కంచే చేను మేస్తోంది..!
అనాథలు, వంచనకు గురైన మహిళలు, చిన్నారులకు ఆశ్రయం కల్పించి భరోసా ఇవ్వాల్సిన కేంద్రాల్లో కొందరి తీరు ‘కంచే చేను మేసిన’ చందంగా ఉంటోంది.
బాలభవన్లో బాలికలకు భద్రత కరవు
కొరవడుతున్న అధికారుల పర్యవేక్షణ
- ఉమ్మడి జిల్లాలోని ఓ బాలసదనంలో కొన్నేళ్లుగా ఓ బాలిక ఉంటోంది. తల్లి చనిపోవడం, తండ్రి మరో పెళ్లి చేసుకోవడంతో ఆమె బాలసదనంలో ఆశ్రయం పొందింది. ఐదో తరగతి వరకు సదనంలోనే ఉంటూ ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. తర్వాత ఓ గురుకులంలో చేర్పించారు. పాఠశాలకు సెలవులివ్వడంతో బాలసదనంలోనే వచ్చి ఉంటోంది. బాలసదనం రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీలోని ఓ సభ్యుడు బాలికను లైగింక వేధింపులకు గురి చేశారు. కొన్నాళ్లుగా అతడి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చివరికి విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు పెట్టి ఇటీవల ఆ సభ్యుడిని రిమాండ్కు తరలించారు.
- మహబూబ్నగర్లోని జిల్లా వెల్ఫేర్ కార్యాలయం పరిధిలోని స్టేట్ హోంలో గతంలో భర్తను హత్య చేసిన ఓ మహిళను తీసుకొచ్చి ఉంచారు. ఈ కేసులో ఆమె మహబూబ్నగర్ జైలులో శిక్ష అనుభవించి మూడేళ్ల క్రితం బెయిల్పై బయటకు వచ్చింది. తర్వాత ఆమెను జిల్లా కేంద్రంలోని స్టేట్ హోంకు తరలించారు. ఆమెను అడ్డం పెట్టుకుని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారం వివాదాస్పదం అవుతుండటంతో ఆమెను హైదరాబాద్లోని స్టేట్హోంకు తరలించారు. ఈ విషయం అప్పట్లో జిల్లా అధికారుల దృష్టికెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈనాడు, మహబూబ్నగర్: అనాథలు, వంచనకు గురైన మహిళలు, చిన్నారులకు ఆశ్రయం కల్పించి భరోసా ఇవ్వాల్సిన కేంద్రాల్లో కొందరి తీరు ‘కంచే చేను మేసిన’ చందంగా ఉంటోంది. జిల్లా వెల్ఫేర్ కార్యాలయాల ఆధ్వర్యంలో పని చేయాల్సిన సదనాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో అక్కడ పని చేస్తున్న కొందరు సిబ్బంది ఆశ్రయం పొందుతున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొన్నిచోట్ల వారిని అసాంఘిక కార్యకలాపాలకు బలవంతం చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో బాలసదనాలున్నాయి. మహబూబ్నగర్ బాలసదనంలో 20 మంది, వనపర్తి-23, నారాయణపేట-60, నాగర్కర్నూల్-40, జోగులాంబ గద్వాల-35 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరి పరిరక్షణపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. ఇటీవల మహబూబ్నగర్లో జరిగిన ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి.
రక్షించాల్సిన వారే..
బాల్య వివాహాలు, లైంగిక దాడులు, బాలల అక్రమ రవాణా, వేధింపులు, బాలకార్మికులు, అనాథలుగా ఉన్న 18 ఏళ్లలోపు బాలికలను గుర్తించి బాలసదనంలో ఆశ్రయం కల్పిస్తారు. ప్రతి జిల్లాలో ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీలుంటాయి. ఈ కమిటీల్లో మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరి నుంచి ఒకరిని ఛైర్మన్గా ఎన్నుకుంటారు. మిగతా నలుగురు ఆ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వం ప్రతి మూడేళ్లకోసారి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, సమాజసేవ చేస్తున్న వారి నుంచి ఈ కమిటీలో చోటు కల్పిస్తారు. వీరిలో పురుషులతోపాటు మహిళలు తప్పనిసరిగా ఉండాలి. ఈ కమిటీ సభ్యులు సమాజంలో అనాథలను, వంచనకు గురైన వారిని గుర్తించి బాలసదనంలో ఉంచేందుకు నిర్ణయించి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. కానీ సమాజసేవ ముసుగులో వీరిలో కొందరు దారి తప్పుతున్నారు. మహబూబ్నగర్ ఘటనే దీనికి నిదర్శనం.
సమీక్షలేవీ...!
ప్రతి జిల్లా కేంద్రంలో వీరి పరిరక్షణకు సమన్వయకర్తలు, సిబ్బంది కలిపి ఏడుగురు విధుల్లో ఉంటారు. ఇలాంటి ఘటనలు వీరి దృష్టికెళ్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో వనపర్తి జిల్లాలోనూ పలు ఆరోపణలొచ్చాయి. ప్రతి జిల్లాలో కలెక్టర్ల అధ్యక్షతన సమావేశం జరిగి బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న వారి భద్రతపై సమీక్షలు నిర్వహించాల్సి ఉంది. అవి నామమాత్రంగానే మారుతున్నాయి. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ఛైల్డ్ వెల్పేర్ కమిటీలో పైరవీలకు ఆస్కారం లేకుండా మంచి వ్యక్తులకు చోటు కల్పించాల్సిన అవసరం ఉంది. మహబూబ్నగర్ ఘటనపై జిల్లా అధికారుల వివరణ కోసం ‘ఈనాడు’ ప్రయత్నిస్తే వారు దాటవేత ధోరణి ప్రదర్శిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు హక్కుపై మహిళలకు అవగాహన
[ 27-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం ఓటు హక్కుపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. -
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా