ఓటు హక్కు వినియోగం.. ప్రజాస్వామ్యం బలోపేతం!
ఓటు.. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటింది. సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత ఉంటుంది. ఓటు ద్వారా పాలకులను ఎన్నుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈక్రమంలో జాబితాలో నమోదుకు గాను ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది.
జిల్లాలో 4.11 లక్షల మంది..
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
న్యూస్టుడే, మెదక్
ఓటు.. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటింది. సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత ఉంటుంది. ఓటు ద్వారా పాలకులను ఎన్నుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈక్రమంలో జాబితాలో నమోదుకు గాను ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. 18 ఏళ్లు నిండిన వారు పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో గతేడాది క్యాంపస్ అంబాసిడర్లను నియమించింది. జిల్లాలో మొత్తం 30 కళాశాలల్లో అంబాసిడర్లు నియామకం చేపట్టారు. ఒక్కో కళాశాలకు ఒకరిని చొప్పున నియమించారు. వీరు తమ కళాశాల పరిధిలో ఓటరు నమోదుపై చైతన్యం కల్పించారు. ప్రస్తుతం జిల్లాలో 4,11,270 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు.
గ్రామీణుల స్ఫూర్తి..
జిల్లాలోని గ్రామీణ ప్రాంత ఓటర్లలో చైతన్యం వెల్లివిరుస్తోంది. ఇది వరకు జరిగిన ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2018, డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. నర్సాపూర్ నియోజకవర్గం పోలింగ్ శాతం నమోదులో రాష్ట్ర స్థాయిలోనే తృతీయ స్థానంలో నిలిచింది. 2019, జనవరిలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 91.09 శాతం నమోదు కావడం గమనార్హం. లోక్సభ, ప్రాదేశిక ఎన్నికలు వచ్చే సరికి కొంత వరకు తగ్గింది. గతేడాది జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు పురపాలికల్లో 82కు శాతం పైగా నమోదైంది.
ఆన్లైన్లో నమోదుకు అవకాశం...
కేంద్ర ఎన్నికల సంఘం గతేడాది ఓటరు జాబితాలో నమోదుకు యాప్ రూపొందించింది. ‘ఓటరు హెల్ప్లైన్’ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇది నిరంతర ప్రక్రియగా ఉంటుంది. ఇటీవల వెలువరించిన ఓటరు జాబితాలో 4,769 మంది కొత్తగా పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 18-19 ఏళ్ల వయసు వారు మెదక్ నియోజకవర్గంలో 1,509 మంది, నర్సాపూర్లో 970 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి జాతీయ ఓటరు దినోత్సవాన్ని జూమ్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల జిల్లాలో ఓటరు నమోదులో కీలకపాత్ర పోషించిన అంబాసిడర్లు, బీఎల్వోలను సన్మానించనున్నారు. తొలి సారి ఓటు హక్కు పొందిన వారికి కలెక్టరేట్లో కార్డులను పంపిణీ చేయనున్నారు.
చైతన్యపరుస్తున్నాం..
ఓటరు జాబితాలో నమోదు, అవగాహన కల్పించేందుకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్లు విసృత్తంగా పనిచేస్తున్నాయి. ప్రతి క్లబ్కు నోడల్ అధికారి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మహిళా సంఘాలు, నిరక్షరాస్యులతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలలో అవగాహన కల్పించేందుకు ఓటరు అవగాహన ఫోరం ఏర్పాటు చేశాం. అర్హులు జాబితాలో నమోదు చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.
- రాజిరెడ్డి, స్వీప్ అధికారి
జిల్లాలో ఇలా..
నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు
మెదక్ 98,120 1,05,887 2
నర్సాపూర్ 1,02,350 1,04,935 6
పోలింగ్ శాతం నమోదు ఇలా...
ఎన్నికలు శాతం
లోక్సభ 71.56
శాసనసభ 86
పురపాలిక 82.12
ప్రాదేశిక 78.46
పంచాయతీ 91.09
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!