మరికల్లో భూచోళ్లు
జిల్లాలో ప్రధాన కూడలి మరికల్. ఉమ్మడి పాలమూరు, కర్ణాటకలోని పలు ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ కూడలి దాటాల్సిందే...దీంతో మరికల్ పట్టణ రూపురేఖలు సంతరించుకుంది.
న్యూస్టుడే- నారాయణపేట న్యూటౌన్
జిల్లాలో ప్రధాన కూడలి మరికల్. ఉమ్మడి పాలమూరు, కర్ణాటకలోని పలు ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ కూడలి దాటాల్సిందే...దీంతో మరికల్ పట్టణ రూపురేఖలు సంతరించుకుంది. ఇక్కడి భూములకు గిరాకీ అదేస్థాయిలో ఉంది.. దీంతో ఇక్కడ ఆక్రమణలకు తెరలేస్తోంది. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురికాగా తాజాగా ప్రభుత్వ భూములపై కొందరి కన్నుపడింది.
సర్వే నెంబరు ఒకటిలో 30 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమిని తాను కొనుగోలు చేసినట్లు దస్త్రాలు చూపిస్తూ మరికల్ పట్టణానికే చెందిన ఓ వ్యక్తి మొదట ప్రహరీ నిర్మించారు. ఆ తర్వాత బోరు డ్రిల్ చేశారు. ప్రస్తుతం నిర్మాణ సామగ్రిని నిల్వ చేసుకొని పరదాల చాటున పనులు మొదలెట్టారు. ఆ వ్యక్తి చూపిస్తున్న డాక్యుమెంట్లు నకిలీవి అని, మొత్తం 30 గుంటలు ప్రభుత్వానివే అంటూ అఖిలపక్ష నాయకులు, గ్రామస్థులు వాదిస్తున్నారు. ఈ పంచాయతీ కలెక్టరు వరకు వెళ్లింది... కానీ నిర్మాణాలు చాపకింద నీరులా సాగుతున్నాయి.
భూమి చేజారితే.. : ఈ భూమి చేజారితే గ్రామానికే చెందిన పలువురు ఇందులో తామూ కొనుగోలు చేశామంటూ ముందుకొచ్చే అవకాశం ఉంది. గతంలో పట్టణానికే చెందిన ప్రముఖుడు ఆ భూమి కొనుగోలు చేశానని, ఇందుకు సంబంధించిన దస్త్రాలు ప్రదర్శిస్తూ అందులో డబ్బా ఏర్పాటు చేశారు..సకాలంలో గుర్తించిన అప్పటి ప్రజాప్రతినిధులు రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారంతో డబ్బాను తొలగించి 30 గుంటల చుట్టూ ఇనుప కంచె నిర్మించి బోర్డు ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం కంచెతో పాటు బోర్డు మాయమైంది. గతంలో ఇక్కడ రైతుబజారు నిర్మించడానికి ప్రతిపాదించారు. ప్రభుత్వం మారిన తరువాత ఆ ప్రతిపాదన ముందుకెళ్లలేదు.
ధర్మశాల స్థలంపైనా...
పట్టణంలో ప్రభుత్వ స్థలాలు తమవే అంటూ ఎవరికి వారు ముందుకు వస్తుండటంతో మిగిలిన స్థలాల సంరక్షణపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జాతీయ రహదారిని ఆనుకొని రాయచూర్రోడ్డులో ధర్మశాల ఉంది. మరికల్కు వచ్చే కొత్త వ్యక్తులు సేద తీరేందుకు, రాత్రి వేళ బస చేసేందుకు నిర్మించారు. మరికల్ పట్టణంలో 1960వ దశకంలో అప్పటి పాలకులు రెండు ధర్మశాలల్ని నిర్మించారు. ఒకటి గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద కాగా, మరొకటి రాయచూర్ రోడ్డులో నిర్మించారు. హనుమాన్ ఆలయం వద్ద నిర్మించిన ధర్మశాలను సత్యసాయి ఆలయంగా మార్చారు. రాయచూర్ రోడ్డులో ఉన్న ధర్మశాలలో మొన్నటి దాకా సంచార జాతులకు చెందిన వారు ఉండేవారు. నిర్వహణ లేకపోవడంతో ఇపుడు ఇది ముళ్లకంపచెట్లకు నిలయంగా మారింది. దీంతో ఎవరూ ఇక్కడ ఉండటం లేదు. గ్రామ పంచాయతీ దృష్టి సారించి దీని నిర్వహణ చేపట్టి సామాజిక అవసరాలకు వినియోగిస్తే బాగుంటుంది. లేదంటే ఇది కబ్జాకు గురవ్వడానికి ఎంతో సమయం పట్టదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!