బ్యాలెట్ పెట్టెలో ఫలితం నిక్షిప్తం
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.
ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
2న ఓట్ల లెక్కింపు
మహబూబ్నగర్: పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ పెట్టె స్ట్రాంగ్ రూంకు తరలింపు
ఈనాడు, మహబూబ్నగర్: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఏ ఒక్క ఓటూ చేజారిపోకుండా జాగ్రత్త పడ్డారు. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకుగాను 1,437 ఓట్లు పోలయ్యాయి. ఓటేసిన వాళ్లలో 19 మంది ఎక్స్అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, పి.రాములు, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్రెడ్డి, చల్లా వెంకట్రాంరెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, జె.అనిరుథ్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, వి.శ్రీహరి, చిట్టెం పర్నికారెడ్డి, మేఘారెడ్డి, రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ, కె.నారాయణరెడ్డి, వి.శంకర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 83 మంది జడ్పీటీసీ సభ్యులు ఉండగా అందరూ ఓటింగ్లో పాల్గొన్నారు. 23 పురపాలికల్లో మొత్తం 449 మంది కౌన్సిలర్లు ఉండగా అందరూ ఓటేశారు. మొత్తం 888 మంది ఎంపీటీసీలు ఉండగా 886 మంది ఓటేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంథన్గోడ్ ఎంపీటీసీ సుమిత్ర(భాజపా), నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గుడ్ల నర్వ ఎంపీటీసీ శారద(స్వతంత్ర) ఓటు వేయకపోవడంతో 99.86 శాతం పోలింగ్ నమోదైంది. నాగర్కర్నూల్, నారాయణపేట పోలింగ్ కేంద్రాలు మినహా అన్నిచోట్ల వంద శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును పరిశీలించారు.
పోలింగ్ కేంద్రానికి వస్తున్న మన్నె జీవన్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి,
ఎమ్మెల్యేల పర్యవేక్షణ..: ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్ వేయకుండా ఎమ్మెల్యేలు పర్యవేక్షించారు. గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి భారాసకు ఓట్లు అన్నీ సద్వినియోగం అయ్యేలా పర్యవేక్షణ చేశారు. నారాయణపేటలో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి దగ్గరుండి జిల్లాలోని తమ పార్టీ ఓట్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మిగతా నియోజకవర్గాల్లో భారాస ప్రజాప్రతినిధులందరూ కలిసి వచ్చి ఓట్లు వేశారు. భారాస అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి పలు పోలింగ్ కేంద్రాల్లో పర్యటించారు. మొత్తం 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటంతో వారి సారథ్యంలో ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓట్లు చేజారకుండా ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులతో మంతనాలు జరిపారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డి, సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి పలు పోలింగ్ కేంద్రాల్లో పర్యటించి ఓటింగ్ సరళిపై ఆరా తీశారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి
ఎవరికివారు గెలుపుపై ధీమా..
ప్రధాన పార్టీలు ఎవరికివారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ ఓటర్లు తమకే ఓటేశారని ఆశాభావంతో ఉన్నారు. మొదటి ప్రాధాన్య ఓటుతోనే తాము గెలుస్తామన్న నమ్మకంలో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఓటర్లలో మెజారిటీ శాతం భారాసకు చెందిన ప్రజాప్రతినిధులే ఉన్నారని వారంతా తమకే ఓటు వేశారన్న నమ్మకంలో భారాస అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి ఉన్నారు. రెండు ప్రధాన పార్టీల్లో కొందరు అభ్యర్థులు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఏప్రిల్ 2న విజేత ఎవరో తేలనుంది.
బంగారు నాణెం..
ఓ ప్రధాన పార్టీకి చెందిన ఓటర్లకు బంగారు నాణేలను ఇచ్చారని పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ పార్టీకి చెందిన ఓటర్లను వివిధ ప్రాంతాల్లో శిబిరాలకు తీసుకెళ్లారు. తమకు డబ్బు ఇవ్వలేదని మహబూబ్నగర్లో పలువురు ఓటు వేయమని భీష్మించుకు కూర్చున్నారు. ఇప్పటికిప్పుడు డబ్బులు ఇవ్వడం కష్టమని, బదులుగా బంగారు నాణెలు ఇచ్చారని జోరుగా ప్రచారం సాగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సామాజిక అంశాలపై అవగాహన
[ 27-04-2024]
మండలంలోని పెద్ద ధన్వాడ గ్రామంలో సామాజిక అంశాలపై ఎస్సై జగదీశ్వర్ ప్రజలకు అవగాహన కల్పించారు. -
114 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
[ 27-04-2024]
వడ్డేపల్లి పురపాలిక పరిధిలోని శాంతి నగర్ పట్టణంలో ఒక ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన 114 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 27-04-2024]
మండలంలోని పోచమ్మగడ్డ తండాకు చెందిన వడ్తవత్ యశ్వంత్ నాయక్ సివిల్స్కు ఎంపికయ్యాడు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులపై ఆరా
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వస్తువులపై శనివారం తాహసీల్దార్ హరికృష్ణ వివరాలు సేకరించారు. -
చదువుల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
[ 27-04-2024]
ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి నిర్వహించనున్న వేసవి చదువుల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫౌండేషన్ కోఆర్డినేటర్ సాయికుమార్ అన్నారు. -
రాష్ట్రంలో విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి: కేసీఆర్
[ 27-04-2024]
తెలంగాణలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతి రోజూ ఊదరగొడుతున్నారని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
ఓటు హక్కుపై మహిళలకు అవగాహన
[ 27-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం ఓటు హక్కుపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. -
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!