దశాబ్దాలుగా కాలినడకనే ప్రయాణం
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చెన్నూరు గ్రామస్థులు బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదు. గ్రామానికి మూడు బీటీరోడ్లు ఉన్నా అక్కడికి ఆర్టీసీ బస్సు వెళ్లదు.
విద్యార్థులు, ప్రజల అవస్థలు
తాడిపర్తి నుంచి చెన్నూరుకు ఉన్న బీటీరోడ్డు
గోపాల్పేట, న్యూస్టుడే : దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చెన్నూరు గ్రామస్థులు బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదు. గ్రామానికి మూడు బీటీరోడ్లు ఉన్నా అక్కడికి ఆర్టీసీ బస్సు వెళ్లదు. మండలకేంద్రానికి కేవలం 3కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇతర గ్రామాలకు వెళ్లాలంటే ముందుగా గోపాల్పేట లేక తాడిపర్తి గ్రామాలకు మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సిందే. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినా ఈ గ్రామస్థులు మాత్రం ఆటోలను ఆశ్రయించక తప్పడంలేదు.
మండల కేంద్రానికి 3కిలోమీటర్లు : గోపాల్పేటకు మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నా ఇంతవరకు గ్రామస్థులకు ఎటువంటి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు రావాలన్నా, వృద్ధులు, పిల్లలు పాఠశాల, కళాశాలలకు వెళ్లాలన్నా, ఇతర గ్రామాలకు, అత్యవసర పరిస్థితుల్లోనైనా మూడు కిలోమీటర్ల కాలినడక మాత్ర ఇప్పటికీ తప్పడంలేదు. గోపాల్పేటలోని విద్యాసంస్థలు గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉంటాయి. విద్యార్థులు ఉదయం నాలుగు, తిరిగి గ్రామానికి వెళ్లడానికి నాలుగు కిలోమీటర్లు మొత్తం 8కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించలేకపోతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు గ్రామానికి గోపాల్పేట, తాడిపర్తి గ్రామాలనుంచే కాకుండా బుద్దారం-చిట్యాల నుంచి ప్రత్యేక బీటీరోడ్డు ఉన్నాయి.
ఇరుకురోడ్లే కారణం
గోపాల్పేట బస్టాండు నుంచి చెన్నూరు గ్రామానికి వెళ్లాలంటే గోపాల్పేటలోని వీధులు ఇరుకుగా ఉండి బస్సులు వెళ్లలేని విధంగా ఉన్నాయి. మినీ బస్సులు మాత్రం వెళ్లడానికి అవకాశం ఉంది. గోపాల్పేట, వనపర్తికి చెందిన ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు రోజూ చెన్నూరుకు విద్యార్థుల కోసం గోపాల్పేట నుంచే వెళ్తుంటాయి. గోపాల్పేట వీధుల్లో ఆర్టీసీ బస్సులు వెళ్లే అవకాశాలు లేవు. గోపాల్పేట చేపలమార్కెట్ సమీపంలోని వాగులోంచి రోడ్డును గ్రామం వెలుపల ఉన్న చెన్నూరు రోడ్డుకు కలిపితే బస్సులు తిరగడానికి అవకాశం ఉంటుంది. అప్పటి మంత్రిగా ఉన్న నిరంజన్రెడ్డి సర్వేచేసి స్థలాన్ని నిర్ణయించండని అధికారులకు సూచించినా పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి గోపాల్పేట, చెన్నూరు గ్రామస్థులు ఈవిషయాన్ని తీసుకెళ్లారు. లింకురోడ్డు నిర్మాణానికి సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
మా పిల్లలు కూడా
- శేషిరెడ్డి, మాజీ సర్పంచి, చెన్నూరు.
గ్రామంలో 7వ తరగతి వరకే ఉంది. 8వ తరగతి చదవడానికి గోపాల్పేట, వనపర్తికి వెళ్లాలి. ఎక్కడికి వెళ్లాలన్నా 3కిలోమీటర్ల దూరం నడవాలి. గోపాల్పేట పాఠశాలలో 1979లో 10వ తరగతి చదివాను. 5సంవత్సరాలు కాలినడకన ఉన్నత పాఠశాలకు వచ్చివెళ్లేవాళ్లం. మాపిల్లలకైనా బస్సు సౌకర్యం వస్తుందనుకున్నాం. వారు కూడా కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి. నేటికీ గ్రామానికి బస్సు రావడంలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది: ఎమ్మెల్యే
[ 06-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. -
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
[ 06-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందని రాహుల్గాంధీ అన్నారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో ఆదివారం జరిగిన జన జాతర సభలో సీఎం రేవంత్రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. -
ప్రయాణ ప్రాంగణాల్లో జన జాతర
[ 06-05-2024]
పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాక చిన్నా.. పెద్దా లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఆర్టీసీ ఉగాది ఛాలెంజ్ పేరిట ప్రతి స్టేజీ వద్ద బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, అందుకు తగ్గట్లు బహుమతులు కూడా ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. -
డిగ్రీ ప్రవేశాలకు వేళాయె
[ 06-05-2024]
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రకటన శుక్రవారం విడుదలైంది. మూడు విడతల్లో జరిగే ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
ఎన్నికల్లోనే వినిపించే రైల్వేకూత
[ 06-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో రైల్వే లైను కోసం నలభై ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. దశాబ్దాలు గడిచినా ఆ కల నేరవేరటం లేదు. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో కృష్ణా-వికారాబాద్ రైల్వే లైను ప్రతిపాదన రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. -
ఎన్నికల సంఘం వాట్సాప్ ఛానల్
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో భారత ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది. -
రేవంత్ పాలనను కుప్ప కూల్చాలి : ఆర్ఎస్ ప్రవీణ్
[ 06-05-2024]
రాష్ట్రంలో రేవంత్ పాలనను కుప్పకూల్చి, కేసీఆర్ పాలనను తిరిగి తెచ్చుకోవాలని నాగర్కర్నూల్ భారాస పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన రోడ్షోలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుతో కలిసి మాట్లాడారు. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యం
[ 06-05-2024]
విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఉండటం వలన, వివాహ శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో ఇళ్లకు తాళాలు వేసి సొంతూరు, ఇతర గ్రామాలు, పట్టణాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు. -
అంజన్నా! నీ భూమి కాపాడుకో
[ 06-05-2024]
అటు రాయచూరు, ఇటు జిల్లా కేంద్రం నారాయణపేట, మరోవైపు మహబూబ్నగర్, హైదరాబాద్ వెళ్లడానికి చక్కని రవాణా సదుపాయం ఉన్న పట్టణం మక్తల్... అంతే కాదు వ్యాపార, ఆధ్యాత్మిక కేంద్రంగానూ ఈ పట్టణానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. -
బడి బాగుకు రూ.8.71 కోట్లు
[ 06-05-2024]
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు రూ.8.71 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పనులు పూర్తి చేసే బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్