విద్యుదాఘాతంతో మత్స్యకారుడి మృతి
విద్యుదాఘాతంతో మత్స్యకారుడు చనిపోయిన ఘటన నారాయణరావుపేట మండలం గుర్రాలగొందిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. చిన్నకోడూరు ఠాణా ఎస్ఐ శివానందం తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కాత రాములు (65) చేపల
సిద్దిపేట అర్బన్, న్యూస్టుడే: విద్యుదాఘాతంతో మత్స్యకారుడు చనిపోయిన ఘటన నారాయణరావుపేట మండలం గుర్రాలగొందిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. చిన్నకోడూరు ఠాణా ఎస్ఐ శివానందం తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కాత రాములు (65) చేపల వేటతో పాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో పొలం పనులు పూర్తి చేసి సమీపంలోని కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అక్కడ విద్యుత్తు తీగలు తెగి పడి ఉండగా గమనించని ఆయన వాటిని దాటి వెళ్లే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. పొద్దుపోయినా రాములు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీకి గాలిస్తుండగా కుంట వద్ద చనిపోయి కనిపించాడు. సమీపంలో విద్యుత్తు తీగలు తెగి పడి ఉన్న విషయాన్ని గుర్తించి విద్యుదాఘాతంతో చనిపోయినట్లు గుర్తించారు. మృతుడి కుమారుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన లైన్మన్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు సిద్దిపేటలో విద్యుత్తు డీఈ మహేష్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేయగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం
హుస్నాబాద్ గ్రామీణం: హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు చనిపోయారు. ఎస్ఐ శ్రీధర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... వంగరామయ్యపల్లికి చెందిన గంగారపు చిన్న వెంకటయ్య (75) ఈ నెల 21న సాయంత్రం హుస్నాబాద్లో జరిగే వార సంతకు సైకిల్పై వెళ్తుండగా పోతారం(ఎస్) గ్రామం సమీపంలో ఆయన్ను లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను తొలుత హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి అనంతరం 108 అంబులెన్స్లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ఇచ్చిన సంస్థలను భాజపా అమ్మేస్తోంది: సీఎం రేవంత్రెడ్డి
[ 26-04-2024]
సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా