logo

దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు

రాజోలి గ్రామంలో వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై గురువారం కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు.

Published : 28 Mar 2024 19:54 IST

రాజోలి: రాజోలి గ్రామంలో వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై గురువారం కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. గ్రామానికి చెందిన కుర్వ లక్ష్మణ్ణ, రమేష్ మధ్య పాత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం చిన్న సమస్యపై పెద్ద గొడవ జరిగింది. ఈ విషయంలో మాట మాట పెరిగడంతో రమేష్.. లక్ష్మణ్ణపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని