logo

26న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాక

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్‌ ఈ నెల 26న మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు.

Published : 24 Apr 2024 06:09 IST

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్‌ ఈ నెల 26న మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు. మంగళవారం భారాస కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 26న జిల్లా కేంద్రంలో రోడ్‌షోలో పాల్గొంటారని, తర్వాత గడియారం కూడలిలో నిర్వహించే సమావేశంలో ప్రసంగిస్తారని చెప్పారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ మాట నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసి విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. పెంచిన పింఛను, మహిళలకు రూ.2,500 నగదు, రైతుబంధు డబ్బులు ఇవ్వలేదని, రుణ మాఫీ చేయలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. భాజపా, కాంగ్రెస్‌ ఏకమై భారాస అభ్యర్థులను ఓడించేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు వెంకటేశ్‌ గుప్తా, రాజేశ్వర్‌గౌడ్‌, రవీందర్‌రెడ్డి, రమణారెడ్డి, రాఘవేందర్‌గౌడ్‌, నర్సింహారెడ్డి, దేవేందర్‌రెడ్డి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు