్దండకు చెందిన యెన్నం శ్రీనివాస్రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో అధికారిగా ముంబయి, దిల్లీలో పనిచేశారు. తెలంగాణ సాధనకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2007లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2007-09 వరకు ఉమ్మడి జిల్లా తెరాస అధ్యక్షుడిగా ఉద్యమ బలోపేతానికి కృషిచేశారు. 2009లో తెరాసకు రాజీనామా చేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా తరఫున పోటీచేసి గెలుపొందారు. 2014లో శ్రీనివాస్గౌడ్ చేతిలో ఓడిపోయారు. ఇటీవల కాంగ్రెస్లో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు హక్కుపై మహిళలకు అవగాహన
[ 27-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం ఓటు హక్కుపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. -
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం