logo

రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

మండల కేంద్రమైన రాజోలిలో హీరో రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు.

Updated : 27 Mar 2024 16:29 IST

రాజోలి: మండల కేంద్రమైన రాజోలిలో హీరో రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. అభిమాని శివరామయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో యువకుల స్వచ్ఛందంగా పాల్గొని రక్త దానం చేశారు. జిల్లా జడ్పీ కో ఆప్షన్ సభ్యులు యండీ నిషాక్, రాజోలి చేనేత శ్రామిక సేవ సమితి సభ్యులు దర్జీ వీరేష్, సీఆర్పీ శాంతయ్య రక్తం దానం చేశారు. అనంతరం నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అభిమానులు మఠం వీరేష్, కర్జీ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని